నెల రోజులుగా అనారోగ్యంతో బాధడుతున్న సత్య సాయిబాబా పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఆయన శరీరావయవాలన్నీ పనిచేయడం మానేశాయనీ, చికిత్సకు కూడా స్పందించడం లేదనీ వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా గురించీ, ఆయన నిర్మించిన సామ్రాజ్యం, దాన్ని నిర్వహిస్తున్న ట్రస్టు గురించీ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాబా ఆరోగ్యం గురించీ, ఆయన అనారోగ్యంపాలైన తరువాత ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాల గురించీ వాస్తవాలు వెల్లడి కాకుండా నిర్వాహకులు ఎంతగా ప్రయత్నిస్తుంటే అంతగా ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. బాబాకు దైవత్వం ఆపాదించి, ఆయన చుట్టూ నిర్మించిన సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల (మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ) ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎవరు ఏలాలన్న దానిపై ట్రస్టు సభ్యుల మధ్య యుద్ధం సాగుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబా-బందీ పేరుతో ఆంధ్ర జ్యోతి పత్రికలో దిగ్భ్రాంతికరమైన అనేక విషయాలు వచ్చాయి. సాయిబాబా ఆశ్రమానికి అతి సన్నిహితులైన అనేక మంది అక్కడ జరుగుతున్న అక్రమాలపై ప్రకటనలు చేస్తున్నారు. పుట్టపర్తి ఆశ్రమం ఒక మినీ స్విస్ బ్యాంకు మాదిరిగా నల్లడబ్బుకూ, అక్రమార్జనా పరుల సంపాదన దాచుకోడానికీ కేంద్రంగా మారిందని పత్రిక రాసింది. మంత్రులూ, బడా బాబులూ తమ అక్రమ సంపాదనలో పెద్ద మొత్తాలు పుట్టపర్తిలో దాచుకున్నారనీ, బాబా ఆరోగ్యం విషమిస్తుండడంతో 'దీపముండగానే ఇల్లు చక్కబెట్టు'కునే చందంగా వారంతా తమతమ సొమ్ములను ఇతర ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారని, ఆన్లైన్లో కూడా ఎడతెరిపిలేకుండా డబ్బు విదేశాలకు బదిలీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బాబా ఆశ్రమంలో పేరుకుపోయిన బంగారం, విలువైన వజ్రాలూ, నగలూ వగైరాలను ట్రక్కుల్లో రహస్యంగా బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అన్నిటికీ మించి సాయిబాబాను ట్రస్టులోని కొంతమంది సభ్యులు బందీలుగా చేశారనీ, ఆయనకు నిద్ర మాత్రలు ఇస్తున్నారనీ, సరైన మందులు, ఆహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనీ రాశారు. ఇంకా ఘోరంగా ఆయన శరీరంపై దెబ్బల గుర్తులు ఉన్నాయనీ, ఆయనను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా వేధించి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
నెల రోజులుగా సాయిబాబా గురించీ, ఆయన సామ్రాజ్యంలో జరుగుతున్న చీకటి వ్యవహారాలగురించీ ఇన్నిన్ని వార్తలొస్తూ ఉంటే ట్రస్టు గానీ, ప్రభుత్వం గానీ నోరుమెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వార్తల్లో నిజం లేదా? లేకపోతే లేదని చెప్పొచ్చు. కాని చెప్పరు. పోనీ ఆ వార్తలు అసలు పట్టించుకోదగ్గవి కావా? కాని సాయిబాబా చిన్న వ్యక్తికాదు. ఏదో ఒక మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోనక్కరలేదా? కాని సాయిబాబా ఆంతరంగికుల్లో అనేకమంది ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాని అది నోరు విప్పడం లేదు. మౌనం వీడడం లేదు. మౌనం అర్థంగీకారం కదా! అంటే ఈ చీకటి వ్యవహారాలతో (కేంద్ర, రాష్ట్ర, కర్నాటక) ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులకూ లింకులున్నాయని వస్తున్న వార్తలను నమ్మాలా?
అధికారం, డబ్బు చుట్టూ..
ఒక సామాన్య వ్యక్తికి దైవత్వం ఆపాదించి, భగవత్ స్వరూపునిగా ప్రజలను నమ్మించే ప్రయత్నాల వెనుకనున్న కారణాలేమిటో సాయిబాబా చివరి ఘడియల్లో జరుగుతున్న ఈ పరిణామాలు స్పష్టంగా మన ముందుంచుతున్నాయి. ప్రజల్లో చాలాచాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాబా దైవ స్వరూపుడైతే ఆయన చుట్టూ ఈ చీకటి సామ్రాజ్యం ఎలా నిర్మించబడింది? ఆయనకు నల్లడబ్బు, అక్రమ లావాదేవీలతో సంబంధం ఉన్నదా లేదా అన్నది ప్రశ్నకాదు. తన కిందనే ఇంత జరుగుతున్నా ఆయన తెలుసుకోలేదా, లేక తెలిసి ఊరుకున్నారా? తెలుసుకోలేకపోతే ఆయనకూ మామూలు మనుషులకూ తేడా లేదు. తెలిసీ ఊరుకుంటే ఆయన కూడా ఈ అక్రమాలకు బాధ్యుడవుతారు.
సాయిబాబా దేవుడని నమ్మేవారిలో పామరులకన్నా, విద్యాధికులూ, ఉన్నత స్థానాల్లో ఉన్నవారే ఎక్కువ. ఆయనను ఆరాధించేవారిలో ఐఎఎస్లు, ఐపిఎస్లే కాదు, దేశాధినేతల నుండి మరత్రులు, కార్పొరేట్ అధిపతులు, శాస్త్రవేత్తలు కూడా అనేకమంది ఉన్నారు. తను 'సృష్టించే' విబూదితో ప్రజల అనారోగ్య బాధలను సాయిబాబా తొలగిస్తారని వారి నమ్మకం. కాని బాబా ఆరోగ్యం కాపాడడానికి స్వదేశీ, విదేశీ వైద్యులూ, పరికరాలూ ఎందుకు అవసరమైనాయో వారు చెప్పరు. బాబా విబూది ఆయనకు ఎందుకు పనికిరాలేదో మాట్లాడరు. ఈ ప్రశ్నలన్నీ ముందుకొస్తే జవాబు చెప్పలేక తప్పుకోడానికి సాయిబాబా చేసే సేవలగురించి చెబుతారు. ఆయన కట్టించిన విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆయన ట్రస్టు తరఫున జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పి అందుకు ఆయనను పూజించాలంటారు.
నిజమే, సాయిబాబా ట్రస్టు తరఫున ప్రజలకు అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న మాట వాస్తవమే. భక్తులనుండి వసూలు చేసిన డబ్బుతో ఆయన నడుపుతున్న సేవా సంస్థలూ, కార్యక్రమాలూ అనేక మంది పేద ప్రజలకు అనేక విధాలా మేలు చేస్తున్న సంగతీ నిజమే. అందుకు బాబాను వేనోళ్లా కొనియాడాలి. ఆయనను కీర్తించాలి. కాని బాబానే కాదు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు అనేకమంది ఉన్నారు. విరాళాలు సేకరించీ, సేకరించకుండా తమ 'స్వంత' డబ్బుతో కోట్ల రూపాయల సేవాకార్యక్రమాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. సాయిబాబా మాదిరిగా వారంతా కూడా ప్రశంసనీయులే. సమాజ సేవకులే. కాని వాళ్లంతా దేవుళ్లు కానప్పుడు సాయిబాబాను దేవుని చేయడమెందుకు, ఆయన చుట్టూ మహిమలు, మాయలు చేర్చి ప్రజలను మోసగించడమెందుకు?
ఇప్పుడు చూస్తుంటే అనేకమంది మంత్రులూ, అధికారులూ, మహామహులంతా బాబాను నిత్యం దర్శించుకోవడం వెనుక ఆధ్యాత్మికత కన్నా ఆర్థికమే ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాబా ఆశ్రమం అక్రమ ఆర్థిక లావాదేవీలకే కాకుండా పదోన్నతులు, ప్రజాప్రతినిధులు- కార్పొరేట్లు- కాంట్రాక్టర్ల మధ్య రహస్య డీల్లకు కేంద్రంగా ఉన్నదని గతంలోనే లోకోక్తిగా చెబుతుండేవారు. నేడు మీడియాలో వస్తున్న వార్తలు ఈ విషయాన్ని రూఢిపరుస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల నేటి మౌనం వెనుక కారణం ఇదేనా? తీగలాగితే డొంక కదులుతుందన్న భయంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారా? సమాధానం రావాలి!
మూఢనమ్మకాల వ్యాప్తి
ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఇప్పుడు కూడా సాయిబాబా చుట్టూ మూఢనమ్మకాల వాప్తికి అనేక రకాలా ప్రయత్నిస్తున్నారు. బాబా భౌతిక దేహం ముఖ్యం కాదని ట్రస్టు సభ్యుడైన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉవాచ. మరోవైపున బాబా మైనపు విగ్రహం పాదాల్లోంచి గంధం వచ్చిందని మరో ప్రచారం. బాబా ఆరోగ్యం బాగుపడాలని ప్రజలంతా ప్రార్ధనలు చేయాలని ఒక ట్రస్టు సభ్యుడు పిలుపునిచ్చాడు. చాలా మంది ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. కొంతమంది యజ్ఞయాగాలు చేస్తున్నారు కూడా. ఇవన్నీ ఏమీ పనిచేయవని వీరికి తెలియంది కాదు. కాని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు శాస్త్రీయమైన, సహేతుకమైన సమాధానాలు వారికి లభిస్తే మూఢనమ్మకాలకు వారు దూరమైపోతారు. కనుక అటువంటి హేతు దృష్టి వారిలో కలగకుండా పూజలూ, పునస్కారాలవైపు మళ్లింపు. మరి ఈ ఆసుపత్రి చికత్సలూ, డాక్టర్ల ప్రయత్నాలూ ఎందుకనే దానికి సమాధానం చెప్పడు. బాబా దైవత్వం గురించీ, గాలిలోనుండి బంగారు ఆభరణాలు సృష్టించే ఆయన మహిమల గురించీ వల్లించే ఒక పెద్దాయన బాబాకు అన్నం పెట్టకుండా ఆకలికి గురిచేస్తున్నారని చెబుతాడు. తన దగ్గరకు వచ్చేసరికి మహిమలన్నీ ఏమైనాయన్నది ప్రశ్న. పుట్టపర్తిలో వెలసిన సత్తెమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించడంవల్లే బాబాకు కష్టాలు వచ్చాయని పెద్ద ప్రచారం చేశారు. ఆ విగ్రహం వెదికి పట్టుకుని తిరిగి ప్రతిష్టించారు. దాంతో బాబా కోలుకుంటారని చెప్పారు. ప్రజల సెంటిమెంటు పేరుతో ఇటువంటి అనేక మూఢనమ్మకాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పుకోవాలి. డబ్బు, అధికారం, కుటుంబ తగాదాలు, అనారోగ్యం, అశాంతి అందరి మనుషుల్లాగే బాబాకూ వచ్చాయి. అందరిలాగే ఆయనకూ కష్టాలూ, నష్టాలు వచ్చాయి. అందువల్ల ఈ సమయంలో ఆయనపట్ల సానుభూతి చూపడం, ఆయన కోలుకోవాలని కోరుకోవడం మానవత్వం ఉన్న మనుషులంతా చేస్తారు. అందులోనూ తన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి మేలు చేస్తున్న బాబా శారీరకంగా ఇబ్బందుల్లో పడ్డారంటే బాధపడేవాళ్లు ఎక్కువమంది ఉంటారు. అదే సమయంలో సత్య సాయి ట్రస్టు పేరుతో ఆయన అనుయాయులమని చెప్పుకునే వారు చేస్తున్న అక్రమ లావాదేవీలను ప్రశ్నించకుండా ఉండకూడదు. బాబా చుట్టూ మూఢనమ్మకాలు వ్యాపింపజేయడాన్ని అనుమతించకూడదు................ప్రజాశక్తి పత్రికలో ఎస్. వెంకటరావు గారి వ్యాసం....
నెల రోజులుగా సాయిబాబా గురించీ, ఆయన సామ్రాజ్యంలో జరుగుతున్న చీకటి వ్యవహారాలగురించీ ఇన్నిన్ని వార్తలొస్తూ ఉంటే ట్రస్టు గానీ, ప్రభుత్వం గానీ నోరుమెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వార్తల్లో నిజం లేదా? లేకపోతే లేదని చెప్పొచ్చు. కాని చెప్పరు. పోనీ ఆ వార్తలు అసలు పట్టించుకోదగ్గవి కావా? కాని సాయిబాబా చిన్న వ్యక్తికాదు. ఏదో ఒక మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోనక్కరలేదా? కాని సాయిబాబా ఆంతరంగికుల్లో అనేకమంది ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాని అది నోరు విప్పడం లేదు. మౌనం వీడడం లేదు. మౌనం అర్థంగీకారం కదా! అంటే ఈ చీకటి వ్యవహారాలతో (కేంద్ర, రాష్ట్ర, కర్నాటక) ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులకూ లింకులున్నాయని వస్తున్న వార్తలను నమ్మాలా?
అధికారం, డబ్బు చుట్టూ..
ఒక సామాన్య వ్యక్తికి దైవత్వం ఆపాదించి, భగవత్ స్వరూపునిగా ప్రజలను నమ్మించే ప్రయత్నాల వెనుకనున్న కారణాలేమిటో సాయిబాబా చివరి ఘడియల్లో జరుగుతున్న ఈ పరిణామాలు స్పష్టంగా మన ముందుంచుతున్నాయి. ప్రజల్లో చాలాచాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాబా దైవ స్వరూపుడైతే ఆయన చుట్టూ ఈ చీకటి సామ్రాజ్యం ఎలా నిర్మించబడింది? ఆయనకు నల్లడబ్బు, అక్రమ లావాదేవీలతో సంబంధం ఉన్నదా లేదా అన్నది ప్రశ్నకాదు. తన కిందనే ఇంత జరుగుతున్నా ఆయన తెలుసుకోలేదా, లేక తెలిసి ఊరుకున్నారా? తెలుసుకోలేకపోతే ఆయనకూ మామూలు మనుషులకూ తేడా లేదు. తెలిసీ ఊరుకుంటే ఆయన కూడా ఈ అక్రమాలకు బాధ్యుడవుతారు.
సాయిబాబా దేవుడని నమ్మేవారిలో పామరులకన్నా, విద్యాధికులూ, ఉన్నత స్థానాల్లో ఉన్నవారే ఎక్కువ. ఆయనను ఆరాధించేవారిలో ఐఎఎస్లు, ఐపిఎస్లే కాదు, దేశాధినేతల నుండి మరత్రులు, కార్పొరేట్ అధిపతులు, శాస్త్రవేత్తలు కూడా అనేకమంది ఉన్నారు. తను 'సృష్టించే' విబూదితో ప్రజల అనారోగ్య బాధలను సాయిబాబా తొలగిస్తారని వారి నమ్మకం. కాని బాబా ఆరోగ్యం కాపాడడానికి స్వదేశీ, విదేశీ వైద్యులూ, పరికరాలూ ఎందుకు అవసరమైనాయో వారు చెప్పరు. బాబా విబూది ఆయనకు ఎందుకు పనికిరాలేదో మాట్లాడరు. ఈ ప్రశ్నలన్నీ ముందుకొస్తే జవాబు చెప్పలేక తప్పుకోడానికి సాయిబాబా చేసే సేవలగురించి చెబుతారు. ఆయన కట్టించిన విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆయన ట్రస్టు తరఫున జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పి అందుకు ఆయనను పూజించాలంటారు.
నిజమే, సాయిబాబా ట్రస్టు తరఫున ప్రజలకు అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న మాట వాస్తవమే. భక్తులనుండి వసూలు చేసిన డబ్బుతో ఆయన నడుపుతున్న సేవా సంస్థలూ, కార్యక్రమాలూ అనేక మంది పేద ప్రజలకు అనేక విధాలా మేలు చేస్తున్న సంగతీ నిజమే. అందుకు బాబాను వేనోళ్లా కొనియాడాలి. ఆయనను కీర్తించాలి. కాని బాబానే కాదు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు అనేకమంది ఉన్నారు. విరాళాలు సేకరించీ, సేకరించకుండా తమ 'స్వంత' డబ్బుతో కోట్ల రూపాయల సేవాకార్యక్రమాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. సాయిబాబా మాదిరిగా వారంతా కూడా ప్రశంసనీయులే. సమాజ సేవకులే. కాని వాళ్లంతా దేవుళ్లు కానప్పుడు సాయిబాబాను దేవుని చేయడమెందుకు, ఆయన చుట్టూ మహిమలు, మాయలు చేర్చి ప్రజలను మోసగించడమెందుకు?
ఇప్పుడు చూస్తుంటే అనేకమంది మంత్రులూ, అధికారులూ, మహామహులంతా బాబాను నిత్యం దర్శించుకోవడం వెనుక ఆధ్యాత్మికత కన్నా ఆర్థికమే ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాబా ఆశ్రమం అక్రమ ఆర్థిక లావాదేవీలకే కాకుండా పదోన్నతులు, ప్రజాప్రతినిధులు- కార్పొరేట్లు- కాంట్రాక్టర్ల మధ్య రహస్య డీల్లకు కేంద్రంగా ఉన్నదని గతంలోనే లోకోక్తిగా చెబుతుండేవారు. నేడు మీడియాలో వస్తున్న వార్తలు ఈ విషయాన్ని రూఢిపరుస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల నేటి మౌనం వెనుక కారణం ఇదేనా? తీగలాగితే డొంక కదులుతుందన్న భయంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారా? సమాధానం రావాలి!
మూఢనమ్మకాల వ్యాప్తి
ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఇప్పుడు కూడా సాయిబాబా చుట్టూ మూఢనమ్మకాల వాప్తికి అనేక రకాలా ప్రయత్నిస్తున్నారు. బాబా భౌతిక దేహం ముఖ్యం కాదని ట్రస్టు సభ్యుడైన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉవాచ. మరోవైపున బాబా మైనపు విగ్రహం పాదాల్లోంచి గంధం వచ్చిందని మరో ప్రచారం. బాబా ఆరోగ్యం బాగుపడాలని ప్రజలంతా ప్రార్ధనలు చేయాలని ఒక ట్రస్టు సభ్యుడు పిలుపునిచ్చాడు. చాలా మంది ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. కొంతమంది యజ్ఞయాగాలు చేస్తున్నారు కూడా. ఇవన్నీ ఏమీ పనిచేయవని వీరికి తెలియంది కాదు. కాని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు శాస్త్రీయమైన, సహేతుకమైన సమాధానాలు వారికి లభిస్తే మూఢనమ్మకాలకు వారు దూరమైపోతారు. కనుక అటువంటి హేతు దృష్టి వారిలో కలగకుండా పూజలూ, పునస్కారాలవైపు మళ్లింపు. మరి ఈ ఆసుపత్రి చికత్సలూ, డాక్టర్ల ప్రయత్నాలూ ఎందుకనే దానికి సమాధానం చెప్పడు. బాబా దైవత్వం గురించీ, గాలిలోనుండి బంగారు ఆభరణాలు సృష్టించే ఆయన మహిమల గురించీ వల్లించే ఒక పెద్దాయన బాబాకు అన్నం పెట్టకుండా ఆకలికి గురిచేస్తున్నారని చెబుతాడు. తన దగ్గరకు వచ్చేసరికి మహిమలన్నీ ఏమైనాయన్నది ప్రశ్న. పుట్టపర్తిలో వెలసిన సత్తెమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించడంవల్లే బాబాకు కష్టాలు వచ్చాయని పెద్ద ప్రచారం చేశారు. ఆ విగ్రహం వెదికి పట్టుకుని తిరిగి ప్రతిష్టించారు. దాంతో బాబా కోలుకుంటారని చెప్పారు. ప్రజల సెంటిమెంటు పేరుతో ఇటువంటి అనేక మూఢనమ్మకాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పుకోవాలి. డబ్బు, అధికారం, కుటుంబ తగాదాలు, అనారోగ్యం, అశాంతి అందరి మనుషుల్లాగే బాబాకూ వచ్చాయి. అందరిలాగే ఆయనకూ కష్టాలూ, నష్టాలు వచ్చాయి. అందువల్ల ఈ సమయంలో ఆయనపట్ల సానుభూతి చూపడం, ఆయన కోలుకోవాలని కోరుకోవడం మానవత్వం ఉన్న మనుషులంతా చేస్తారు. అందులోనూ తన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి మేలు చేస్తున్న బాబా శారీరకంగా ఇబ్బందుల్లో పడ్డారంటే బాధపడేవాళ్లు ఎక్కువమంది ఉంటారు. అదే సమయంలో సత్య సాయి ట్రస్టు పేరుతో ఆయన అనుయాయులమని చెప్పుకునే వారు చేస్తున్న అక్రమ లావాదేవీలను ప్రశ్నించకుండా ఉండకూడదు. బాబా చుట్టూ మూఢనమ్మకాలు వ్యాపింపజేయడాన్ని అనుమతించకూడదు................ప్రజాశక్తి పత్రికలో ఎస్. వెంకటరావు గారి వ్యాసం....