Saturday, December 31, 2011

Wednesday, June 15, 2011

యోగ్యతాపత్రాన్ని మన మాటల్లో వ్రాయడం కన్నా చలం భాషలో వ్రాస్తేనే దానికి సార్థకత. అందుకే చలం వ్రాసిన యోగ్యతాపత్రం యధాతధంగా. (వికిపీడియా సహకారంతో) నేడు శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఆయనను మనస్పూర్తిగా మననం చేసుకుంటూ...... 


1

ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథం లోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురు మని, నమ్మిన కాళ్ళ కింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. "తూచవద్దు, అనుభవించి పలవరించ" మన్నాడు శ్రీ శ్రీ.
చెలం చూశాడు. మాట్లాడాడు. కాని శ్రీ శ్రీని ఎరగడు. రుక్మిణీనాథ శాస్త్రి ఒక ఉదయం వచ్చి-
"ఇదేమిటి? ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగుతున్నారు? శ్రీ శ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారమంతా వూడ్చుకు పోతోవుంటే!
హృదయాలమీది పెంకులు పగిలి పోతున్నాయి. బైట వినబడుతున్నాయి. ఇట్లా రండి, రోడ్డు మీదికి," అన్నాడు.
అంతవరకు శ్రీ శ్రీ కవిత్వాన్ని ఎరక్క పోవడం చెలంలో క్షమించతగిన విషయం కాదు. కాని చాలావాటికి క్షమించాలి చెలాన్ని.
కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చెలానికి impatience, అనుమానం. శబ్ద సౌందర్యంలో తృప్తిపడి సంతోషించవలసిందే కాని, చెప్పే దానికి అర్థం వెదకటం అవివేకం అని. కాని నీరసపు కళాచతురులమల్లే అందాన్ని దూరం నుంచి చూచి సంతోషించీ, విచారించీ, తప్పుకోవడం చెలానికి చాతకాదు. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి -ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోరిక. ఆ పని స్త్రీలూ చెయ్యరు, దేశనాయకులూ చెయ్యరు. కవులూ చెయ్యరు -ఎంకీ, శ్రీ శ్రీ తప్ప. కవిత్వంలోనూ జీవితంలోనూ, economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా.
తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వ మంటాడు చెలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలు అంత అభిమానం చెలానికి. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.
హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, ఈటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు -ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు- అతని హృదయంలోంచి మన హృదయంలోకి direct గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవలనిపిస్తుంది.
ఎందుకంటే-
కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే, శ్రీ శ్రీ అందరిబాధనూ తనలో పలికిస్తాడు.
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ.

2

శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలి దెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మర ఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గు స్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగ వేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపచేస్తారు. బుద్ధి వున్న వాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి. కీర్తి మర్యాదల్ని డిగ్రీలతో కొలుచుకుంటో అగచాట్లు పడి కులికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇనప పొరల వెనక అణగి చచ్చి, కొనవూపిరితో ఆరిపోలేక మిణుకు మిణుకు మంటో వుంటుంది. అటువంటి వాళ్ళకి ఉత్త అర్థంలేని న్యూసెన్సుగా తోస్తాయి శ్రీ శ్రీ పద్యాలు. సొంత ఇల్లూ, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకూ, bank-account, వొట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాలమీదినుంచి యీ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖ పట్నం సముద్రంలో నల్లరాళ్ళ మీద అలలు విఫలమైనట్లు దొర్లిపోతాయి. తాంబూలం వేసుకుంటో, పుస్తకాన్ని ముడిచిపెట్టి "దేనికోసం? ఎందుకు? ఏమిటి కావాలంటాడు? ఏమిటి ఈ వేదన పాపం?" అని కొంచెం ఆలోచిస్తారేమో!
అదీ సాధారణంగా కల్చెర్డు రీడర్సు సంగతి.
కవుల సంగతి వేరు. ఉత్తమ కవిత్వం ఎప్పుడు ప్రచురితమవుతుందా అని వెయ్యికన్నులతో కనిపెడుతూ వుంటారు. కనపడ్డదా, ఆనాటినుంచి అతి శ్రద్ధగా ఆ కవిత్వాన్ని గురించీ, కవిని గురించీ, ప్రచారం మొదలు. సారస్వత పోషకులతో, ఉచితులతో ఎట్లాగో ఓలాగు ఆ కొత్త కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకుని వచ్చి వ్యక్తీ, కాల పరిస్థితులను బట్టి చప్పరించడమూ- తమ కావ్యాలనించో, ఇతర కావ్యాలనించో, సంగ్రహించబడిన దనడమూ -విప్లవ కారణ మనడమూ, నిర్జీవమనడమూ -కవిని గురించి చాలా righteous indignation తోనో, జాలిపడుతోనో, చాలా సానుభూతి దయా వున్నట్లు ప్రస్తావించడమూ వీళ్ళ టెక్నిక్.

"శ్రీ శ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి" అని కవిని అడిగారా, అతను "దానికేం చాలా బావుంటుంది. ఓ బాగా వ్రాస్తాడు. నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-" అన్నాడా, అతను చాలా సన్నిహిత ప్రియమిత్రు డన్నమాట కవికి. చిరునవ్వుతో శ్రీ శ్రీ విషయమై మీ కళ్ళలో కారం కొట్టిపోతున్నాడు. పొగడ్తలతో మీ నోట్టో విషం కక్కి పోతున్నాడు జాగ్రత్త!
శ్రీ శ్రీ కవిత్వానికి Motive springs చూపుతాడు ఆ మిత్రుడు. తప్పదు. "ఆకలి పాట ---కటిక దరిద్రుడు అతను -తిండిలేక వీథులు తిరిగాడు--- పాపం" అంటో ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించే అతని హృదయోద్రేకాన్ని explain చేస్తాడు.
నిజమా? నిజమైతే శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు."
ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యం ఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలి మీద గీతం వ్రాశాడు.
అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీదపడి బతుకుతున్న యీ Parasite కవివరేణ్యులు శ్రీ శ్రీ ని విమర్శించడానికి సాహసిస్తున్నారు. "అభివృద్ధికి రాతగినవాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారు.
ప్రపంచంలో ఈనాడు ప్రతిదేశంలోనూ నూతన యుగ నిర్మాణం కోసం ధర్మ యుద్ధం చేసే ధీరులు ఈ నాడూ పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే, అనాదిగా తనకోసం ప్రయత్నించే dreamers మీద ఈ లోకం వర్షిస్తున్న కర్కశత్వం, వరించి ఆవేశించిన rotten channels ఈ నాటి సారస్వత సభాపతులు. తాము బతికివున్న కాలంలో పాత వాంగ్మయం మీద తిరగబడ్డ ఈ బతికివున్న శవాలు ఈ నాటికీ తాము ముప్ఫైయేళ్ళక్రింద చేసిన తిరుగుబాటు ఇతరుల ఖర్చు మీద కాఫీ యిడ్డెన్ల ముందు Inspire ఐ ప్రగల్భాలు పలికే ఈ రసికులు, తాము తెచ్చిన సంస్కారమే యింక సారస్వతానికి శాశ్వతావధి అని నిరూపించి, ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చెయ్యడానికి మీదికి ఉరికే భగీరథ ప్రవాహాల్ని ఊట్టి రబ్బిష్ చెత్తల కట్టలతో ఆపాలని ప్రయత్నిస్తున్నారు.
మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి "శ్రీ శ్రీ ఇప్పుడు వ్రాస్తున్న కొత్త తనాలకే ప్రజలు ఇంకా అలవాటు కాలేదే, ఇంకా యీ సర్రియలిజం తెస్తే అసలు గాభరా పడి చదవడమే మానేస్తారేమో!" అన్నాడు చెలం. Man of little faith.
శ్రీ శ్రీ ఏం జవాబు చెపితేనేం! మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త వలె చిరునవ్వు నవ్వాడు. తన వ్రాతలు అంగీకారాన్ని పొందేందుకు ఇరవైయేళ్ళ తర్వాత ఇంకా ఆశ వదలక కాచుకొనివున్న చెలం మానవత్వం మీద శ్రీ శ్రీ కి వున్న గాఢ విశ్వాసాన్ని చూసి తలవొంచాడు.
శ్రీ శ్రీ కవిత్వాన్ని analyse చేసి, ముక్కల కింద ఎత్తి చూపి, కవీ, మనిషీ, శైలీ, బాల్యం, కవిత్వం, ఛందస్సు, ఎదిరింపు, కొత్తపోకడలు, పాత influences అంటో వాటి శ్రేష్టత్వాన్ని explain చెయ్యడానికి చెలానికి అధికారమూ, అర్హతా లేవు. చెలానికి విమర్శే చాతనైతే కొత్త వ్రాతల్ని పాత పత్రికల్లో చీల్చి, చెండాడి గొప్పతనం లేదని నిరూపించి, ఘనత సంపాయించి, సంవత్సరానికోసారి నిండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత, కళా, నాటక, నృత్య, గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం, ఏమో అదృష్టం అపూర్వంగా కలసివస్తే జాయింటు సెక్రటరీ కూడా సంపాయించేవాడు కాడా!
శ్రీ శ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి, పద్యం పదిసార్లు చదవండి, ఏమీ అర్థం కాలేదా -ఏ యువకుడికో, భిక్షుకుడికో, death-bed present గా పంపండి. పారెయ్యకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతులో పుస్తకం. Pass it on.
పదేళ్ళు ఆగండి. ఈలోపల ఆస్తి సంపాదించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక జీవితంలో ఇంకా ఏవన్నా మిమ్మల్ని అమితంగా influence చేసినవి వుంటే -మళ్ళీ కొత్త కాపీ కొని శ్రీ శ్రీ పద్యాల్ని చదవండి. అప్పుడన్నా అర్థమవుతుందేమో.
స్వయంగా చదవండి. చదివిం తరువాత శ్రీ శ్రీని చూడాలనిపిస్తే స్వయంగా చూడండి. ఎవరి అభిప్రాయమూ అడగకండి. ముఖ్యం, కవి అనేవాణ్ణి -చెప్పినా వినకండి.

3

కవిత్వపు కాలం అంతమయింది. నగలూ, అపురూపపు కళలూ, సూర్య కిరణాల్ని ఎరగని అందాలూ గతిస్తున్నట్టే కవిత్వమూ గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతి పట్టింది. "ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది? ఏం చేస్తోంది?" అని దిఖ్ఖరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీ శ్రీ కవిత్వం ప్రత్యుత్తరం. కొద్దిరోజుల్లో నేడు విర్రవీగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీ శ్రీ నీడ కింద నించుని తమ ఉనికిని సమర్థించుకో వలసిన గతి వస్తుంది.
చెప్పుకో తగిన ఒక్క కవీ, మన కృష్ణ శాస్త్రి ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవితా వర్షం పాయలై, దేశాల వెంట ప్రవహించి, చివరికి సైడు కాలువల్లో పడుతున్న సమయాన, తన భీషణాతప జ్వాలలతో ఆవిరి పొగలు లేపి ఆకాశ మార్గాన విహరింప జేసి, రక్షించాడు శ్రీశ్రీ.
ఎవరినించి దొంగిలించామో వాళ్ళని క్షమించడం కష్టం.
కృష్ణశాస్త్రి పద్యాలు చదివి, అర్థం విడదీసి, "ఏది గొప్పతనం చూప" మంటే చూపలేక పోయినాను పూర్వం. శ్రీ శ్రీ అగ్గిపుల్లలోనూ, కుక్కపిల్లలోనూ, కవిత్వం చూపలేను ఈనాడూ.

అగ్గిపుల్లవంక -ముఖ్యం పుచ్చిన అగ్గిపుల్ల వంక చాలాసేపు చూడమంటాను.
కుక్కపిల్లని -ముఖ్యం తల్లిచచ్చిన దిక్కులేని గజ్జికుక్కపిల్లని పెంచమంటాను.
మెరీనాలో గాలిలో ఊగే (రేడియోలేని రోజులవి) flower-bed పుష్పశయ్య కేసి చూస్తున్న నన్ను చూచి, "ఈ పువ్వులు పాడు పువ్వులు: ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన అంతా ఈ పువ్వులే" అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను.
"ఏమిటి వంతెన మీద నుంచుని చూస్తున్నావు?"
"సంధ్య కేసి"
"ఎవరు ఆమె?"
అంటే ఏం మాట్లాడగలిగాను?
పాతపదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు, కవిత్వంలోవీ, జీవితంలోవీ ఇంక మళ్ళీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీ శ్రీ.
"ధ్వంసం చేసి రోడ్డు వేశాడు-"
"పదండి ముందుకు
పదండి తోసుకు-" అంటున్నాడు.
తాము వేటిని ఎదిరించలేక ప్రతిదినమూ లొంగిపోతున్నారో, ఆ నిరంకుశాధికారుల నెత్తిమీద నాలుగు దెబ్బలు కొట్టాడని యువకులు చెలం మీదచూపే అభిమానం చాలదు శ్రీ శ్రీ కి. తామూ యింకో నాలుగు దెబ్బలు కొట్టగల శక్తిని తెచ్చుకోమంటున్నాడు మనుషుల్ని.
శ్రీ శ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సులోంచి పాత మూలుగులూ, serenadings, మూర్చలూ, వేదాంతాలూ, మత్తులూ పోయి- దేశాలకి, ఉత్సాహాలకి, కదిలిపోయే యువక సైన్యాలకి, నూతన యుగ నిర్మాతలకి background music కింద marching band కింద, కొత్త రక్తాన్ని కదను తొక్కించే సంగీతం వినపడ్డంలేదా, శ్రీ శ్రీ గీతాల్లో: వినపడకపోతే-
"ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన
సోమరులారా చావండి!"
ప్రపంచం ఎట్లాపోతేనేం? మీకెందుకు లెండి.
"అదృష్టవంతులు మీరు ---
వడ్డించిన విస్తరి మీ జీవితం"
ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు, భావ కవిత్వం ఇవన్నీ మీ ప్రియమిత్రులు, యుద్ధాలనించి, ముష్టివాళ్ళనించి, విప్లవాల నించి, అనాథల నించి, అశాంతినించి, సత్యాన్నించి, మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు.
వీళ్ళందరి అధ్యక్షుడు మీ దేవుడు. మీ డబ్బుకి దాసుడు. మీ నంగిపూజలకీ స్వార్థ ప్రార్థనలకీ వశ్యుడు. దొంగభక్త పరాధీనుడు.
ఇన్ని బాంబులు కురుస్తున్నా, ఇన్ని మర ఫిరంగులు మోగుతున్నా, ఇన్ని చెరసాలలు నిండుతున్నా, ఇన్ని విప్లవాలు జరుగుతున్నా ఇంకా విశదం కాదా మీకు -పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూల నుంచి కూలిపోతున్నాయని! ఇంక లాభం లేదని మీ ఆటలు సాగవని!
ఈ విధ్వంసం అనంతరం నవ ప్రపంచం నిర్మాణ కర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీ శ్రీ.
ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, scandals లేవో ఆలోకాన్ని dream చేస్తున్నాడు యీ కవి.
మీ ఆనందంకన్న ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు, నరకమంటే అట్లాంటి లోకం.
శ్రీ శ్రీ ఎందుకు నచ్చుతాడు?
ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటో, దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీ శ్రీ!
దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు మూట కట్టుకుని కులికే మీకు అర్థంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, ఇవన్నీ అర్థంకాక గట్టిగా సృష్టినే ప్రశ్నిస్తున్న యువకుల లక్ష కంఠాల్ని ఏకంచేసి పలుకుతున్నాడు శ్రీ శ్రీ.
మీ కెందుకు లెండి. పట్టు దిళ్ళలో తలలు దూర్చి, భాగ్యవంతుల పాలిటి ఈశ్వరుడి మీద స్తోత్ర శ్లోకాలు చదువుతో- "All is well with the world" అనుకుంటో నిద్రపొండి.
నిర్భాగ్యులం కొందరం మాకు---
"అన్నీ సమస్యలే, సందేహాలే."
"ఏవో,
ఏవేవో, ఏవేవో
ఘోషలు వినబడుతున్నాయ్!గుండెలు విడిపోతున్నాయ్!"
మీకు కవిత్వం కావాలా?
అరుగో ఆ మూల పాతగోరీల కేసి మొహాలు తిప్పుకొని నగిషీలు చెక్కుతున్నారు -పాత పదాలకీ, ఊహలకీ చిత్రికలు పట్టి- ప్రేయసి మెల్లకన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు -రామాయణాలూ, శర్మిష్ఠలూ వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు, "భారతి" కి నైవేద్యంగా.
వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపొండి.
"రాబందుల రెక్కల చప్పుడు
పయోధర ప్రచండ ఘోషం
ఝంఝానిల షడ్జధ్వానం"
విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి.
చెలం బెజవాడ 17-07-1940

Friday, April 22, 2011

అంత్య దశలో బాబా అనుమానాల ఆశ్రమం

నెల రోజులుగా అనారోగ్యంతో బాధడుతున్న సత్య సాయిబాబా పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఆయన శరీరావయవాలన్నీ పనిచేయడం మానేశాయనీ, చికిత్సకు కూడా స్పందించడం లేదనీ వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా గురించీ, ఆయన నిర్మించిన సామ్రాజ్యం, దాన్ని నిర్వహిస్తున్న ట్రస్టు గురించీ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాబా ఆరోగ్యం గురించీ, ఆయన అనారోగ్యంపాలైన తరువాత ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాల గురించీ వాస్తవాలు వెల్లడి కాకుండా నిర్వాహకులు ఎంతగా ప్రయత్నిస్తుంటే అంతగా ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి. బాబాకు దైవత్వం ఆపాదించి, ఆయన చుట్టూ నిర్మించిన సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయల (మన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కన్నా ఎక్కువ) ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎవరు ఏలాలన్న దానిపై ట్రస్టు సభ్యుల మధ్య యుద్ధం సాగుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబా-బందీ పేరుతో ఆంధ్ర జ్యోతి పత్రికలో దిగ్భ్రాంతికరమైన అనేక విషయాలు వచ్చాయి. సాయిబాబా ఆశ్రమానికి అతి సన్నిహితులైన అనేక మంది అక్కడ జరుగుతున్న అక్రమాలపై ప్రకటనలు చేస్తున్నారు. పుట్టపర్తి ఆశ్రమం ఒక మినీ స్విస్‌ బ్యాంకు మాదిరిగా నల్లడబ్బుకూ, అక్రమార్జనా పరుల సంపాదన దాచుకోడానికీ కేంద్రంగా మారిందని పత్రిక రాసింది. మంత్రులూ, బడా బాబులూ తమ అక్రమ సంపాదనలో పెద్ద మొత్తాలు పుట్టపర్తిలో దాచుకున్నారనీ, బాబా ఆరోగ్యం విషమిస్తుండడంతో 'దీపముండగానే ఇల్లు చక్కబెట్టు'కునే చందంగా వారంతా తమతమ సొమ్ములను ఇతర ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారని, ఆన్‌లైన్‌లో కూడా ఎడతెరిపిలేకుండా డబ్బు విదేశాలకు బదిలీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బాబా ఆశ్రమంలో పేరుకుపోయిన బంగారం, విలువైన వజ్రాలూ, నగలూ వగైరాలను ట్రక్కుల్లో రహస్యంగా బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అన్నిటికీ మించి సాయిబాబాను ట్రస్టులోని కొంతమంది సభ్యులు బందీలుగా చేశారనీ, ఆయనకు నిద్ర మాత్రలు ఇస్తున్నారనీ, సరైన మందులు, ఆహారం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనీ రాశారు. ఇంకా ఘోరంగా ఆయన శరీరంపై దెబ్బల గుర్తులు ఉన్నాయనీ, ఆయనను మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా వేధించి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
నెల రోజులుగా సాయిబాబా గురించీ, ఆయన సామ్రాజ్యంలో జరుగుతున్న చీకటి వ్యవహారాలగురించీ ఇన్నిన్ని వార్తలొస్తూ ఉంటే ట్రస్టు గానీ, ప్రభుత్వం గానీ నోరుమెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వార్తల్లో నిజం లేదా? లేకపోతే లేదని చెప్పొచ్చు. కాని చెప్పరు. పోనీ ఆ వార్తలు అసలు పట్టించుకోదగ్గవి కావా? కాని సాయిబాబా చిన్న వ్యక్తికాదు. ఏదో ఒక మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోనక్కరలేదా? కాని సాయిబాబా ఆంతరంగికుల్లో అనేకమంది ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాని అది నోరు విప్పడం లేదు. మౌనం వీడడం లేదు. మౌనం అర్థంగీకారం కదా! అంటే ఈ చీకటి వ్యవహారాలతో (కేంద్ర, రాష్ట్ర, కర్నాటక) ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులకూ లింకులున్నాయని వస్తున్న వార్తలను నమ్మాలా?
అధికారం, డబ్బు చుట్టూ..
ఒక సామాన్య వ్యక్తికి దైవత్వం ఆపాదించి, భగవత్‌ స్వరూపునిగా ప్రజలను నమ్మించే ప్రయత్నాల వెనుకనున్న కారణాలేమిటో సాయిబాబా చివరి ఘడియల్లో జరుగుతున్న ఈ పరిణామాలు స్పష్టంగా మన ముందుంచుతున్నాయి. ప్రజల్లో చాలాచాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాబా దైవ స్వరూపుడైతే ఆయన చుట్టూ ఈ చీకటి సామ్రాజ్యం ఎలా నిర్మించబడింది? ఆయనకు నల్లడబ్బు, అక్రమ లావాదేవీలతో సంబంధం ఉన్నదా లేదా అన్నది ప్రశ్నకాదు. తన కిందనే ఇంత జరుగుతున్నా ఆయన తెలుసుకోలేదా, లేక తెలిసి ఊరుకున్నారా? తెలుసుకోలేకపోతే ఆయనకూ మామూలు మనుషులకూ తేడా లేదు. తెలిసీ ఊరుకుంటే ఆయన కూడా ఈ అక్రమాలకు బాధ్యుడవుతారు.
సాయిబాబా దేవుడని నమ్మేవారిలో పామరులకన్నా, విద్యాధికులూ, ఉన్నత స్థానాల్లో ఉన్నవారే ఎక్కువ. ఆయనను ఆరాధించేవారిలో ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లే కాదు, దేశాధినేతల నుండి మరత్రులు, కార్పొరేట్‌ అధిపతులు, శాస్త్రవేత్తలు కూడా అనేకమంది ఉన్నారు. తను 'సృష్టించే' విబూదితో ప్రజల అనారోగ్య బాధలను సాయిబాబా తొలగిస్తారని వారి నమ్మకం. కాని బాబా ఆరోగ్యం కాపాడడానికి స్వదేశీ, విదేశీ వైద్యులూ, పరికరాలూ ఎందుకు అవసరమైనాయో వారు చెప్పరు. బాబా విబూది ఆయనకు ఎందుకు పనికిరాలేదో మాట్లాడరు. ఈ ప్రశ్నలన్నీ ముందుకొస్తే జవాబు చెప్పలేక తప్పుకోడానికి సాయిబాబా చేసే సేవలగురించి చెబుతారు. ఆయన కట్టించిన విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆయన ట్రస్టు తరఫున జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి చెప్పి అందుకు ఆయనను పూజించాలంటారు.
నిజమే, సాయిబాబా ట్రస్టు తరఫున ప్రజలకు అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్న మాట వాస్తవమే. భక్తులనుండి వసూలు చేసిన డబ్బుతో ఆయన నడుపుతున్న సేవా సంస్థలూ, కార్యక్రమాలూ అనేక మంది పేద ప్రజలకు అనేక విధాలా మేలు చేస్తున్న సంగతీ నిజమే. అందుకు బాబాను వేనోళ్లా కొనియాడాలి. ఆయనను కీర్తించాలి. కాని బాబానే కాదు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు అనేకమంది ఉన్నారు. విరాళాలు సేకరించీ, సేకరించకుండా తమ 'స్వంత' డబ్బుతో కోట్ల రూపాయల సేవాకార్యక్రమాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. సాయిబాబా మాదిరిగా వారంతా కూడా ప్రశంసనీయులే. సమాజ సేవకులే. కాని వాళ్లంతా దేవుళ్లు కానప్పుడు సాయిబాబాను దేవుని చేయడమెందుకు, ఆయన చుట్టూ మహిమలు, మాయలు చేర్చి ప్రజలను మోసగించడమెందుకు?
ఇప్పుడు చూస్తుంటే అనేకమంది మంత్రులూ, అధికారులూ, మహామహులంతా బాబాను నిత్యం దర్శించుకోవడం వెనుక ఆధ్యాత్మికత కన్నా ఆర్థికమే ప్రధానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బాబా ఆశ్రమం అక్రమ ఆర్థిక లావాదేవీలకే కాకుండా పదోన్నతులు, ప్రజాప్రతినిధులు- కార్పొరేట్‌లు- కాంట్రాక్టర్ల మధ్య రహస్య డీల్‌లకు కేంద్రంగా ఉన్నదని గతంలోనే లోకోక్తిగా చెబుతుండేవారు. నేడు మీడియాలో వస్తున్న వార్తలు ఈ విషయాన్ని రూఢిపరుస్తున్నాయి. ప్రభుత్వం, అధికారుల నేటి మౌనం వెనుక కారణం ఇదేనా? తీగలాగితే డొంక కదులుతుందన్న భయంతో ఎవరికి వారు మిన్నకుండిపోయారా? సమాధానం రావాలి!
మూఢనమ్మకాల వ్యాప్తి
ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఇప్పుడు కూడా సాయిబాబా చుట్టూ మూఢనమ్మకాల వాప్తికి అనేక రకాలా ప్రయత్నిస్తున్నారు. బాబా భౌతిక దేహం ముఖ్యం కాదని ట్రస్టు సభ్యుడైన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉవాచ. మరోవైపున బాబా మైనపు విగ్రహం పాదాల్లోంచి గంధం వచ్చిందని మరో ప్రచారం. బాబా ఆరోగ్యం బాగుపడాలని ప్రజలంతా ప్రార్ధనలు చేయాలని ఒక ట్రస్టు సభ్యుడు పిలుపునిచ్చాడు. చాలా మంది ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. కొంతమంది యజ్ఞయాగాలు చేస్తున్నారు కూడా. ఇవన్నీ ఏమీ పనిచేయవని వీరికి తెలియంది కాదు. కాని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు శాస్త్రీయమైన, సహేతుకమైన సమాధానాలు వారికి లభిస్తే మూఢనమ్మకాలకు వారు దూరమైపోతారు. కనుక అటువంటి హేతు దృష్టి వారిలో కలగకుండా పూజలూ, పునస్కారాలవైపు మళ్లింపు. మరి ఈ ఆసుపత్రి చికత్సలూ, డాక్టర్ల ప్రయత్నాలూ ఎందుకనే దానికి సమాధానం చెప్పడు. బాబా దైవత్వం గురించీ, గాలిలోనుండి బంగారు ఆభరణాలు సృష్టించే ఆయన మహిమల గురించీ వల్లించే ఒక పెద్దాయన బాబాకు అన్నం పెట్టకుండా ఆకలికి గురిచేస్తున్నారని చెబుతాడు. తన దగ్గరకు వచ్చేసరికి మహిమలన్నీ ఏమైనాయన్నది ప్రశ్న. పుట్టపర్తిలో వెలసిన సత్తెమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించడంవల్లే బాబాకు కష్టాలు వచ్చాయని పెద్ద ప్రచారం చేశారు. ఆ విగ్రహం వెదికి పట్టుకుని తిరిగి ప్రతిష్టించారు. దాంతో బాబా కోలుకుంటారని చెప్పారు. ప్రజల సెంటిమెంటు పేరుతో ఇటువంటి అనేక మూఢనమ్మకాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పుకోవాలి. డబ్బు, అధికారం, కుటుంబ తగాదాలు, అనారోగ్యం, అశాంతి అందరి మనుషుల్లాగే బాబాకూ వచ్చాయి. అందరిలాగే ఆయనకూ కష్టాలూ, నష్టాలు వచ్చాయి. అందువల్ల ఈ సమయంలో ఆయనపట్ల సానుభూతి చూపడం, ఆయన కోలుకోవాలని కోరుకోవడం మానవత్వం ఉన్న మనుషులంతా చేస్తారు. అందులోనూ తన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి మేలు చేస్తున్న బాబా శారీరకంగా ఇబ్బందుల్లో పడ్డారంటే బాధపడేవాళ్లు ఎక్కువమంది ఉంటారు. అదే సమయంలో సత్య సాయి ట్రస్టు పేరుతో ఆయన అనుయాయులమని చెప్పుకునే వారు చేస్తున్న అక్రమ లావాదేవీలను ప్రశ్నించకుండా ఉండకూడదు. బాబా చుట్టూ మూఢనమ్మకాలు వ్యాపింపజేయడాన్ని అనుమతించకూడదు................ప్రజాశక్తి పత్రికలో ఎస్. వెంకటరావు గారి వ్యాసం....

Thursday, April 21, 2011

వినాయక్‌ సేన్‌ వంటి ప్రజాస్వామిక వాదిని బెయిలుపై విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామం.ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామిక సూత్రాలను సుప్రీం తీర్పు మరోసారి బహిర్గతపరిచింది. మావోయిస్టుల అర్థ రహిత హత్యా రాజకీయాలపై కూడా ప్రజాస్వామిక చర్చలు జరగాలి. దేశవ్యాప్తంగా బూటకపు ఎన్‌కౌంటర్ల వార్తలు తరచుగా చూస్తున్నాం. ఇందుకు విరుద్దంగా బెంగాల్లో ఒక్క బూటకపు ఎన్కౌంటర్ర్ లేకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాలుగా ప. బెంగాల్లో మావోయిస్టుల హత్యా రాజకీయాలు మితిమీరినాఈ. అనేక మందిని హత్య చేసారు. ఉపాధాఇయ్లను కూడా కాల్చి చంపారు. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాల్సిన బాధ్యతను మరచి భయోత్పాతం సృష్టించి లబ్ది పొందాలని ఆశిస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని మమతా మావోయిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తోంది.

Thursday, April 14, 2011

మోడీపై పొగడ్తలా?

- తీవ్ర విస్మయానికి గురయ్యాను: సారాబాయి - నిరసనగా అన్నాహజారేకు లేఖ

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారే గుజరాత్‌ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై ప్రముఖ కళాకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాబాయి తీవ్ర విస్మయానికి గురయినట్లు పేర్కొన్నారు. అన్నా హజారే దీక్షకు మద్దతుగా అహ్మదాబాద్‌లో ఆందోళనలో పాల్గొన్న మల్లికా సారాబాయి మోడీని పొగడటంపై హజారేకు నిరసన తెలుపుతూ లేఖ రాశారు. గుజరాత్‌ గ్రామాల్లో కొద్దిపాటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. 'మీ పొగడ్తను ఉపసంహరించుకోకపోతే లోక్‌పాల్‌ ఉద్యమానికి మాకు మేము దూరంగా ఉండాల్సి వస్తుంది' ఆమె లేఖలో పేర్కొన్నారు. తన ప్రశంస కేవలం గ్రామీణాభివృద్ధికి సంబంధించి మాత్రమేనని హజారే సారాభాయికి లేఖ రాశారు. 'నరేంద్ర మోడీ నితీష్‌కుమార్‌ గ్రామీణ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులను మాత్రమే నేను ప్రశంసించాను. అదే సమయంలో మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తాను' అని హజారే సారాబాయికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తీవ్రంగా బాధపడ్డాం: సామాజిక కార్యకర్తలు
అన్నా హజారే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించినందుకు తీవ్రంగా బాధ పడ్డామని పలువురు సామాజిక కార్యకర్తలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, అన్ని అణగారిన వర్గాలకు వ్యతిరేకమైనదని స్పష్టం చేశారు. ఈ మేరకు పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెఎస్‌ బందుక్వాలా, మానవ హక్కుల సంస్థ డైరెక్టర్‌ ప్రశాంత్‌, ఫాదర్‌ సెడ్రిక్‌ ప్రకాశ్‌, నేషనల్‌ ఫెలో ఆఫ్‌ ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ (సిమ్లా)కి చెందిన ఘన్‌శ్యాం షా, సామాజిక కార్యకర్తలు రోహిత్‌ ప్రజాపతి, తృప్తి షా, నందిని మంజ్రేకర్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 'ఇండియా అగైన్‌స్ట్‌ కరప్షన్‌' గుజరాత్‌ కన్వీనర్‌ వినోద్‌ పాండ్యా సహా అనేకమంది అన్నా హజారేకు వాస్తవ పరిస్థితి తెలియదని అభిప్రాయపడ్డారు. ఆయన స్వయంగా గుజరాత్‌కు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు.ల

లేఖ పూర్తి పాఠం
డియర్‌ అన్నాజీ !
నరేంద్ర మోడీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిపై మీరు ప్రశంసలు కురిపించడం మమ్మల్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిపాటి అభివృద్ధి కూడా జరగలేదు. వాస్తవమేమిటంటే సేద్యపు భూములను కూడా రహస్యంగా ప్రభుత్వం తీసుకొని అతి తక్కువ ధరలకు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టింది. 21 లక్షల మంది రైతులు నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు ఏడేళ్ళ నుండి ఇక్కడ లోకాయుక్తా లేకపోవడంతో అవినీతికి వ్యతిరేకంగా దాఖలైన వందలాది ఫిర్యాదులపై విచారణ నిలిచిపోయింది. సుజలాం సుఫలాం పథకంలో రూ. 1,700 కోట్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో 109 కోట్ల కుంభకోణం, మత్స్యశాఖలో 600 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నాయి. ప్రతి శాఖ వేలాది కోట్ల రూపాయల కుంభకోణంలో కూరుకుపోయి ఉంది. మోడీ తన స్నేహితులైన పారిశ్రామికవేత్తలకు పేద, గ్రామీణ ప్రాంత ప్రజలను అమ్మేశారు. పరిశ్రమలపై చూపిన ఉదాసీన వైఖరివల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. మీ పొగడ్త భయంకరమైనది. దీనిని మీరు ఉపసంహరించుకోకపోతే లోక్‌పాల్‌ ఉద్యమానికి మేము బలవంతంగానైనా దూరంగా ఉండాల్సి వస్తుంది'
ఇట్లు
మల్లికా సారాబాయి

అవినీతిపై పోరాటాన్ని మోడీకరణ చేయొద్దు


ఆదివారం హజారే మీడియానుద్దేశించి మాట్లాడుతూ నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. తద్వారా తనంతట తానుగా ఉద్యమ పరిధిని కుదించుకున్నారు. రాజకీయాలకతీతంగా అవినీతి వ్యతిరేకోద్యమం అన్న ఆయన మాటల చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేసింది. మోడీని ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. చట్టం వచ్చి ఎనిమిదేండ్లయినా ఇంతవరకు గుజరాత్‌లో లోకాయుక్తను నియమించలేదు. పైగా ఆ చట్టం పరిధిలోకి ముఖ్యమంత్రి రాడు. అదే సమయంలో బెంగాల్‌ లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే హజారే అసలు ఉద్దేశాలేమిటో మనకు బోధపడుతుంది.                        ----------------------వి.శ్రీనివాసరావు (ప్రజాశక్తి సౌజన్యం నుండి)

ప్రభుత్వంతో అవగాహన కుదరడంతో అన్నా హజారే దీక్ష విరమించారు. దేశ వ్యాపితంగా ఆనందోత్సాహాలు వెల్తువెత్తినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇందులో మీడియా క్రియాశీలపాత్ర వహించింది. దీక్ష విరమించగానే ''భారతదేశం జయించింది'' అన్న బ్యానర్‌లతో వార్తలిచ్చాయి. నిన్న ప్రపంచకప్‌..నేడు హజారేదీక్ష..అన్న చందంగా అభివర్ణించాయి. ప్రపంచకప్‌ను శ్రీలంకమీద గెలుచుకున్నాం కాని దీక్ష ఎవరిపై విజయం? ఇందులో భారతదేశం విజేత అయితే ఓడిందెవరు? అవినీతి ఓడిపోయిందా? లేక ప్రభుత్వం ఓడిపోయిందా? అందరూ నీతిపరులే అయితే అవినీతి ఎక్కడుంది? ప్రాస కోసం వార్తలు, విశ్లేషణలు ఇస్తున్నారనుకున్నా ప్రజలకు వాస్తవం తెలియాలి కదా? ఈ ఉద్యమంలో అత్యంత విషాదకర వార్తలు కూడా ఉన్నాయి. ఎవరినైతే అవినీతిపరులుగా మీడియా ఎత్తి చూపిందో వారే నేడు ఈ ఉద్యమానికి మద్దతునీయడంలో అందరికన్నా ముందున్నారు. ఉదాహరణకు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంబరాలు జరుపుకున్నారు. పలు భూ కుంభకోణాల్లో ఆరోపణలు నిగ్గు తేలినా ఆయన్ను పదవిలో అట్టిపెట్టిన బిజేపీ అవినీతి వ్యతిరేకపోరాట యోధురాలిగా పోజులిస్తోంది. 2జి కుంభకోణానికి ఆదిమూర్తులు బిజేపీవాళ్లేనని ఇప్పుడు రికార్డులు చెపుతున్నాయి. అరుణ్‌శౌరీ మంత్రిగా ఉండగా ఈ చౌకబేరానికి తెర లేపారు. రాజా ఆ వారసత్వాన్ని అంది పుచ్చుకున్నాడంతే. దీక్షకు సోనియాగాంధీ సంఘీభావం తెలియచేస్తూ హజారేకు ఉత్తరం రాశారు. కాంగ్రెసు, బిజేపీలు రెండూ ఉత్తమ పార్టీలే అయితే దేశంలోని సొమ్మంతా వారికి తెలియకుండానే ఎక్కడికి పోతున్నట్లు? ఐపియల్‌ కుంభకోణంలో పదవి నుండి తొలగించబడ్డ లలిత్‌ మోడీ క్రికెట్‌ అభిమానులంతా హజారే బొమ్మ, బ్యానర్లు పెట్టుకొని స్టేడియంలకు రావాల్సిందిగా పిలుపునిచ్చాడు. బడా పారిశ్రామిక సంస్థలు సిఐఐ, ఆసోచామ్‌, ఫిక్కీ ఈ ఉద్యమానికి భుజం కాశాయి. ఆహా! ఎంత బాగుంది. ఈ విజయంలో వీరందరూ భాగస్వాములే అయితే పరాజితులు ప్రజలేనన్నమాట. అవినీతిపరులు, నీతిపరులు ఇద్దరూ ఒకే వైపు ఉండగలరా?

దీక్ష విరమణానంతరం ఆదివారం హజారే మీడియానుద్దేశించి మాట్లాడుతూ నరేంద్రమోడీని ఆకాశానికెత్తారు. తద్వారా తనంతట తానుగా ఉద్యమ పరిధిని కుదించుకున్నారు. రాజకీయాలకతీతంగా అవినీతి వ్యతిరేకోద్యమం అన్న ఆయన మాటల చిత్తశుద్ధిని ఇది తేటతెల్లం చేసింది. మోడీని ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా కొనియాడారు. చట్టం వచ్చి ఎనిమిదేండ్లయినా ఇంతవరకు గుజరాత్‌లో లోకాయుక్తను నియమించలేదు. పైగా ఆ చట్టం పరిధిలోకి ముఖ్యమంత్రి రాడు. గుజరాత్‌ ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎంత పెద్దఎత్తున అవినీతిసాగుతుందో స్వయానా మోడీ సోదరుడే మీడియాకు చెప్పారు. ఇక ముస్లిం ఊచకోతలకు మోడీ ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిన విషయాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అదే మరో వైపు బెంగాల్‌ లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టే హజారే అసలు ఉద్దేశాలేమిటో మనకు బోధపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ప్రజలు ఓట్లను అమ్ముకుంటున్నారని నిందించారు. ఆయనకు ప్రజలపై విశ్వాసం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. అంతేకాదు ఆయనపై ప్రజలకున్న విశ్వాసాన్ని కూడా వమ్ము చేసే మాటలివి. అంతెందుకు. బిల్లు రూపకల్పనలో పాల్గొనే వ్యక్తుల(హజారే టీం) ఆస్తిపాస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారా అని విలేకరులు అడగ్గా నీళ్లు నమిలారే తప్ప ఎందుకని అక్కడికక్కడే ముందుకు రాలేకపోయారు? జన లోక్‌పాల్‌ బిల్లు తయారు చేయడంలో కర్నాటక లోకాయుక్త ప్రధానపాత్ర పోషించారు. కాని ఆయన తన స్వంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలొస్తే కనీసం విచారించలేకపోయారు.

అన్నా హజారేకు వాటర్‌ షెడ్ల నిర్మాతగా పేరుంది. 1995-2004 మధ్యలో మన రాష్ట్రంలో వాటర్‌షెడ్లు పెద్దఎత్తున చేపట్టారు. హజారే మన రాష్ట్రానికి వచ్చి పలు సభల్లో పాల్గొని దాన్ని నీటి విప్లవంగా కొనియాడిపోయారు. కానీ ఏం జరిగింది? వేల కోట్ల రూపాయలు గంగపాలయ్యాయి. మహబూబ్‌నగర్‌, ప్రకాశం, ఆదిలాబాద్‌, విజయనగరం లాంటి జిల్లాలు ఇప్పటికీ కరువు కోరల్లో నలుగుతూనే వున్నాయి. వాటర్‌షెడ్ల పేరుతో ప్రాజెక్టులను విస్మరించారు. నాడు ప్రపంచ బ్యాంకు చెప్పింది ఇదే. కానీ ఉపరితల జలాలను భూగర్భ జలాలుగా మార్చడం ద్వారా నీటిపై హక్కు ప్రైవేటు కంపెనీలకు పోయింది. కోకోకోలా, పెప్సీ లాంటి కంపెనీలు ఈరోజు నీళ్ళను పెద్ద వ్యాపారంగా మార్చివేయగలిగినాయి. ఇప్పుడు వాటర్‌షెడ్లు, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ గురించి ఎవరూ నోరెత్తడం లేదు. అవినీతి నిర్మూలనా కార్యక్రమం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు కనుసన్నలలోనే సాగుతున్నది. ఇది సత్ఫలితాల నివ్వకపోయినా ప్రజల కోపాగ్నిని చల్లార్చగలదని వారికి తెలుసు.
మీడియా జన లోక్‌పాల్‌ బిల్లుకోసం ఎందుకంత ఆరాటపడుతున్నది? నిజంగా అవినీతిని అరికట్టవచ్చునని నమ్ముతున్నారా? 90శాతం అరికడతామని హజారే చెపుతున్నారు. అలా అయితే ఇప్పటివరకు ఉన్న చట్టాలు ఎందుకు విఫలమయ్యాయి? నేరస్థులను అరికట్టే చట్టాలు కఠినంగా ఉన్నా నేరం ఎందుకు పెరుగుతూనే ఉంది. అవినీతికి రాజమార్గాలెన్ని వున్నాయో వారికీ తెలుసు. ఈ కొత్త వ్యవస్థపై దృష్టి మళ్ళించడానికి ప్రధాన కారణం ఒకటుంది. గత కొంతకాలంగా ఈ వ్యవస్థకు పట్టుకొమ్మలుగా వుండే వివిధ యంత్రాంగాల నిజ స్వరూపం బట్టబయలవుతోంది. రాజకీయ పార్టీలు, నాయకులు, ఉద్యోగస్తులను పక్కన పెట్టినా ఆఖరికి న్యాయ వ్యవస్థ, మీడియాపై కూడా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. అవినీతి వ్యతిరేక సంస్థలే అవినీతిపరుల పాలయ్యాయి. ఉదాహరణకు తాజా సివిసిగా థామస్‌ నియామకం. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కాపాడుకోవాలంటే ప్రజలకు విశ్వాసం కల్పించే మరో కొత్త వ్యవస్థ కావాలి. అదే లోక్‌పాల్‌. దాన్ని అవినీతిని నిర్మూలించే రుద్ర కాళికగా చూపెట్టి ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది. కొంతకాలమైనా ప్రజలలో రగులుతున్న అసంతృప్తిని, ఆగ్రహావేశాలను అదుపు చేయవచ్చు. ఈ తాత్విక ఆలోచనల నుంచే ప్రభుత్వం ఎక్కువ సమయం తీసుకోకుండానే హజారే డిమాండ్లను అంగీకరించి సంయుక్త కమిటీని నియమించింది. తద్వారా తాను కూడా అవినీతి నిర్మూలనకు కట్టుబడి వున్నానని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

అవినీతికి కారణాలపై మీడియాలో జరుగుతున్న చర్చల్ని పరిశీలిస్తే ఏనుగు ఏడుగురు గుడ్డివాళ్ల కథ గుర్తుకొస్తుంది. వ్యక్తుల అత్యాశను కారణంగా కొందరు చెపితే, ఎన్నికల వ్యవస్థను కారణంగా మరికొందరు భావించారు. బ్యూరోక్రసీని కొందరు నిందిస్తే, అధికార కేంద్రీకరణను మరికొందరు ఎత్తిచూపారు. రాజకీయనాయకులను, పార్టీలను కొందరు ఘాటుగా విమర్శించారు. కఠినమైన చట్టాలు లేనందునే అవినీతి ప్రబలుతోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన పద్దతిలో వారు విశ్లేషణ చేస్తున్నారు. ఎవరి దృక్కోణం ప్రకారం వారి వాదన సరైందనే అనుకుంటున్నారు. వాదనలన్నీ పాక్షికమైనవే. ఇవన్నీ విడివిడిగా వాస్తవాలైనప్పటికీ సమగ్రమైన విశ్లేషణ మాత్రం కాదు. ఉదాహరణకి బ్యూరోక్రసీ వల్లనే అవినీతి పెరిగిందీ అనుకుంటే గత 20 ఏళ్లలో నూతన ఆర్థిక విధానాల తరువాత బ్యూరోక్రసీ ప్రభావం ప్రభుత్వ యంత్రాంగంపై చాలా తగ్గింది. ఆ లెక్క ప్రకారం అవినీతి తగ్గాలి. కానీ ఈ కాలంలో ఇంకా పెరిగింది. శేషన్‌ ఎన్నికల సంస్కరణలతో అంతా బాగవుతుందనుకున్నారు. కాని ఏమైంది? డబ్బు ప్రభావం తగ్గకపోగా పెరిగింది. డబ్బు పెట్టని వామపక్షాల వంటి పార్టీలకు ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా కుదించేశాయీ నిబంధనలు. అలాగే వ్యక్తుల అత్యాశ అని అంటున్నారు. ఆశ అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చదువుకునే వారికి, వ్యవసాయం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, కూలి వారికి, పారిశ్రామిక వేత్తకు, రాజకీయ నాయకులకు. ఇలా ఆశ లేనటువంటి వారు లేరు. కానీ ఆశ వున్నా కూలివారు, కార్మికులు వీళ్ళెవరూ కూడా ధనికులు కాలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం లేదు. కాబట్టి ఆశవల్లే అవినీతి పెరిగిందంటే ప్రతి ఒక్కరూ అవినీతి పరులే కావాలి ఈ దేశంలో. ఆశ వున్నప్పటికీ కూడా దాన్ని ఆచరణలో పెట్టాలంటే అవకాశాలు కూడా ఉండాలి. అలాంటి అవకాశాలు ఈ వ్యవస్థలో ఎక్కడున్నాయనే విషయం మనం పరిశీలించాలి. అన్నిటికి మూలం కోరికలలో వుందని బుద్ధుడు అన్నాడు. ఆ లెక్క ప్రకారం కోరికలను చంపుకోవాలి. అది సాధ్యమవుతుందా. లేదా మనుషుల మనసులు మార్చడానికి దైవప్రార్థనలు చేయాలి. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇప్పించాలి. మనసును అదుపులో పెట్టుకోవడానికి యోగా చేయాలి. ఈ పనులు చేస్తున్నవారు అవినీతికి అతీతంగా ఉన్నారా? అలా కూడా లేరు. పైగా అవినీతికి ఎక్కువ పాల్పడుతున్నవారే ఇటువంటి పనులు చేస్తున్నారని మన కంటికి కనిపిస్తున్నది. కాబట్టి ఆశ వ్యక్తుల యొక్క లక్షణం కాదు.

దీనికి మూలం మరోచోట ఉంది. నిజానికి ఆశ అనేది పెట్టుబడి లక్షణం. ఈ వ్యవస్థలో తన పెట్టుబడిని పదింతలు చేయడానికి అది అర్రులు చాస్తుంది. లాభం తీసుకురాకుంటే అది ఆ రోజు నిద్రపోనివ్వదు. అది నిద్రపోదు. టీవీ స్క్రీన్‌ మీద క్షణక్షణం మారే షేర్‌ మార్కెట్‌ గ్రాఫ్‌ మనుషుల్ని ఉరకలు పెట్టిస్తుంది. పెట్టుబడి చట్టాలను లెక్కచేయదు. సమాజం పట్ల దానికి దయాదాక్షిణ్యాలు వుండవు. లాభం కోసం ఏ పనికైనా తెగబడుతుంది. హత్యలు, దోపిడీలు చేస్తుంది, జైళ్ళు బద్దలు కొడుతుంది. అలాంటి పెట్టుబడికి స్వేచ్ఛను ఇచ్చి దేశం మీదికి వదిలింది ఎవరు? సంస్కరణలకు ముందు పులిని బోనులో పెట్టి, రోజు కొన్ని జంతువులను ప్రభుత్వమే బలి ఇచ్చేది. దాని ఆకలి తీర్చలేకపోయింది. బలిసిపోయినకొద్దీ ఆకలి పెరుగుతోంది. నువ్వు నా ఆకలిని తీర్చలేవు. నీకెందుకు శ్రమ. నన్ను ఒదిలేసేరు..నా మానాన నేను బతుకుతాను. అని పులి చెప్పడంతో బోనులోంచి ఒదిలేసింది ప్రభుత్వం. దానికే సంస్కరణ అని ముద్దుపేరు పెట్టింది. ఇప్పుడది స్వైర విహారం చేస్తోంది. శనివారం హిందుస్తాన్‌ టైమ్స్‌లో ఇచ్చిన మార్కెట్‌ సర్వే ప్రకారం 40% అవినీతి ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ పెద్దలను ఆడించడానికే వినియోగిస్తున్నారు. 20% అవినీతి కంపెనీల మధ్య సాగుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి మరో 20% అవినీతి ఖర్చవుతోంది. ఉద్యోగులను అదుపుచేయడానికి, పన్నును ఎగవేయడానికి అవినీతిని ఎరగా వేస్తున్నారు. దేశం వేరులో చేరి పీడిస్తున్న ఫైనాన్స్‌ పెట్టుబడిని అదుపు చేయకుండా అవినీతిని అరికడతాం అంటే అది జనాన్ని మోసం చేయడమే అవుతుంది. లేకపోతే లోక్‌పాల్‌ వంటి చట్టాల ద్వారా మహా అయితే కిందిస్థాయి అవినీతిని కొంతవరకు తగ్గించవచ్చు. లేదంటే పాలకవర్గాల మధ్య ఉండే వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఉపయోగపడవచ్చు. లోక్‌పాల్‌ వచ్చాక పై స్థాయిలో కొత్త మార్గాలను కనిపెడతారు. ఉదాహరణకు కోటి రూపాయలు క్యాష్‌గా ఇచ్చే బదులు, ఒక కంపెనీ లాటరీలో డ్రా తీసుకొని 4 కోట్ల ఖరీదు కలిగిన ఒక కారును బహుమతిగా అందించవచ్చు. ఒక కంపెనీ పెట్టించి దాని షేర్లను అధిక ధరకు కొని లాభం చేకూర్చవచ్చు. విదేశాల్లో చదివే నాయకుల బిడ్డల ఖర్చులన్నీ విదేశీ కంపెనీ భరించవచ్చు. దాన్ని ఎవరు, ఎలా అరికడతారు? రాజ్యాధికారంతో సహా సర్వాధికారాలు అనుభవిస్తున్న ఫైనాన్స్‌ పెట్టుబడి లీలల నుండి ఎవరైనా తప్పించుకోగలరా?

బిల్లు ఆమోదానికి వారు పడుతున్న ఆరాటం చూస్తుంటే లోక్‌పాల్‌ చట్టాన్ని పటిష్టవంతంగా రూపొందించడం కన్నా తాము తయారు చేసిన బిల్లును ఆమోదింపచేసుకోవాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ కమిటీకి వెలుపల అవినీతి వ్యతిరేక పోరాటంపై ఆసక్తి కలిగిన వ్యక్తులు, శక్తులు, సంస్థలు చాల ఉన్నాయి. ఆ విషయాన్ని వారు ముందు గుర్తించాలి. ఉదాహరణకు ప్రఖ్యాతి గాంచిన న్యాయమూర్తి జస్టిస్‌ వి ఆర్‌ కృష్ణయ్యర్‌ వున్నారు. ప్రముఖ జర్నలిస్టు, మెగసేసె అవార్డు గ్రహీత పి.సాయినాధ్‌ వున్నారు. అవినీతి వ్యతిరేకపోరాటంలో వీరు అలుపెరగని యోధులు. బోఫోర్స్‌ మొదలుకొని తాజా వీకీలీక్స్‌ వరకు హిందూ పత్రిక సాగించిన పోరాటం మనకు తెలుసు. అలాగే తెహల్కా మీడియా ద్వారా అనేక అవినీతి కేసులు వెలుగులోకి వచ్చాయి. 2జిలో రాడియా టేపుల్ని బయటపెట్టింది ఓపెన్‌ అనే మ్యాగజైన్‌. అందరినీ కమిటీలో పెట్టుకోలేకపోయినా కనీసం బిల్లు ముసాయిదా తయారైనాక దాన్ని ప్రజల కోసం బహిరంగపరచాలి. అందరి అభిప్రాయాలూ తీసుకోవాలి. కానీ వీరి తొందరపాటు చూస్తుంటే ఏకబిగిన పార్లమెంటులో పెట్టేసి వెంటనే ఆమోదించాలన్నట్లు వుంది. హజారే పెట్టిన ఆగస్టు 15 గడువు బిల్లుపై విశాల మద్దతును కూడగట్టేందుకు, విస్త ృతంగా చర్చ జరిగేందుకు తోడ్పడదు. బిల్లును ఆమోదించాల్సింది పార్లమెంటు. ఆ పార్లమెంటు సభ్యులు ప్రజలెన్నుకొన్న ప్రతినిధులు. వారిలో అధికార పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా వుంది. ప్రతిపక్షంలో బిజెపి లాంటి అభివృద్ధి నిరోధక పార్టీయే కాదు, వామపక్షాల్లాంటి అభ్యుదయ శక్తులు వున్నాయి. అవినీతిపరులే కాదు, నీతి నిబద్ధత కలిగిన వ్యక్తులూ వున్నారు. వారు దానిని అధ్యయనం చేసి క్లాజుల వారీగా తమ అభిప్రాయం చెప్పాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బిల్లు పెట్టగానే చేతులెత్తేసి, బల్లలు చరిచి ఆమోదించే పద్ధతి మంచిది కాదని సెలెక్ట్‌ కమిటీ, స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టేటీవ్‌ కమిటీ విభాగాలనేర్పాటు చేసుకున్నారు. ఇలాంటి బిల్లుల్ని సహజంగా పార్లమెంటులో ప్రవేశపెట్టాక సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తారు. అక్కడ నిపుణుల సహాయంతో లోతుగా పరిశీలించి స్టాండింగ్‌ కమిటీ తన సిఫార్సులు చేస్తుంది. కానీ హజారే కోరుతున్న పద్ధతి ప్రకారం దానికి అవకాశం వుండదు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా? జన లోక్‌పాల్‌ బిల్లును తయారు చేయడానికి హజారే గారి టీమ్‌ దాదాపు 8 నెలల సమయం తీసుకుంది. 3 ముసాయిదాలు మార్చారు. ఆ మాత్రం సమయం ప్రజలకు పార్లమెంట్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న. ఇప్పటివరకు బిల్లు పెట్టకుండా ఆలస్యం చేయడం ఎంత తప్పో విస్తృత చర్చ లేకుండా హడావుడిగా ఆమోదించం కూడా అంతే తప్పవుతుంది. వ్యవస్థీకృతమైన అవినీతిని సంఘటితంగా ఢకొీనాలి. దానికి ప్రజల మద్దతు చాలా కీలకం. అది పౌర సంఘాల ద్వారా జరిగే పని మాత్రమే కాదు, చైతన్యవంతమైన, నిబద్ధత కలిగిన ప్రజాసంఘాలు, మేథావులు, రాజకీయ పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకొని భాగస్వాములను చేయాలి. అప్పుడే అది కొంతవరకు విజయవంతమవుతుంది. లేకుంటే లోక్‌పాల్‌ మరల గుంటనక్కల పాలవుతుంది.

Friday, April 8, 2011

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికి నేస్తానై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం
తీరందీ తీరం
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే

తానాలే చేసాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో సంకళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం,ఇన్నేళ్ళుగ వ్యర్ధం
చట్టందే రాజ్యం

చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే నెతికానే
చుక్కల్లే తోచావే ఎన్నల్లే కాచావే ఏడబోయావే 
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ..

పల్లవి:

ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది |2|
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది |2|
ఆకాశం.. |2|
చరణం 1
ఏ పువ్వు ఏ మోవిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

చరణం 2
ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ (2)
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడే
దారివ్వకే చుట్టూ తారాడుతాడే

పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే
అల్లారల్లరివాడు..అబ్బో ఏం పిల్లడే..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగార రంగాన కడతేరినాడే (2)
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ..

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ
యమునా ఎందుకె నువ్వు ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టయ్యతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్నూ కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా

హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంటా..
చిన్నారి పొన్నారి చిలకల్లా జంటా..
చేస్తున్నా కమ్మని కాపురమూ..
చూస్తున్నా కన్నుల్ల సంబరమూ..
ప్రేమకు మందిరమూ..

||తియ్యన్ని||

ఒక దేహం ఒకప్రాణం తమ స్నేహంగా..
సమభావం సమభాగం తమ పొందుగా..
చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా..
చెలికానీ సరసాలే జంపాలగా..
అనురాగం ఆనందం అందాలుగా..
అందాల స్వప్నాలే స్వర్గాలుగా..
ఎడబాసి మనలేని హృదయాలుగా..
ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా..
గూడల్లుకోగా పుల్లల్లు తేగా..
చెలికాడు ఎటకో పోగా..
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..

||తియ్యన్ని||

ఒక వేటగాడెందో వలపన్నగా..
తిరుగాడు రాచిలక గమనించకా..
వలలోనా పడి తాను అల్లాడగా..
చిలకమ్మ చెలికానీ సడికానకా..
కన్నీరు మున్నీరై విలపించగా..
ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా..
ఎలుగెత్తి ప్రియురాలు రోధించగా..
వినలేని ప్రియుడేమో తపియించగా..
అడివంత నాడు ఆ జంటగోడు..
వినలేక మూగై పోగా...
అయ్యో పాపం.. వేచెను చిలకమ్మా..

||తియ్యన్ని||

Friday, March 4, 2011

అసంఖ్యాకంనా కోర్కెలు




అసంఖ్యాకంనా కోర్కెలు.
గుండెలుకరిగించే ఆక్రందననాది.
నీనిరాకరణలే నాకు రక్షలైనాయి.
నీప్రగాఢ దయా తుషారంనాపై వర్షిస్తున్నది.ఈ ఆకారం, ఈ వెలుతురు, ఈ తనువు,ఈ జీవనం, ఈ మనసు,మమత అడక్కుండాయిచ్చిన ఈ కానుకలు,అతి మమత నుంచినన్ను రక్షిస్తున్నాయి.
ఏమీతోచని క్షణాలు,అప్పుడప్పుడూ లేచిఅవధికోసం వెదుకుతాను.కాని నీవు నిర్దయగా నాకుకనిపించకుండా దాక్కుంటావు.
నీనిరాకరణే నన్నుమరింత దగ్గరగా లాక్కునిస్వీకరిస్తుంది...... గీతాంజలి నుంచి 

గీతాంజలి


గీతాంజలి

Wikisource నుండి



 అంజలి

మానవజీవన భావనల,మానవ జీవితభావుకతలకుసుమాంజలి గీతాంజలి.మానవ మేధామహనీయతకుకలకాలపు నివాళిగితాంజలి. కమనీయమయినఆనందాన్ని, ఆహ్లాదాన్నికలిగించే మంజులకవితా మంజరి గీతాంజలి.జిలుగులతో గిలిగింతలుపెట్టి వెలుగుబాటలుతీర్చే రత్నదీపావళిగీతాంజలి.
చిన్నారిపూవు, సెలయేటిగల గల, పసిపాప బోసి నవ్వు,గాన మధుర మధుపాత్రగీతాంజలి. మానవునిఅంతరాంతాలలో వింగడింపరానివేదనా వేదనలకలయిక గీతాంజలి.ఉన్నాడో లేడో తెలియక,కనిపించీ కనిపించక దోబూచులాడేవిశ్వాత్ముని విశ్వలీలలవిలసనం గీతాంజలి.మానవత, విశ్వమానవతకళ్యాణం, విశ్వకళ్యాణం,సాధన సాధనాలువీని ఈ సావాస్యం గీతాంజలి.
 గీతాంజలి (1 - 10)
1
నీవునన్ను అంతగా సృష్టించావుఅది నీ విలాసం. తాకితేచాలు, పగిలిపోయేయీ పాత్రికను నీవుమాటిమాటికిఖాళీచేసి మళ్ళీకొత్త జీవితంలోనింపుతూ ఉంటావు. ఈ చిన్నవేణువును ఊదుతూకొండలూ, కోనలూతిరుగుతావు. నిత్యనూతనమైనమధురగీతాలు ఆలపిస్తావు.
నీమృదుల కరాల అమృతస్పర్శ సోకితే చాలు,నా చిన్నారి గుండెలోఆనందం పరుగులు తీస్తుంది.ఏవో మాటలు నాలోపెల్లుబుకుతాయి.
నీవుఇచ్చే మహాప్రసాదాన్ని స్వీకరించాలంటే---చూడు-- నా చేతులెంతచిన్నవో, ఈ చిన్నచేతులతో ఆ మహాప్రసాదాన్ని స్వీకరించగాలనా?
ఇలాగయుగాలు గడిచిపోతాయి.అయినా నీవు కొత్త జీవితాన్నిపాడుతూనే వుంటావు.కొత్తపాటలు పాడుతూనేవుంటావు. అయినప్పటికీయీ పాత్రను నింపడానికిఖాళీ వుంటుంది.

2
నీవునన్ను పాట పాడమనిఆజ్ఞాపించావు.
అప్పుడునా హృదయంఎంత పొంగిపోయిందనుకున్నావు?నన్ను కదా నీవుపాట పాడమని అడిగావనేగర్వంతో నా హృదయంపగిలిపోయిందేమోననిఅనిపించింది. అప్పుడునీ ముఖంవైపు చూశాను.నా కళ్ళలో నీళ్ళుగిర్రున తిరిగాయి.
నాబ్రతుకులోని అపస్వరాలన్నీకరిగి ఒక కమ్మని మధుశ్రుతిలోలీనమైనాయి. నాలోనిపూజాభావం హాయిగాఏ చింతా లేకుండా సాగరంపైఎగురుతూ వెళ్ళేపక్షిలాగా రెక్కలు చాచింది.
నాకుతెలుసు. నీకు నా పాటంటేఇష్టమని, గాయకుడుగానే నీ సాన్నిధ్యంలోనిల్చున్నానన్నవిషయం కూడా నాకు తెలుసు.
నాపాట ఒక పక్షిలా రెక్కలుచాచితే, ఆ పంచక్షాలలోమాత్రమే నీ పాదాలుస్పృశిస్తాను.
కానినీ పాదాలను మాత్రంనేను ఎన్నటికీఅందుకోలేను. గానామృతాన్నితాగిన మత్తులోనన్ను నేను మరచిపోతాను.అప్పుడు నీవు నాకు ప్రభువన్నవిషయం కూడా మరచి,మిత్రుడా! అని
నిన్నుసంబోధిస్తాను.

3
నీవుపాడుతూ వున్నప్పుడునేను వింటాను. నీవుఎలా పాడుతున్నావో,ఏమి పాడుతున్నావో నాకుఅవగతం కాదు. అయినా నిశ్శబ్దంగాఆశ్చర్యంతో ఆ పాట వింటాను.
నీగానజ్యోతి యీ ప్రపంచాన్నంతాదీప్తం చేస్తుంది.నీ గానంలోని జీవశక్తిఉచ్ఛ్వాస నిశ్వాసలవలెవియత్తలమంతానిండిపోతుంది. పరమపావనమైన నీ గానవాహినిరాళ్ళనూ, రప్పలనూఛేదించుకునిపరుగులు తీస్తూ ప్రవహించిపోతుంది.
నీగానంలో శ్రుతి కలపాలనినా హృదయంఅర్రులు చాస్తుంది. కానిఎంత పెగల్చుకున్నాగొంతులో నుంచివెలువడదు.మాట బయటకువచ్చినా మాటపాటగా మారదు.
ఏంచేయాలో తోచకవెర్రిగా ఏడుస్తాను.
ప్రభూనీవు నన్ను నీ గానాలవలలో బందీనిచేశావు సుమా!
4
జీవనజీవనమా!
నీసజీవస్పర్శ ఎల్లప్పుడూనా శరీరంపై వుంటుందనితెలిసి, నా దేహాన్నిదేవాలయంలాపరిశుద్ధంగా వుంచుకోడానికిప్రయత్నిస్తాను.అసత్యాన్ని మనసులోఅడుగుపెట్టనివ్వకఅల్లంత
దూరంలోవుంచుతాను. నా మనోమందిరంలో హేతుజ్యోతినివెలిగించిన సత్యానివినీవు.
నాహృదయాంతరంలోనీ పీఠం వున్నదనితెలిసి, దుష్టత్వాన్నిచేరనివ్వక నా హృదయాన్నిఎల్లప్పుడూ నవవసంత ప్రేమారామంగావుంచుకుంటాను.
నేనుచేసే ప్రతి పనిలోనీవే ప్రతిఫలించాలనిన కోరిక. నీవు ప్రతిఫలిస్తేనాకు ఏ పని చేయాలన్నాశక్తి కలిగేది.

5
ఒక్కనిమిషం. కాసేపు నీ ప్రక్కన నన్నుకూర్చో నివ్వవూ?
పనులుతరువాత చేసుకుంటాను.నీ ముఖాన్ని ఒక్క మాటైనాచూడకపోతే, నాహృదయానికిశాంతీ, స్థిమితమూ ఉండవు.నాకు ఎంత చిన్నపని అయినా ఈదరాని మహాసముద్రంలా కనిపిస్తుంది.
కిటికీదగ్గర కూర్చున్నాను.వేసవి వచ్చింది.వేసవి నిశ్వాసలు వినవస్తున్నాయి.వికసిస్తున్న పూలపొదలవద్దబంభరాలు రొదచేస్తూతిరుగుతున్నాయి.
ప్రభూ!ఇది కాసేపు నీ ముఖంవైపేచూస్తూ ప్రశాంతంగా నీప్రక్కనే కూర్చుని, తీరికగానా జీవనగీతాన్నినీకు సమర్పించవలసినసమయం.

6
జాగుచేయకుండా ఈ చిన్నారిపూవును కోసివేయి, ఇదిరాలి ధూళిలో కలిసిపోవచ్చు.
ఈ చిన్నిపూవుకు నీ పుష్పమాలలోస్థానం అలంకరించేఅర్హత లేకపోవచ్చు.
కానీకనీసం నీ చేతిలోగిల్లి వేసి అయినా దీనినిగౌరవించు. నేను గమనించకుండానేఈ చిన్ని పూవుకు కాలంఅయిపోవచ్చు. పూజాసమయం దాటిపోవచ్చు.ఈ పూవు రంగు పాలిపోయిందికావచ్చు. పరిమళంలేనిపూవే కావచ్చు. దీన్నికోసి నీ పూజకు
వినియోగించు.

7
నేనుపాడే పాటకు ఆభరణాలులేవు. అందచందాలులేవు. సొమ్ములూ,శోభలూ విసర్జించిందినా పాట. అందంగా, ఆకర్షణీయంగాఅలంకరించుకున్నానన్నఅహం లేదునా పాటకు. ఆభరణాలూ,అలంకారాలు ముసరి లీనతకుఅడ్డు వస్తాయి. నీవునన్ను కౌగలించుకునిఏవేవో గుసగుసలు వినిపిస్తూవుంటేఆభరణాల గలగలలోనీ గుసగుసలు వినిపించవు.నేనొక కవినన్నగర్వం నీ సాన్నిధ్యంలోఅంతరించిపోతుంది.
ఓ మహాకవీ!నేను నీ పాదాలవద్దకూర్చున్నాను. నా జీవితాన్నిఒక చిన్న వేణువులాగసుగమనం, సుందరం చేసుకోనీ-చాలు.నీవు వేణువునుఊదుదువుగాని.

8
కుర్రవానికిరాకుమారుని దుస్తులుతొడిగి సింగారించారు. మెడనిండాసొమ్ములు దించారు.అప్పుడు అతడికి ఆటలోఆనందం ఏమి వుంటుంది.అడుగడుగునా అతని సింగారంఅడ్డు వస్తుంది.
అలంకారంమాసిపోతుందేమోననిఅతను ఒక మూలవొదిగి కూర్చుంటాడు.అడుగు కదపటానికి భయపడతాడు.
హాయినీ,ఆరోగ్యాన్ని ఇచ్చే భూమాతఒడినుంచి నన్నువిడదీసే ఈ అలంకారం నాకువద్దమ్మా! ఇదినన్ను మానవజీవన మహోత్సవంలోపాల్గొనకుండా చేస్తున్నది.
9
నీవుఎంత వెర్రివాడవు.నీ బరువు నీవే మోయాలనియత్నిస్తున్నావు.
భిక్షకుడా!నీ గడప దగ్గర నీవేభిక్షాటన చేస్తున్నావు.
అన్నిభారాలూ ఆయనపైవదిలిపెట్టు.ఆయనే అన్నింటినీభరిస్తాడు. నీవునిశ్చింతగా వుండు. నీవాంఛాపరత, మలినశ్వాసలో నీలోని దీప్తినిఆర్పివేస్తుంది. ఈ అపవిత్రమైనహస్తాలతో కానుకలనుస్వీకరించకు. పవిత్ర ప్రేమతోఅందించిన కానుకలనేస్వీకరించు.

10
ఇదుగోనీ పాదపీఠం.
ఈ పీఠంపైనీ పాదాలు వుంచు.
ఇక్కడపేదలూ, అధములూ,పరిత్యక్తులూ వుంటారు.నేను నీ పాదాలకు నమస్కరించాలనితలవంచినప్పుడునా ప్రణామం ఈ అధోజగత్తులోవుండే నీ పాదాలనుస్పృశించ లేదు.
నిరుపేదవలె,అధమాధమునివలె,పరిత్యక్తునివలె,నీవు నడిచివెళ్ళేత్రోవలో ధూళినికూడా అహమిక స్పృశించలేదు.
తోడునీడ లేని పతితలోకంలో నీవు ఉన్నచోటికినా హృదయంవెతుక్కుంటూ రాగలదా?

 గీతాంజలి (11 - 20)

11
ఓయీపూజారీ! ఇక నీ జపతపాలను,కీర్తనాన్ని విడిచి రా.తలుపులన్నీ మూసుకుని,ఈ దేవాలయపు చీకటికోణంలో ఎవరికోసం నీవుపూజిస్తున్నావు? ఒక్కమాటుకళ్ళు తెరచిచూడు.
నీవుఏ దేవుని ఆరాధిస్తున్నావో,అతడు నీ ముందులేడు.
అతడుఎక్కడ ఉన్నాడో చూడు.రైతు రాతి నేలనుదున్నుతూ ఉన్నచోట-రోడ్లువేసే పనివాడు రాళ్ళుకొడుతూ ఉన్నచోట-అతడువున్నాడూ. ఎండనక,వాననక పనిచేస్తున్నవారి
వద్దనేఅతను వున్నాడు.అతను దుస్తులుకూడా వారి దుస్తులవలెనేదుమ్ముకొట్టుకునివున్నవి.
నీవుకూడా అతని వలెనేధూళి ధూసరితమైననేల పైకిరా.
ముక్తి!ముక్తి ఎక్కడుందనిభావించావు? మనప్రభువే ఆనందంతోఈ సృష్టి బంధాలనుస్వీకరించాడు. అతను ఎల్లప్పుడూమనతో కట్టుబడివున్నాడు.
ఓ పూజారీ!నీ జపతప ధ్యానాలనుంచిబయటకు రా! పుష్పాలను,ధూపదీప నైవేద్యాలనుఆవల వుంచు.
నీవుధరించిన వసనాలుమాసి, చిరిగిపోతేమటుకు ఏమిటి? అతనితో,అతని బాసటే నిలిచిచెమటోడ్చికష్టించు.

12
నాప్రయాణం అతి దీర్ఘమైంది.అవధి ఎన్నడుచేరుకుంటానో! అవధిఎంత దూరమో!
తొలివేకువలోనే బయలుదేరాను.లోకాల చీకటిబాటలో అనేక గ్రహ,నక్షత్రాలపైనా జాడవదులుతూ ప్రయాణంచేశాను.
అత్యంతసన్నిహితంగానీ చేరువకు చేర్చేపథం అతి దీర్ఘమైంది.అతి నిరాడంబరమైనపాట అనడానికి అవసరమైనశిక్షణ అత్యంత క్లిష్టం.
పధికుడుతన వాకిలి చేరుకునేవరకు ప్రతి తలుపూతట్టాలి. కడకుగర్భాలయం చేరడానికిబాహిరమైనప్రపంచాలన్నీ పరివ్రజించాలి.
నేనుకళ్ళు మూసుకోవడానికిముందు నా చూపులుదూరదూరాలకు ప్రసరించి,నిన్ను అన్వేషించాయి. కడకుకళ్ళు మూసుకుని, ఇక్కడేవున్నావు నీవుఅన్నాను.
ఎక్కడవున్నావునీవు? అన్న ప్రశ్న-ఆక్రందన,సహస్రాశ్రు మహావాహినిలుగామారి,వరదలై లోకాన్నిముంచెత్తి నేనుఉన్నాను అన్న జవాబువినిపించింది.

13
నేనుపాడవలసిన పాటలుఈనాటివరకు పాడనేలేదు.వీణ తీగలు సవరించుకునిశృతి పెట్టుకొనడంలోనేయింత కాలం గడిచిపోయింది.
పాటపాడే తరుణం ఇంతవరకూరాలేదు. పాటలోపదాలు కుదరలేదు.ఎదలో మాత్రంపాట పాడాలనే వేదనఉబికిపోతూ వుంది.
పూవుమొగ్గగానే వుంది.వికసించలేదు. నిశ్వసిస్తూగాలి మాత్రం ఈలవేస్తూ ప్రక్కనుంచే
వెళుతూవుంది.
అతనిముఖాన్ని నేనుఇంతవరకూ చూడలేదు.అతని కంఠస్వరం ఇలా ఉంటుందనికూడా నాకు తెలీదు.నా గృహ ద్వారం ముందువీధిలోంచి వెళుతున్నఅతని అడుగుల చప్పుడుమాత్రమే విన్నాను.
క్షణమొకయుగంగా రోజు గడుస్తూవుంది. అతని కోసం ఆసనంఅలంకరించడంతోనేరోజు గడిచిపోయింది.ఇంకా దీపం వెలిగించలేదు.అతన్ని గృహంలోఅడుగు పెట్టమని ఎలాఆహ్వానించగలను?అతన్ని కలుసుకోగలననేఆశతోనే బ్రతుకువెళ్ళదీస్తూ ఉన్నాను.కాని ఆ ముహూర్తంరావడం లేదు.

14
అసంఖ్యాకంనా కోర్కెలు.
గుండెలుకరిగించే ఆక్రందననాది.
నీనిరాకరణలే నాకు రక్షలైనాయి.
నీప్రగాఢ దయా తుషారంనాపై వర్షిస్తున్నది.ఈ ఆకారం, ఈ వెలుతురు, ఈ తనువు,ఈ జీవనం, ఈ మనసు,మమత అడక్కుండాయిచ్చిన ఈ కానుకలు,అతి మమత నుంచినన్ను రక్షిస్తున్నాయి.
ఏమీతోచని క్షణాలు,అప్పుడప్పుడూ లేచిఅవధికోసం వెదుకుతాను.కాని నీవు నిర్దయగా నాకుకనిపించకుండా దాక్కుంటావు.
నీనిరాకరణే నన్నుమరింత దగ్గరగా లాక్కునిస్వీకరిస్తుంది.

15
నీదర్బారులో నీ కోసం పాటలుపాడటానికని వున్నాను.
నీదర్బారులో యిక్కడఈ మూల నాకో చిన్నస్థానంవుంది.
నీలోకంలో నాకు పనులేవీలేవు. నిరర్థకమైననా జీవితం, ఎందుకో కానిఅర్థం లేకుండానే గీతాలుగాబయలు వెడలుతుంది.నిశ్శబ్ద నిశీధ దేవాలయంలోనీ పూజకై గంట మ్రోగినప్పుడు,ప్రభూ! నీ ముందునిల్చి పాడవలసిందిగానన్ను ఆజ్ఞాపించు.
ప్రభాతమంద మలయానిలంలో,స్వర్ణ వీణను నేనుసారించి పాడినప్పుడు,స్వామీ నా ముందు సాక్షాత్కరించినన్ను సత్కరించు.

16
ఈ విశ్వమహోత్సవాన్నిచూడ రమ్మని నాకుఆహ్వానం వచ్చింది.నా బ్రతుకు ధన్యతచెందింది.
కండ్లారఉత్సవాన్ని చూచాను.చెవులార ఉత్సవకోలాహలాన్నివిన్నాను.
ఈ ఉత్సవంలోనా వీణ వాయించి, పాటపాడమని నన్నుపిలిచారు. వచ్చాను.నాకు
చేతనయినట్టుపాట పాడాను.
స్వామీ!ఇప్పుడిక నేను లోనికివచ్చి, నీ వదనసీమను చూచి నీకునా మౌన పూజనుసమర్పించనా? అనుమతిస్తావా?

17
అతనికౌగిట్లో వాలి కరిగిపోయేప్రేమమయ క్షణంకోసం కాచుకుని వున్నాను.ఇందుచేతనేఇంత ఆలస్యమైనది.యెన్నెన్నో విషయాలుమరిచాను కూడా.
నాకుస్వేచ్ఛ లేకుండాచేసే అనేక నీతులూ,నియమాలూ నన్నుకట్టివేస్తున్నవి.కాని వాటిని నేనులెక్క చెయ్యను.అతని కౌగిట్లో కరిగి కలిసిపోయేఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను.
అందరూనన్ను ఆడిపోసుకుంటారు.దేన్నీ లెక్క చెయ్యననిఅంటారు. నిజమే మరి!
సంతరోజు గడిచిపోయింది.
పనితొందరలు ముగిసిపోయాయి.ఏదో పనిమీద నన్నుపిలుద్దామని వచ్చి,నేను పలక్కపోతేవాళ్ళు కోపంతో వెళ్ళిపోయారు. కడపటికిఅతని కౌగిట్లో కరిగిపోయేఆ క్షణం కోసం కాచుకుని వున్నాను.

18
మబ్బులు,మబ్బులు, మబ్బులు-చీకటి.
ప్రియా!ఒంటరిగా నన్నెందుకువాకిట్లో నిలిపి వుంచుతావు?
మధ్యాహ్నంపనివేళ, అందరితోపాటుకలిసి వున్నాను. కానిఈ ఒంటరివేళ ఒక్క నీకోసమే యెదురు చూస్తున్నాను.
నీవునీ ముఖాన్ని చూపకపోతే,నన్ను ఒంటరిదాన్నిగావదిలేసే ఈ దీర్ఘవర్ష రాత్రులు ఎలాగడపను? మబ్బుపట్టిన ఆకసం వంకచూస్తూ కూర్చున్నాను.నీ హృదయంవెర్రిగా ఈలలు వేస్తూగాలితోపాటు తిరుగుతోంది.
19
నీవునాతో ఒక్కమాటైనామాట్లాడకపోతే,ఆ నిశ్శబ్దంతోనే నా హృదయపాత్రికను నింపుకుని దానినిభరిస్తాను.
నిశ్చలంగా,నిశ్శబ్దంగా, తారలతోనిండిన రాత్రి బరువుగాతల వంచుకునిఉదయం కోసం శాంతంగా వేచినట్టునీ కోసం వేచివుంటాను.తెల్లవారుతుంది.చీకటి విచ్చిపోతుంది.నీ గొంతుక ఆకాశంలోనుంచిబంగారు రంగుల ప్రవాహాలుగాపారుతుంది. అప్పుడు నీమాటలకు నా గూళ్ళలోనిప్రతి పక్షి మేలుకునిపాటలను మారు పలుకుతుంది.నా అడవిలోని ప్రతిపొదలో, రెమ్మ రెమ్మలో,కొమ్మ కొమ్మలో నీమధురగీతి పూలుపూస్తుంది.

20
పద్మంపూచిన రోజుననా మనస్సు ఎక్కడెక్కడోవిహరిస్తూ వుంది.ఎంచేతనో నాకు తెలీదు.నా పూల బుట్ట అలానేఖాళీగా వుండిపోయింది.పూవుగానే మిగిలిపోయింది.
ఇప్పుడుమళ్ళీ ఏదో దిగులునన్ను ఆవరించింది.నేను నా కలలోంచిఉలిక్కిపడి లేచాను.దూరంగా ఎక్కడో దక్షిణానిలంలోఒక విచిత్రమైనమధు భరితపరిమళం నా నాసికనుతాకింది. నా గుండె దడదడకొట్టుకుంది. విరహంతోవసంతం ఫలవంతంఅయ్యేందుకు తపోనిశ్వాసాయీ పరిమళం? ఈ తీయనిపరిమళం నాలోనిదేనని,నా గుండె లోతులలోనుంచే బయలుదేరిందనిఆనాడు నాకు తెలియదు.

 గీతాంజలి (21 - 30)

21
పడవనికబయలుదేరదీయాలి.తీరంలోనే గంటలుగంటలు గడిచిపోతున్నాయి.అయ్యో!
ఏంచేయను?
వసంతంవచ్చింది. పూలుపూచాయి. వసంతం వెళ్ళిపోయిందిసెలవు తీసుకుని. ఇప్పుడువాడిన పూలభారంతోనేను ఇక్కడ-తోచక-వేచివున్నాను.
సాగరంలోఅలలు చెలరేగిఅలజడి చేస్తున్నాయి.తీరంలో పాండుర పత్రాలుగాలికి గలగలలాడిరాలి పడుతున్నాయి.
ఈ సాగరతీరంలో నుంచునిఏ శూన్యత వైపు తదేకంగాచూస్తున్నావు! ఆవలిఒడ్డున దూరంగా వినిపించేపాట గాలిలో తేలివచ్చికదిలించడం లేదూ?

22
అగాధశ్రావణాప్రభవినీల మేఘచ్ఛాయలలోనీవు ఎవ్వరికీ కానకుండారహస్యంగా నడిచివస్తావు.ఈనాటి ఉదయం కళ్ళుమూసుకుంది.
తూర్పునవీచిన వాయువుఎన్నిసార్లు పిలిచినామేల్కాంచలేదు.
నీలాలనింగిమేఘాల దుప్పటికప్పుకున్నది.
అడవిలోపక్షుల కిలకిలారావాలుఅణగిపోయాయి. ఇండ్లతలుపులన్నీ మూసివేశారు.ఈ వీధిలో నడిచివస్తున్న ఏకాంతపాంధుడివి నీవు ఒక్కడివే.ప్రియా! నా ఏకైక మిత్రుడా!నా ఇంటి తలుపులునీ కోసం తెరిచి వుంచాను.నిద్రలో నడుస్తున్నవానివలె నా ఇంట్లోకిరాకుండా అలా వెళ్ళిపోకు.

23
ఈ తుఫానురాత్రి...
ఈ ప్రేమయాత్రకుపూనుకున్నావేమిటిసఖుడా?
ఆకసంబాధితునివలెమూల్గుతూ వున్నది.నేను రాత్రంతా నిద్రపోలేదు.
మాటిమాటికిలేచి, తలుపులుతెరచి చూచేదాన్ని,వెలుపల చీకటి.
కళ్ళుపొడుచుకున్నా కానరానిచీకటి. ఏ త్రోవనవస్తావో తెలీదు.సిరాలా నల్లని ఏ నదీతీరం నుంచి నడిచివస్తావో, కోపంతో రుసరుసలాడేఏ అరణ్య పథంలో నడచివస్తావో?
ఏ కంటకపథాలు దాటి నన్నుకలుసుకోడానికి వస్తావో!

24
పగలుగడచి, పక్షులు పాడడంమానివేసి, గాలి వీచివీచి అలసి సొలసి అస్తమయమవుతేసాయంత్రం కన్నుమూసే కమలం రెక్కలుమూసి లోకాన్ని నిద్రదుప్పటితో కప్పినట్టే,చీకటి తెరనునాపై కప్పు. యాత్ర ముగియకమునుపే పొధేయంఅయిపోయిన యాత్రికునికిబట్టలు చిరిగిమాసి దుమ్ము కొట్టుకున్నవానికి,అలసిపోయినవానికి అవమానంతొలగించి, అశాంతి తొలగించి,చల్లని రాత్రిలోఅతన్ని పుష్పంలా తిరిగివికసించేట్టు చేయి.

25
బాగాఅలసిపోయిన రాత్రి-
పరువులూ,భారాలూ, బాధలూఅన్నీ నీకు వదలివేసిహాయిగా కన్ను మూసినిద్రిస్తాను.
అణగారిపోతున్ననా ఆంతరాత్మను, మేలుకొల్పినీ పూజకోసం సిద్ధం చేస్తాను.ప్రతి నిత్యం రాత్రివేళఅలసిన లోకాన్ని నిద్రపుచ్చికొత్త సంతోషంతో మళ్ళీమేలుకునేట్టుచేస్తావు.

26
నేనునిద్రపోతూ వుండగాఅతను వచ్చినా ప్రక్కనే కూచున్నాడు.కానీ నేను నిద్ర
మేలుకోలేదు.అయ్యో! పాపిష్టి నిద్రనన్ను దెయ్యంలాఆవరించింది.
రాత్రినిశ్చలంగా ఉన్నవేళఅతను వచ్చాడు.తన వీణను తీసుకొనివచ్చాడు. ఆ మధుర
శృతులలోనా కలలు కూడా కలసిమారు పలికాయి.
అయ్యో!భగవంతుడా!ప్రతిరాత్రి ఇలాగేవృధా అవుతున్నది.ఎవని సజీవ శ్వాస నానిద్రను స్పృశిస్తూ ఉన్నదోఅతన్ని ప్రతినిత్యంచూడలేకపోతున్నాను.

27
జ్యోతి?ఎక్కడుంది జ్యోతీ?తీవ్రవాంఛాగ్నిజ్వాలతో ఆ జ్యోతినివెలిగించు.
దీపంమాత్రమే వుంది.కాని ఆ దీపంలో ఎన్నడూఒక జ్యోతి మినుక్కుమనలేదు. హృదయమా-నీ గతి కూడా ఇటువంటిదే!ఇంతకంటే చావునయం. దు:ఖం నాతలుపు తట్టుతూవుంది.
నీప్రభువు నీకోసం వేచివున్నారు.రాత్రివేళ నిన్నుసంకేతానికి రమ్మన్నారుఅని నాకు సందేశం అందిస్తోంది.
రాత్రిఆకాశంలో మేఘాలు కమ్మాయి.వాన కుండ పోతగా కురుస్తూవుంది. నాలో ఏదో సంచలనంఏమిటో నాకు బోధపడదు.
ఒకక్షణం మెరుపు మెరిసే, మళ్ళీఇంతలో నాలో అగాధమైనచీకటి. ఈ రాత్రిఎక్కడో దూరంగా ఆ గానం పిలిచేచోటికి త్రోవకోసంనా హృదయంవెర్రిగా వెదుకుతూంది.
జ్యోతి?ఎక్కడుంది జ్యోతీ?జ్యోతిని తీవ్రవాంఛాజ్వాలతో వెలిగించండి.ఉరుములు, మెరుపులు,నల్లని బండలాపడివున్న కారునల్లనికాళరాత్రి. గంటలుదాటిపోతున్నాయి.
ప్రేమజ్యోతినిజీవితంతో వెలిగించు.

28
ఎంతత్రెంచుకున్నాతెగని బంధాలు.ఈ బంధాలు త్రెంచుకోడానికియత్నించినప్పుడల్లా
నాహృదయం బాధపడుతుంది.
నేనుకోరేదల్లా స్వేచ్ఛ.కాని స్వేచ్ఛను కోరుకున్నందుకేసిగ్గుపడతాను. నీవుఅమూల్యమైనపెన్నిధివని నాకు తెలుసు.నీకు మించిన సఖుడెవరూనాకు లేడని కూడా నాకుతెలుసు. కానీ నీవునా మందిరంలోకి వచ్చేటప్పుడు,ఈ బాహ్యాడంబరాన్నితుడిచిపెట్టలేకపోయాను.
నన్నుకప్పివున్న ముసుగుదుమ్ముతో, మృత్యువుతోనిండివుంది. ఈ ముసుగుచూస్తే నాకు తీరని రోత.కాని నీవు దీనితో ఎంతోఆప్యాయంగా కౌగిట్లోకి తీసుకుంటావు.
నాఋణాలు అసంఖ్యాకం.నా అపజయాలు అనంతం.నా అవమానం-భరించరానిది.కాని నేను నీ వద్దకునాకు శుభం చేకూర్చమనివరం కోరడానికి వచ్చినప్పుడు..నీవునిజంగా నాకు వరం ప్రసాదిస్తావనేభయంతో గజగజ వణికి పోతాను.

29
నేనుగాపిలవబడే వ్యక్తిఈ చీకటి కోణంలోపడి మ్రగ్గుతూ విలపిస్తున్నాడు.ఈ గోడను కట్టడంతోనేనా కాలం గడిచిపోతున్నది.ఈ గోడ పెరిగి పెరిగి ఆకసమంటేకొద్దీ నాలోని వ్యక్తిచీకటి నీడలోదాగి నాకు కనిపించకుండా ఉన్నాడు.
ఇంతపెద్ద గోడ కట్టానుకదాఅని నాకు ఎంతో గర్వం. ఈ గోడనుచక్కగా అలంకరిస్తాను.చిల్లి లేకుండాగట్టిగా సున్నం పూస్తాను.కాని ఇంత చేసినా నాలోఆ వ్యక్తి నాకు కనిపించడు.

30
ఎంతోదూరం నడచి ఒంటిగాఈ సంకేతానికి వచ్చాను.కాని ఈ నిశ్శబ్ద నిశీధంలోఎవరిదో అడుగుల చప్పుడునా వెనుకనే వినిపించింది.
అతనినుంచి తప్పించుకోవాలనిప్రక్కకు తొలుగుతాను.కాని అతన్ని తప్పించుకోలేను.
అతనుఅతి త్వరగా నడిచిధూళి రేపుతాడు. నేనుమాట్లాడిన ప్రతిమాటకూ అతను బిగ్గరగామారు పలుకుతాడు.
అతనుచిన్నారి నా అంతరాత్మనేప్రభూ! అతనుచాలా అల్లరివాడు.అతన్ని తోడుగా తీసుకొనినీ ఇంటి ముందుకురావాలంటే భయపడతాను.

 గీతాంజలి (31 - 40)

31
ఖైదీ!చెప్పు నిన్ను ఈ ఖైదులోఉంచింది ఎవరు?
నాయజమాని అని చెప్పాడుఖైదీ.
సంపదలో,అధికారంలో అందరినీమించిపోగలనని అనుకున్నాను.రాజుకు చెల్లించవలసినకప్పాన్ని కూడా ఇంటిలోనేదాచాను. నిద్ర ముంచుకొనివచ్చినప్పుడునా ప్రభువు కోసంపరచిన పక్కపై పవళించాను.నిద్ర మేల్కొని చూచేసరికినా ఖజానాలోనేనేను బందీగా వున్నాను
ఖైదీ!చెప్పవోయీ తెగిపోనిసంకెళ్ళను తయారుచేసింది ఎవరు?
నేనేఈ సంకెళ్ళను తయారుచేశాను. ఈ సంకెళ్ళనుఎంతో జాగ్రత్తగా మూసపోసితయారుచేశాను.ఈ సంకెళ్ళతో ప్రపంచాన్నియావత్తు బంధించి,నేను మాత్రంస్వేచ్ఛగా ఉండగలననిఅనుకున్నాను. రాత్రనక,పగలనక శ్రమించి,కొలిమి ఊది, మంటలురేపి, బలమైన ఈసంకెళ్ళను తయారుచేశాను.సంకెళ్ళు బాగా అతికితయారయిన తరువాతచూస్తే, అవే నన్నుగట్టిగా బంధించాయి

32
ఈ లోకంలోనన్ను ప్రేమించి,నా మంచి కోరేవారందరూ,అన్ని విధాలుగా నన్నుబంధించి, నన్నుభద్రంగా ఉంచాలనియత్నిస్తారు. కాని నీవుమాత్రం అలా చేయవు.నీ ప్రేమ వీరందరి ప్రేమకంటేగొప్పది.
నీవునన్ను ఎప్పుడూ స్వేచ్ఛగాఉంచడానికి యత్నిస్తావు.
ఈ లోకంలోవాళ్ళు నేనువాళ్ళను మరచిపోతాననేభయంతో, నన్నుఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వరు.ఇలా రోజులు వెళ్ళి,మారిపోతాయి. నీవు మాత్రంకనిపించవు. నా ప్రార్థనలలోనేను నిన్ను స్మరించకపోయినా,నా హృదయంలోనిన్ను నిలుపుకొనకపోయినా,నీ ప్రేమ ఎల్లప్పుడూనా ప్రేమ కోసం వేచిఉంటుంది.

33
పగటిపూటవారు నా ఇంటికివచ్చి,ఇక్కడ ఒక చిన్నగదిమాత్రమే మాకుకావాలి అని అన్నారు.
ఈశ్వరపూజలో నీకు తోడుగావుంటాము. ఆయనఏదైనా వరమిస్తే మాకుఅనుగ్రహించినవంతు మేము తీసుకుంటాముఅన్నారు! ఆ తరువాత వారునా గదిలో ఒక మూలనక్కి వినయంగా కూర్చున్నారు.
కాని,రాత్రి చీకటిలోవారు నా పవిత్ర పూజామందిరంలోకి త్రోసుకువచ్చి,పేరాశతో పూజా పీఠం వద్దనున్నప్రసాదాన్ని అపహరించడంనేను చూశాను.

34
నిన్నునా సర్వస్వంగా చెప్పుకునేఆ కాస్త ఔదార్యం నాకు మిగిలిస్తేనాకు అంతే చాలు.
అన్నిదిక్కులూ నిన్నే చూచి,నీ వద్దకు వచ్చిప్రతి చిన్న సేవనూనీకే సమర్పించి, నా
ప్రేమనుప్రతిక్షణం నీకే సమర్పించిఆ కాస్త శక్తిని నాలో మిగిలిస్తేఅంతే చాలు.
నిన్నుఏనాడూ నా సొంతమనిదాచుకోని ఆ కొంచెం వైశాల్యాన్నినాకు ప్రసాదిస్తే అంతేచాలు.
ఎప్పుడూనీ ఇచ్చకే నేను కట్టుబడివుండే ఆ చిన్ని సంకెలతెగిపోకుండా ఉంటేచాలు. నీ ఇచ్చనేనేను నా జీవితంలోనెరవేర్చే ఆ చిన్నిప్రేమ సంకెల తెగకుండాఉంటే చాలు.

35
ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగాతల ఎత్తుకునితిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగామనగలుగుతుందో,
ఎక్కడప్రపంచం ముక్కముక్కలైఇరుకైన గోడల మధ్యమ్రగ్గిపోవదో,
ఎక్కడమాటలు అగాధమైనసత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడఅవిరామమైన అన్వేషణ,పరిపూర్ణతవైపు చేతులుచాస్తుందో,
ఎక్కడపరిశుద్ధ జ్ఞానవాహినిమృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులోపనిలో నిత్యవిశాలపథాలవైపు ఎక్కడ మనస్సుపయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ!నా దేశాన్ని మేల్కాంచేట్టుఅనుగ్రహించు.

36
నిన్నునేను ప్రార్థించేదిఒకందుకే ప్రభూ-
నాలోనిలోభిత్వాన్ని, సంకుచితత్వాన్నిసమూలంగా నిర్మూలించు.
కష్టసుఖాలనుతేలికగా భరించేశక్తి నాకు ప్రసాదించు.
నాప్రేమను నీ సేవలోఫలప్రదం చేసుకునేశక్తిని నాకు యివ్వు.
పేదవారినితిరస్కరించకుండా, అధికారగర్వంముందు తలవంచకుండావుండే బలాన్నినాకు అనుగ్రహించు.
సగర్వంగాతలయెత్తిరోజువారీ చిల్లరకష్టాలనుచూచి నవ్వే తత్వాన్నినాకు కలుగజేయి.
ప్రేమతోనా సర్వస్వాన్నీ నీ ఇచ్ఛకుసమర్పించే శక్తి నాలోప్రేరేపించు.

37
నాదీర్ఘ యాత్ర చివరకువచ్చిందని, నాలోశక్తి అంతా నశించిందని,నా ముందు త్రోవకనిపించడం లేదని,ప్రాధేయం అయిపోయిందని,ఎక్కడికో వెళ్ళి ఏకాంతంలోతలదాచుకునేసమయం వచ్చిందనిఅనుకున్నాను.
కానీనీ ఇచ్ఛ అనంతరం,పాతబడిన మాటలస్థానే కొత్త పాటలునాలో పలుకుతున్నాయి.
పాతబాటలు కనిపించకుండాచెరిగిపోయినచోట,కొత్త బాటలుకొత్త అందాలు చిందిస్తూ
బాహిరిల్లుతున్నాయి.

38
నీవేకావాలి....నీవే...నీవే..నీవే...కావాలి...ఇలా నా హృదయాన్నిఅహరహాలుజపం చేయనీ, ఇంతకన్నానాకు వేరే ఏమీ వద్దు.నా మనస్సులాగే ఇతరకోర్కెలన్నీ శూన్యమైనవి.
వెలుగుకోసంవేదనను రాత్రితనలో దాచుకున్నట్టు,నా హృదయాంతరాలలో'నీవే
కావాలి,నీవే కావాలి' అన్న మంత్రాక్షరాలనుదాచుకుంటాను. ప్రశాంతినిబెదరగొట్టేతుఫాను, ప్రశాంతిలోనేఅంతమైనట్టునీ ప్రేమపైనా తిరుగుబాటుకూడా 'నీ కోసమే..నీవే కావాలి'అనే మంత్రమేజపిస్తుంది.

39
క్షామంలోపృధ్వివలె గుండెయెండి బీటలువారినప్పుడు నాపై నీ దయావర్షంకురిపించి
సాక్షాత్కరించు.జీవితంలో అందచందాలునశించినప్పుడుఒక తీయని పాటలాసమీపించు.
నన్నువిదూర పంధాతర ధ్యానంనించి దూరం చేసేనిత్య కార్యక్రమరభస అన్నివైపులానన్ను చుట్టుముట్టినప్పుడు,నిశ్శబ్ద శాంతి మయమూర్తీశాంతిగా, విశ్రాంతిగా నా ముందుఅవతరించు.
భిక్షకునివలెపరాధీనమైన నాహృదయం ఒకమూల ముడుచుకునికూచున్న సమయాన,తలుపు బ్రద్దలుగాతెరిచి మహారాజా,సర్వవిధ రాజలాంఛనాలతోనాలో ప్రవేశించు.వాంఛ, విభ్రాంతితోమనస్సును అంధంచేసినప్పుడు. నిర్మలమూర్తీ, జ్ఞానీ నీ దీప్తితోశుభ్రగర్జతో నాకుకనిపించు.

40
నాశూన్య హృదిలోయెన్నాళ్ళయిందోఒక్క వాన చుక్కయినాకురిసి.
ఎంతవెదికినా ఆకాశంలో ఒక్కచిన్న మబ్బుతునకయినాకానరాదు.
నేడుకాకుంటే రేపైనా వానచినుకు పడుతుందనేఆశ లేదు. ఆకాశంలో మెరుపులచర్నకోలలు విసురుతూ,కోపో దీప్తమైన తుఫానువీచేట్లు చేయడమేనీ ఇచ్చ అవుతేఅలాగే తుఫానునుపంపు.
కానీ,ప్రభూ! నా హృదయాన్నిమాత్రం కాల్చివేస్తూనాకు వూపిరాడకుండా చేస్తున్నఈ నిశ్శబ్ద తీక్షణత్వాన్నిమాత్రం ఉపశమింపజేయి.తండ్రి కోపగించుకున్నరోజున, కన్నీటితోనిండిన తల్లిచూపువలె, నిర్భరమేఘానివై నీ చల్లదనాన్నిఅనుగ్రహించు.

[మార్చు] గీతాంజలి (41 - 50)

41
ప్రియా!నీవు వారందరికీ వెనకాలయెక్కడో నీడలలోదాగి నిల్చుని ఉన్నావు.నీవు లేవేమోఅనుకున్న వారందరూనిన్ను త్రోసుకుంటూనడిచి వెడతారు.
నేనిక్కడనా కాన్కలన్నీ పరుచుకొనినీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను.వచ్చిపోయేవారునా పూజాపాత్రలో ఒక్కొక్కపూవే ఏరుకొని పోతారు. నా పూజాపాత్ర ఖాళీ అవుతుంది.ఉదయమంతా నీ కోసంవేచి వున్నాను.మధ్యాహ్నంకూడా గడచిపోయింది.సాయంత్రమైంది.నీ కోసం వేచి వేచి,నా కండ్లు నిద్రతోతూగుతున్నాయి. ఇళ్ళకుతిరిగి వెళ్ళే వారునా వైపు చూచి, చిరునవ్వునవ్వి, నన్ను అవమానంతోముంచివేస్తున్నారు.ఒక బిచ్చగత్తెలాముసుగు కప్పుకుని ఒక మూలకూర్చున్నాను.
నీవుఇక్కడ కూర్చున్నావేం?నీకేం కావాలి? అని ఎవరైనాఅడిగినప్పుడు కండ్లుదించుకుంటాను,వారికి జవాబు చెప్పలేక.
నీకోసం నేను వేచి వున్నానని,నీవు తప్పకుండా వస్తావనివాగ్దానం చేశావని,నేను వారితో ఎలా చెప్పను?ఈ పేదరికాన్నే వరప్రసాదంగానీకు నేనిచ్చే కాన్కగాభరిస్తూ ఉన్నాననినేను పెదవి విప్పి వారితోఎలా చెప్పగలను.అవమానంతో ఈ భూమిలోక్రుంగిపోనూ? ఇలాగే ఈ అభిమానాన్నినా హృదయగర్భంలో దాచుకుంటున్నాను.
ఇలాఈ పచ్చని మైదానంలోకూర్చుని, నిర్మల నీలాకాశంవంకచూస్తూ హఠాత్తుగానీవు వస్తున్నట్లుకల కంటాను. దీపాలువెలుగుతాయి. బంగారుపతాకాలు నీ రథంపై ఎగురుతూవుంటాయి. త్రోవలోనిల్చున్నవారు నోళ్ళుతెరుచుకొని ఆశ్చర్యంతోచూస్తూ వుంటారు. నీవునీ రథం దిగి, వీధిప్రక్క కూర్చున్న ఈ బిచ్చగత్తెనుచేయిచ్చి లేవదీసిరథంలో నీ ప్రక్కనకూర్చుండబెట్టుకునితీసుకుని వెళతావు.నేను భయంతోచిన్న చిరుగాలికిపూల తీగె వణికినట్టువణుకుతూ నీ ప్రక్కనకూర్చుంటాను.
కానిఇది కల, నీవు రావు.కాలం గడిచిపోతుంది.నీ రథచక్రాల సవ్వడివినిపించదు. మరేవోఊరేగింపులు కోలాహలంగానా ముందునుంచిసాగిపోతాయి. అందరికీ వెనుకఆ నిశ్శబ్దచ్చాయలోనిలువవలసింది.నీవు ఒక్కడివేనా? నీకోసం వేచి వేచి, కన్నీరురాల్చి రాల్చి, హృదయంశుష్కించి వాడిపోవలసినదానిని నేను ఒకతెనేనా?

42
నీవూ,నేనూ తెల్లవారినవెంటనే పడవలోవెళ్ళిపోతామనిఅంతా గుసగుసలాడారు. మన
ప్రయాణంఈ ప్రపంచంలో ఎవ్వరికీతెలియదనీ,ఎక్కడికో, ఎందుకో మనంవెళ్ళిపోతామనిఅందరూ అనుకున్నారు.
మనంవెళ్ళేది ఏ దేశమూకాదనీ, మన యాత్రకుఅవధి లేదనీఅనుకున్నారు. తీరంలేనిఆ సాగరంలో మన పడవప్రయాణం చేస్తున్నప్పుడునీవు చిన్న చిరునవ్వుతోనా పాట వినాలని
కూచుంటే,నేను గొంతు విప్పి పాడతాను.సముద్ర తరంగాలలాగానాలోనుంచి తీయనిరాగాలు
మాటలబంధాలు త్రెంచుకునిస్వేచ్ఛగా బైటికివస్తాయి.
పడవబయలుదేరి వెళ్ళేతరుణం ఇంకా రాలేదా?ఇంకా మనం పూర్తి చేసుకోవలసినపనులు వున్నవా?
సాయంత్రమైంది.సముద్రంమీద ఎగిరేపక్షులు తమ గూళ్ళకుతిరిగి వెళుతున్నాయి.ఎప్పుడు ఈ బంధాలుతెగిపోతాయో?
ఎప్పుడుఈ పడవ కడపటిసూర్యకాంతి రాత్రిలోకిజారి కలిసిపోయినట్టుసాగరంలో బయలుదేరివెళుతుందో?

43
నీకోసం నేను అలంకరించుకునిసిద్ధంగా లేను.నీవు మామూలుమనిషివలె రహస్యంగా
నాహృదయంలోప్రవేశించి, నీ శాశ్వతముద్రను నా క్షణమాత్రజీవనంపై వదిలివెళ్ళావు.
ఈనాడునా జీవనక్షణాలపైనీ సంతకాన్ని నేనుచూచినప్పుడు,స్మృతిపథంలో
కలిసిపోయినసుఖదు:ఖాల ధూళిలోఆ క్షణాలు చెదురుగాపడి ఉండటం చూస్తాను.
నీవుఇంకా శిశువులా ధూళిలోఆడుకోవడం మరచిపోలేదు.నీ అడుగుల సవ్వడినా ఖేలాశాలలోవినిపించి తార నుంచితారకు వ్యాపించింది.

44
వెలుగునీడలాడే త్రోవప్రక్కన నిల్చి, వెలుగునీడల ఖేలనుగూడడం, తొలకరి చినుకులజల్లులు చూడడం-అదినాకో సంతోషం.
అజ్ఞాతవియత్పంథాంతరాలనుంచి సందేశవాహకులుకొత్త సందేశాలుమోసుకొని వస్తారు. నన్నుపిలిచి, అభినందించిత్రోవ ప్రక్కనే సాగివెళతారు. నా హృదయంలోలోపల ఆనందిస్తుంది.వెళ్ళిపోయే చిరుగాలికమ్మని తెరనువదిలి వెళుతుంది.
ఉదయంనుంచి సాయంత్రంవరకు ఇక్కడే వాకిట్లోకూచుంటాను, హఠాత్తుగాఏదో మధురక్షణంవస్తుందని ఎదురుచూస్తూ.ఈలోగా నాలో నేనే నవ్వుకుంటాను.నాలో నేనే పాడుకుంటాను.మధురక్షణం తప్పకవస్తుందనే వాగ్ధానంపరిమళంలా నా చుట్టూరానిండుతుంది.

45
చల్లనిఅతని అడుగుల చప్పుడునీవు యెన్నడూవినలేదూ?
అతనువస్తాడు, వస్తున్నాడు,ఎప్పుడూ వస్తుంటాడు.ప్రతిక్షణం, ప్రతియుగం,ప్రతిరోజు,
ప్రతిరాత్రి అతను వస్తూవుంటాడు, వస్తూనేవుంటాడు.
నామనస్సు పరి పరి విధాలపోయినప్పుడు నేనుయెన్నెన్నో పాటలుపాడాను. కాని అన్ని పాటలలోనూఒకే శ్రుతి వినిపించింది.అతను వస్తాడు,వస్తాడు. ఎప్పుడూ వస్తాడుఅని.
మధువసంత దినాలతోఅడవి బాటల నడచిఅతను వస్తాడు,వస్తాడు, వస్తాడు.
శ్రావణమాసవర్ష రాత్రులలోమిన్ను ఊగిసలాడే మేఘగర్జనలరథంలో అతను వస్తాడు,వస్తాడు, ఎల్లవేళలావస్తాడు.
కష్టంమీదకష్టం వచ్చినప్పుడు,అతని అడుగుల సవ్వడినా గుండెలపై వినిపిస్తుంది.అతని పాదాల స్వర్ణ స్పర్శనాలో ఆనందాన్ని వెలిగిస్తుంది.

46
ఏ విదూరసుదీర్ఘ కాలాంచలంనుంచి నీవు నన్నుకల్సుకోవాలని వస్తూవున్నావో నాకైతే
తెలీదు.సూర్యుడూ... తారలూ నిన్నునాకు దూరంగా వుంచలేదు.
అనేకఉదయాలలో, సాయంత్రాలలోనీ అడుగుల సవ్వడినాకు వినిపించింది. నీవుపంపిన దూత నా హృదయంచేరువకు వచ్చినన్ను రహస్యంగాపిలిచాడు.
ఈనాడునా జీవితం యిలా ఎందుకుసంతోషంతో పొంగులు వారుతూవున్నదో తెలియదు.ఏదో అపూర్వమైన ఆనందంనా హృదయాన్నిముంచెత్తుతూవున్నది. నా పనులన్నీకట్టిపెట్టవలసినతరుణం ఆసన్నమైనదేమో!నీ మధు సాక్షాత్కృతిమంద మనోహరపరిమళ సర్వత్రా వ్యాపించింది.
అతనికోసంనిరీక్షణలో రాత్రంతాగడిచిపోయింది. తెల్లవారినపిదప, అలసి సొలసి నేనుపక్కమీద ఒరిగి నిద్రించినతరువాత, హఠాత్తుగావస్తాడేమోననిభయం. మిత్రులారా!అతనికి త్రోవనివ్వండి.ఆపకండి. అతని అడుగులచప్పుడు విని నేనుమేలుకొనకపోతేనన్ను నిద్ర లేపకండి.పక్షుల కిలకిలా రావాలకు,ఉదయోత్సవ మందానిలస్పర్శకు నిద్రలేవడంనా అభిమతంకాదు.నా ప్రభువు నా గడపదగ్గరకు వచ్చినా,నన్ను నిశ్చలంగానిద్రించనివ్వండి.
అంతమైననా చిన్నారి నిద్రఅతని స్పర్శతో అదృశ్యంఅయ్యే భాగ్యం కోసమేకాచుకుని వుంది. అతనిచిరునవ్వు వెలుగులకేనా కనురెప్పలు విచ్చుకుంటాయి.ఒక స్వప్నంలా అతనునా ముందు నిల్చినప్పుడు,నేను కండ్లు విచ్చిచూస్తాను.
నాకన్నులు కాంచే అన్నిరూపాలకు అన్నివెలుగులకు తొలివెలుగుగా తొలిరూపంగా అతను నా ముందు ప్రత్యక్షంకావాలి.
నిద్రనుంచిమేల్కొన్న నా ఆత్మకుతొలి ఆనందోద్వేగం,అతని మధువీక్షణమేప్రసాదించాలి. అతనికోసం మళ్ళీ నేనుఇహంలో పడతాను.

47
ఉదయసమయాన మౌనగంభీర సాగరంలో పక్షులపాటలచిరు అలలు లేచాయి.
త్రోవప్రక్కన పూవులుసంతోషంతో కిలకిల నవ్వుతున్నాయి.మేము ఏమీ పట్టించుకోకుండామా త్రోవలో నడిచివెళుతున్నాము.మేఘాలు కదలి స్వర్ణరాసులను వెదజల్లుతున్నాయి.మేము పాటలు పాడటంలేదు. ఆటలూఆడటం లేదు.గ్రామంలో సంతకు వెళ్ళలేదు.మాట్లాడలేదు.నవ్వలేదు. త్రోవలోఅటూ-ఇటూ దిక్కులుచూడలేదు.ప్రొద్దెక్కే కొద్దీ త్వరత్వరగానడవసాగాము.
మధ్యాహ్నమైంది.సూర్యుడు నడినెత్తికివచ్చాడు.
గూళ్ళలోనీడలో చేరి పావురాళ్ళు'కుహూ' అంటున్నాయి.మర్రిచెట్టునీడలో కునుకు తీస్తున్నగొర్రెలకాపరి కలలుకంటున్నాడు. నేనుకొలను ప్రక్కనే పడుకొనిఅలసట తీర్చుకుంటున్నాను!
నాసఖులు నన్నుచూచి హేళనగానవ్వారు. సగర్వంగా తలెత్తుకొనివారి త్రోవన వారు పారిపోయారు.ఒక్కమాటు కూడా వారు వెనుదిరిగిచూడలేదు,ఒక్కక్షణం కూడా వారు విశ్రాంతితీసుకోలేదు. సాగిపోతున్నవారివంక నేను చూస్తున్నాను.వారు నడచి- నడచిదూరంగా కనిపించే విదూరవినీల పథంలో కలిసిపోయారు.ఎన్నెన్నో మైదానాలూ,కొండలూ, కోనలూ,లోయలూ దాటివెళ్ళారు.విచిత్ర, విదూర దేశాలుదాటి వెళ్ళారు. ఈ మహానంతపథ నిర్మాతవు నీవేప్రభూ.
నేనుమటుకు ఎక్కడికీ వెళ్ళలేదు.ఇక్కడే ఈ కొలను ఒడ్డునగడ్డి మైదానంలోపవళించి వున్నాను.ఒకరు వెక్కిరించి పోతారనినేను కూడా లేచియాత్ర చేద్దామనుకున్నాను.కాని లాభం లేదు.
నాపరాజయాన్ని సంతోషంతోస్వీకరించాను. సూర్యకాంతికిరణాలవంటిపచ్చని తమస్సుమెల్ల-మెల్లగానా మనస్సులో నిండింది!ఎందుకోసం ఈ ప్రయాణంచేశానో,యీ నీడలకూ, యీ పాటలమైదానానికీ ఎందుకని దాసోహమన్నానోనేనే విస్మరించాను.
చివరకునేను నా నిద్రనుంచిమేల్కాంచి కళ్ళుతెరచి చూసేసరికి,నీవు నా ప్రక్కనే నిల్చివున్నావు.నీ చిరునవ్వుతో నానిద్రని నిలిపివేస్తున్నావు.అయ్యో! ఎంత పిచ్చిదాన్ని!నీ వద్దకు చేర్చేపథం చాలా దూరమైందనీ,కంటకప్రాయమైందనీఅనుకున్నానే!

48
నీవునీ సింహాసనం నుంచిదిగివచ్చి, కుటీరద్వారంలోనిల్చున్నావు.
నేనునా కుటీరంలో ఒక మూలకూర్చుని ఒంటరిగా పాడుకుంటున్నాను.నా పాట నీ చెవులపడింది.
నీవుసింహపీఠంనుండిదిగివచ్చి నా కుటీరద్వారంలో నిల్చున్నావు.
నీదర్బారులో అనేకమందిమహావాగ్గేయకారకులున్నారు. వారు అన్నివేళలా అక్కడకీర్తనలు పాడుతూఉంటారు.
కానిఈ అల్పురాలి అమాయకగొంతుకే నిన్ను ఆకర్షించింది.విశ్వసంగీతంలో మేళవింపబడుచిన్న శ్రుతి. ఆశ్రుతికోసమే నీవునా కుటీరద్వారం వద్దకువచ్చావు. నాకు బహుమానంగాఇవ్వడానికి ఒక చిన్నపూవు తీసుకుని నా కుటీరద్వారంలో నిల్చున్నావు.

49
ఊరివీధిలో గడపకూ భిక్షార్థినైబయలుదేరినవేళ--- నీ బంగారు రథందూరంగా ఒక మహోజ్వలస్వప్నంలా కనిపించు. ఎవరబ్బాఈ రాజాధిరాజులనినేను ఆశ్చర్యపోయాను.
నాలోఆశలు చిగురించాయి. ఆకాశమంటాయి.నాకు పాడు కాలం గడిచిపోయిందికదా అనుకున్నాను. అడగకుండానేపెట్టే భిక్షకోసంధూళిలో అన్నివైపులావెదజల్లినసంపద కోసం వేచి నిల్చున్నాను.
నేనునిల్చిన చోటనేనీ రథం ఆగింది. నీ చూపునాపై వాలింది. చిరునవ్వునవ్వుతూ నీవురథాన్ని దిగివచ్చావు.చివరకు నా బ్రతుకుపండింది కదా అని సంబరపడ్డాను.అప్పుడు హఠాత్తుగానీవు నీ కుడిచేయిచాచి, 'నీవు నాకేం ఇస్తావు?'అని అడిగావు. ఒక రాజాధిరాజుఒక బిచ్చగత్తెనుచెయ్యిచాచి అడగడమనేదిఎంత పరిహాసమోచూడు! నాకు ఏం చేయాలోతోచక వెర్రిదానిలానిల్చున్నాను. అప్పుడునా సంచీలో నుంచిఒక చిన్న ధాన్యపుగింజను తీసి నీ చేతిలోఉంచాను.
నేనుభిక్షాటనం చేసిఇంటికి తిరిగి వచ్చినపిదప నా సంచీలో ధాన్యంక్రిందపోసి చూస్తే, ఆగింజల మధ్యఒక చిన్న బంగారపుగింజ కనిపించినప్పుడునేను నమ్మ లేకపోయాను. వెక్కి వెక్కిఏడ్చాను. అయ్యో నీవునన్ను 'నీవు నాకుఏమిస్తా'వని అడిగినప్పుడునా సర్వస్వం నీదేనని చెప్పేధైర్యం నాకు లేకపోయెనేఅనుకున్నాను.

50
చీకటిపడింది.చీకటి నలుదిక్కులాదట్టంగా అలుముకున్నది.పగలు, పని పాటలన్నీతీరిపోయాయి. చిట్టచివరిఅతిధి కూడా వచ్చివెళ్ళిపోయాడు.ఊళ్ళో యిళ్ళ తలుపులన్నీమూసి వేశారు. కొందరన్నారు,'ఇక ఒక్క రాజుగారు మాత్రమేరావలసి వున్నదని'మేము నవ్వి 'ఇదేంమాట' అన్నాము.
ఎవరోతలుపు తట్టినచప్పుడు వినిపించింది.గాలికి తలుపు చప్పుడయివుంటుందని వూరుకున్నాము,దీపాలు ఆర్పివేసి నిద్రకైప్రక్కల మీద పడుకున్నాము.కొందరన్నారు. 'బహుశాఆ వచ్చింది రాజుగారిదూత అయి వుండవచ్చునని'మేము నవ్వి-- 'అబ్బేఅదేం మాట! గాలికితలుపు చప్పుడైంది'అన్నాము.
ఆ తరువాతఅర్థరాత్రివేళఒక శబ్దం విన్పించింది.బహుశా దూరంగాఏదో పిడుగుపడి వుంటుందనిఅనుకున్నాము. భూమికంపించసాగింది. గోడలువూగిసలాడాయి. 'అదుగోరథచక్రాల చప్పుడు'అన్నారు ఎవరో ఒకరు. మేముసగం నిద్రలో, 'కాదు,అది మేఘ ఘర్జనలచప్పుడు' అన్నాము.
హఠాత్తుగాఢంకా శబ్దం వినిపించింది.'నిద్ర లేవండి.ఆలస్యం చేయకండి'అని ఒక కంఠస్వరం వినిపించింది.మేం భయంతో వణికిపోతూగుండెలు చేతులతోఅదుముకున్నాము. 'అదుగోరాజుగారి పతాక, ఆయనవస్తున్నాడు' అన్నారుఒకరు. మేము ఉలిక్కిపడిలేచినిలుచున్నాము.'ఇక ఆలస్యం చేయడానికివీలులేదు' అన్నాము.
'మహారాజువచ్చాడు. కాని ఏవీ దీపాలు?కాగడాలు? పుష్పమాలలు?ఆయన్ను ఆసీనుణ్నిచేయడానికి సింహాసనమేదీ?అయ్యో! ఎంత అవమానం!ఏం చేయాలి ఇప్పుడు?'
మాలోమేము త్రొక్కిసలాడాము.
'మీఅరుపుల వల్ల, ఆందోళనవల్ల లాభంలేదు. శూన్య హస్తాలతోఆయనకు స్వాగతమిచ్చినిరాలంకారంగా వున్నమీ గదులలోకి ఆయననుతీసుకొని వెళ్ళండి'అన్నారు ఒకరు.
తలుపులుతెరవండి. శంఖధ్వానాలతోమహారాజుకుస్వాగతమివ్వండి. ఈ అగాధనిశీధంలో మనఅంధగృహ చక్రవర్తిఅరుదెంచాడు. చీకటికాంతితో వణికిపోతోంది.చిరిగిన చాపను తెచ్చివసారాలో ఆయన కోసంవేయండి. హఠాత్తుగావచ్చిన తుఫానుతోపాటు,భయద
నిశీధచక్రవర్తి కూడా వచ్చారు.

 గీతాంజలి (51 - 60)

51
నీవునీ కంఠంలో ధరించినగులాబీ పూలమాలనునాకు ఇవ్వమని అడగాలనుకున్నాను.కాని నాకు ధైర్యం చాలలేదు.ఈ కోర్కెతోనే ఉదయం వరకువేచి వున్నాను.
నీవువెళ్ళిపోయిన తరువాతపక్కమీద రాలిన కొన్నిగులాబీ రేకులనుఏరుకుందామని. ఒకటిరెండు గులాబీ రేకులయినాదొరుకుతాయేమోననిబిచ్చగానిలా వెదికాను.
కానిఅప్పుడు నాకేం కనిపించిందనుకున్నావు?నీవు ప్రేమతో నాకోసంవిడిచివెళ్ళినచిహ్నం ఏమిటనుకున్నావు?పూలుకాదు. పరిమళాలువిరజిమ్మే సుగంధద్రవ్యాలూకాదు.అత్తరూ, పన్నీరులూకాదు. అగ్నిజ్వాలల్లాతళతళమెరిసే మెరుపుతీగ వంటినీ మహాఖడ్గాన్నివదిలివెళ్ళావు.లేత ఎండ కిటికీలోనుంచివచ్చి పక్కమీద పడింది.కిటికీ దగ్గరకు వచ్చినపిచ్చుక కిచకిచలాడుతూనన్ను ఇలా అడిగింది-'అమ్మాయీ! నీకు నీ ప్రియుడుఇచ్చి వెళ్ళినదేమిటి?పూలుకాదు. అత్తరులూపన్నీరులూ కావు-ఇదిగోఈ భయంకర ఖడ్గాన్నిఇచ్చి వెళ్ళాడు.'
నేనుఒంటరిగా కూర్చుని నాకేమీ అర్థంకాక ఇదేమి చిత్రమైనబహుమానంచెప్మా అని ఆలోచిస్తాను.విచిత్రమైనఈ బహుమానంఎక్కడ దాచాలో నాకు తెలీదు.అబలనైన నేనుఈ ఆభరణాన్ని ఎలాధరించను? ప్రేమతోహృదయానికిఒత్తుకుంటే ఇదినొప్పెడుతుంది. కానిఈ బాధాభారాన్ని నీవుఇచ్చిన బహుమతినిగౌరవంగా నా హృదయంలోదాచుకుంటాను. ఇక ఇప్పటినుంచిఈ లోకంలో నాకు ఎలాంటిభయం వుండదు.
నేనుచేసే ప్రతి సంఘర్షణలోనీకు విజయమే లభిస్తుంది.మృత్యువునునాకు మిత్రుడుగా వదిలివెళ్ళావు... నా జీవితంలోనేనీవు వదిలివెళ్ళినమిత్రునికి పట్టాభిషేకంచేస్తాను. నా బంధాలనుభేదించడానికిఈ ఖడ్గాన్ని యిచ్చివెళ్ళావు.
ఇకఈ లోకంలో నాకు ఎలాంటిభయములేదు.
ఇకఈనాటి నుంచి, నేనుఅన్ని ఆడంబరాలకు,అలంకారాలకు స్వస్తి చెబుతాను.హృదయేశ్వరా!ఇక ఈ చుప్పనాతితనానికిస్వస్తి. ఆభరణంగా ధరించమనిఒక మహా ఖడ్గాన్నినాకు ప్రసాదించావు. ఇకఈ బొమ్మల కొలువులఅలంకారాలతో నాకు నిమిత్తమేమిటి?
52
అందంగావుంది నీ చేతికిధరించిన కంకణం.
సహస్రవర్ణాల వజ్రవైఢూర్యాలు తాపినఆ కంకణం ఎంతో అందంగా వుంది.
కానీ,నీవు నాకు ప్రసాదించినఖడ్గం అంతకన్నమరీ అందంగా వుంది.
సంధ్యారుణాకారకాంతిలో గరుడపక్షి చాచినరెక్కలలా ఈ ఖడ్గాంచలాలుమెరుస్తున్నవి.
మృత్యుఘాతంలో జీవితంవెలిబుచ్చేకడపటి బాధానందరేఖలా ఖడ్గాంచలంప్రకంపిస్తోంది. భౌతికవాసననుయావత్తూ ఒక్కక్షణంలోభస్మీభూతంచేసే స్వచ్ఛ జ్వాలలామెరుస్తోంది నీవుప్రసాదించిన ఖడ్గం.తారలవలె మెరిసేవజ్ర వైఢూర్యాలుపొదిగిన నీ కంకణం అందమైనది.కాని,
మహేంద్రా!నీ ఖడ్గం అందం కానరానిది!అద్భుతం.
53
నీనుంచినేనేమీ కోరలేదు.నా పేరు కూడా నీ చెవిని వేయలేదు.వెళ్ళి వస్తావనినీవు సెలవు తీసుకొనివెళ్ళేటప్పుడునేను మౌనంగా ఒక్కమాటైనామాట్లాడకుండా నిల్చున్నాను.వాలుగా పడిన చెట్టునీడలోబావిగట్టున ఒంటిగానిల్చున్నాను. మట్టికుండలలోనీరు నింపుకుని ఆడంగులుఇళ్ళకు వెళ్ళిపోయారు.
'ప్రొద్దెక్కింది.నువ్వు రావూ?' అని నన్నుపిలిచారు. కాని నేను ఏదేదోకలలు కంటూ ఇక్కడేనిల్చిపోయాను.
నీవువచ్చేటప్పుడునీ అడుగుల చప్పుడునాకు వినిపించలేదు.దీనంగావున్న కళ్ళతోనావైపు చూచావు. అలసినకంఠస్వరంతో నీవు మెల్లగానాతో మాట్లాడావు.'నేనొక పాంధుణ్ని,నాకు దాహం వేస్తూంది'అన్నావు. పగటికలలలోమునిగివున్న నేనునీ మాటలు విని ఉలిక్కిపడి లేచినా కుండలోనుంచినీ దోసిట్లో నీరుపోశాను.పైన చెట్ల ఆకులుగలగలలాడాయి. చెట్లకొమ్మలలోదాగిన కోకిల కూజితంచేసింది. 'బాబ్లా'పూల పరిమళం త్రోవకొననుంచి తేలుతూవచ్చింది.
నాపేరేమిటో చెప్పమనినీవు అడిగినప్పుడునేను సిగ్గుతో తలవంచుకుని నిల్చున్నాను.
అవును,నీవు నన్ను ఎల్లప్పుడూగుర్తుంచుకోటానికి నేనుచేసిందేమిటి?
కానినీ దాహం తీర్చటానికినీరిచ్చానన్న జ్ఞాపకంఎప్పుడూ నా హృదయంలోపచ్చగా ఉంటుంది. నాహృదయాన్నిఎప్పుడూ మాధుర్యంతోనింపివేస్తుంది. చాలాప్రొద్దెక్కింది. వేపచెట్టుఆకులు గాలికి గలగలలాడుతున్నాయి.అలాగే బావి గట్టునకూచుని కలలు కంటున్నాను.

54
నీహృదయం యింకాతూగుతూనే వుంది.నీ కళ్ళలో ఇంకా నిద్రమబ్బులు తేలుతూనేవున్నవి.
ముళ్ళమధ్య గులాబీతలయెత్తిసగర్వంగా వూగుతూంది. కాలంవృధాచేయకు.మేలుకో! నిద్ర మేలుకో!
ఈ రాతిబాటచివర చీమ చిటుక్కుమన్నావినిపించే నిశ్చలనిశ్శబ్దంలో నా మిత్రుడునీకోసం ఒంటిగా కూచునిఉన్నాడు. అతన్ని మోసంచేయకు. మేలుకో!నిద్ర మేలుకో!
మధ్యాహ్నంఎండవల్ల ఆకాశం అలసటతోరొప్పితే నీకేమిటి?కణ-కణ కాలుతూవున్నఇసుక తన దాహపుదుప్పటిని భూమినిండాకప్పితే ఏమిటి?
నీహృదయాంతరాలలోఆనందం చిందులాడటంలేదా! నీ అడుగడుగునానీవు నడిచేపథ వీణ సంచలించిబాధా స్వరాలు పలకదా?
55
నాలోనీ ప్రీతి ఇలా సఫలీకృతమైంది.నాకోసం ఇలా నీవు మహోన్నతపీఠంనుంచి దిగి వచ్చావు.ప్రభూ! సర్వ స్వర్గ రాజాధీశ్వరా...నేనే కనక లేకుంటేనీ ప్రేమంతా ఏమై ఉండేది.
నీసర్వసౌభాగ్య సంపదకూనన్ను నీ భాగస్వామినిగాచేసుకున్నావు. నాహృదయంలోఅనవరతం నీ విలాసఖేల!నా జీవితంలో నీ ఇచ్చఅనవరతం నూతనరూపాలు ధరిస్తూ వుంది.
ఇందుకోసమేనా హృదయాన్నిఆకర్షించడానికి రాజరాజువైననీవు అలంకారాలు, ఆభరణాలుధరించి ముస్తాబుచేసుకున్నావు. ఇందుకోసమేనీ ప్రియురాలి ప్రేమలోనీ ప్రేమ విలీనమైత్వమేవాహంగాఐక్యమైనాయి.
56
జ్యోతీ!నా జ్యోతీ! జగజ్జోతీ!నా కంటి దీపమా!నా హృదయమధురోజ్వలదీప్తీ!
జ్యోతినృత్యం చేస్తున్నదిప్రియా! నా జీవనమధ్యంలో జ్యోతిపాడుతూ వుంది. ప్రియా,ప్రేమమయ స్వరాలుపలుకుతూ వుంది.ఆకాశం విచ్చుకుంది. గాలిపరుగులు తీస్తూంది.
నవ్వులూ,కేరింతలూ జగమంతానిండినవి. కాంతి సముద్రంలోసీతాకోక చిలుకలురెక్కలు విచ్చి ఈదుతూవున్నాయి. కాంతి తరంగాలనురుగులతో కలువలూ,మల్లెలు పుష్పిస్తున్నాయి.
కాంతిచెదిరి ప్రతి మేఘంపైస్వర్ణకాంతులు ప్రసరింపచేస్తోంది. ముత్యాలనువెదజల్లుతోంది.
ప్రియా!కొమ్మ కొమ్మకూ, రెమ్మరెమ్మకూ ఆనందం పరుగులుతీస్తూంది. ఆకాశ గంగ ఒడ్డులుత్రెంచుకుంది.ఆనందం సర్వత్రా వ్యాపించింది.
57
విశ్వంలోనిఆనందమయ రాగాలన్నీనా కడపటి గీతంలోకరిగి కలిసిపోవాలి. పచ్చనినీళ్ళతో పృథ్వినిప్రపుల్లం చేసే ఆనందం,కవలలను కలిపేఆనందం, జీవన్మరణాలనుమేళవించే ఆనందం,తుఫానులో వీచేఆనందం జీవితాన్నివూపుతూ మేల్కొలుపుతూపరిఢవిల్లిన ఆనందం....విచ్చుకున్న అరుణకమలంపై కన్నీటిబిందువులు రాలుస్తూకనిపించే ఆనందం,తన దానిని సర్వస్వం మన్నులోఒలకబోసుకునే ఆనందం...నాగీతంలో ధ్వనించాలి.
58
హృదయేశ్వరా!నాకు తెలుసు. ఇదంతానా ప్రేమే తప్ప మరేంకాదని, ఆకులపై చిందులాడేఈ బంగారు కాంతి, తూగుతూవూగుతూ మెల్లగాగగన తలంలోపయనించే ఈ మబ్బులు,నా నుదుటిని చల్లగాతాకి వెళ్ళిపోయేగాలి--- ఇదంతా నీ ప్రేమకునిదర్శనమే ప్రభూ.
ప్రభాతకాంతి నా హృదయంలోనిండింది. నా హృదయానికినీవిచ్చిన సందేశంఇదే. ఎక్కడో ఉన్నతపథం నుంచి ముఖంవంచి నీవు నా వంకచూస్తున్నావు. నీ కళ్ళునా కళ్ళలోకి చూస్తున్నాయి.నా హృదయంనీ పాదాలకు మోకరిల్లింది.
59
అనంతవిశ్వ సాగర తీరంలో పాపలుపోగవుతారు. పైన ఆకాశం, క్రిందఅవిరామంగా అలలు చెలరేగుతున్నసాగరం అనంతకోటిలోకాల సాగరతీరంలోపిల్లలు నవ్వుతూ,నృత్యం చేస్తూఆడుతూ, పాడుతూ పోగవుతారు.
ఇసుకగూళ్ళుకట్టిగవ్వలతో ఆటలాడుతారు.ఎండుటాకులను పడవలవలెసముద్రంలో వదిలి,నవ్వుతారు. అనంతవిశ్వసాగర తీరంలో పాపలుఆడుకుంటారు.
వారికిఈత రాదు. వలలువేసి చేపలు పట్టడంతెలీదు.
ముత్యాలఅన్వేషకులు ముత్యాలకోసంఉదధి గర్భంలోదిగుతారు. వర్తకులుతమ నావలలోదూర దేశాలకు తరలివెళతారు. పిల్లలుమాత్రం తీరంలోగవ్వలు ఏరి మళ్ళీవాటిని పారబోస్తూ వుంటారు.ఉదధి గర్భంలోనిఅమూల్య మణిమాణిక్యాల కోసంవెదకరు. వారికి వలలువేయడం తెలీదు.
సముద్రంఉత్తుంగగా పొంగి నురుగులనవ్వులు నవ్వుతుంది.మృత్యు తరంగాలుఅర్థం తెలియనిగీతాలను శిశువులకుపాడి వినిపిస్తాయి. తల్లిఊయలూపుతూ జోలపాటపాడినట్టు, సముద్రంపిల్లలతో ఆటలాడుకుంటుంది.నురుగుల నవ్వులుఒలకబోస్తుంది.
అనంతవిశ్వసాగర తీరంలో పాపలుపోగవుతారు.... గమ్యంలేనిఆకారంలో తుఫాను గర్జిస్తుంది.పడవలు పగిలిపోతాయి.మృత్యువు దూరంగాసాగరగర్భంలో తాండవిస్తుంది.
అనంతవిశ్వసాగర తీరంలో పాపలమహామేళజరుగుతుంది.
60
పసిపాపకంటిపై నిద్ర- ఎక్కడనుంచిఎలా వస్తుందో ఎవరికైనాతెలుసునా? అవును,దీన్ని గురించి ఒక కట్టుకథచెబుతారు. ఎక్కడోఉంటుందట నిద్ర,దేవలోకం లోన.
ఏ గ్రామంలోనో--ఎక్కడో మిణుగురు పురుగులకాంతులు మిలమిలమెరిసే అడవుల చీకటినీడల మధ్యనిద్ర తీసుకునివచ్చేరెండు పూలమొగ్గలువున్నవట. ఆమొగ్గల నుంచివస్తుందట నిద్ర.నిద్రించేటప్పుడుపసిపాప పెదవిపై తేలిఆడే చిరునవ్వు-అది ఎక్కడ పుట్టిందో
ఎవరికైనాతెలుసా? అవును,దీన్ని గురించి కూడా ఒకకట్టుకథ చెప్పుకుంటారు.చవితినాటి చంద్రునిపారిపోయిన కిరణం ఒకటివిచ్చుకొనిపోతున్నఒక వసంత మేఘం చలాన్నితాకిందని,
అక్కడఒకనాటి మంచుకురిసేఉదయాన తొలిగా ఈచిరునవ్వు పుట్టిందనీచెబుతారు.
పసిపాపఒంటిపై తొణికిసలాడేమిసిమి- ఇన్నాళ్ళూ ఎక్కడదాగి వుందో తెలుసా?పసిపాప తల్లి కన్నెపిల్లగాఉన్నప్పుడు, మృదులమోహన మధురప్రేమగా అది ఆ పిల్లఎదలో దాగివుంది.పసిపాప ప్రపంచంలో పడగానేఅది మిసిమిగా వికసించింది.

[మార్చు] గీతాంజలి (61 - 70)

61
అమ్మాయీ!నీకు నేను రంగు రంగులబొమ్మలు తెచ్చిపెట్టినప్పుడుమేఘాలలో అన్ని రంగులుఅలా ఎందుకు మిళితమైఖేలాలవుతాయోనాకు అర్థమవుతుంది.
రంగురంగుల పూలు ఎందుకుపుష్పిస్తాయో నాకు తెలుస్తుంది.
నృత్యంలోనీ అడుగులకు శృతి కలుపుతూనేను పాట పాడినప్పుడు,ఆకుల గలగలలలోసంగీతం ఎందుకు వినిపిస్తుందో?చెవివొగ్గి వినే పృథ్వివద్దకు సాగర తరంగాలుతమ సంగీత సందేశాన్నిఎందుకు పంపుతావో నాకు అర్థమవుతుంది.
నీకునేను తీయని మిఠాయివుండలు తెచ్చిపెట్టినప్పుడుపూలలో తేనెఎందుకని దాగి వున్నదో,తీయని మధురసంపండ్లలో ఎందుకనివున్నదో అర్థమవుతుంది.
నీవుచిరునవ్వు నవ్వుతావని,నీ ముఖాన్ని నేనుముద్దిడినప్పుడు,ఉదయ కాంతితో ప్రవహించేఆనందం ఏమిటో, వసంతమంద మలయానిలంశరీరాన్ని తాకినప్పుడుపులకరింపు ఎందుకు కలుగుతుందోనాకు బోధపడుతుంది.
62
అపరిచితులైనక్రొత్త మిత్రులతోనీవు నాకు పరిచయంచేశావు. నా ఇల్లుకాని ఇళ్ళలో నీవునాకు చోటు కల్పించావు.దూరాన్ని దగ్గరకు తీసుకొనివచ్చిఅపరిచితుణ్ణికూడా నాకు సోదరుని చేశావు.
అలవాటుపడిన ఆశ్రయాన్నివదిలిపెట్టాలంటేనా హృదయంలోఏదో బాధ. కొత్తస్థలాలలో కూడాప్రాచీనత కొంతవుంటుందని, అక్కడనీవు కూడా ఉంటావనివిస్మరిస్తాను.
జీవస్మరణాలమధ్యకాని, ఈ లోకంనుంచిమరొకలోకానికిగాని, ఎక్కడికినన్ను నడిపించాలో,నడిపించేదినీవే! నీవే నా అనంతజీవనసాగరంలో తోడునీడవు. అపరిచితనుతన అనుబంధాలతోనా హృదయాన్నికట్టివేస్తావు.
నీతోఒకసారి పరిచయం లభిస్తేచాలు-ఇక అపరిచితులంటూఎవరూ వుండరు. నీకు మూసినద్వారం ఏదీ వుండదు.
అందరితోకలిసి ఆనందంలో భాగంపంచుకొనే ఆ భాగ్యంనన్ను వదిలివెళ్ళకుండా నా ప్రార్థననుఅనుగ్రహించు.
63
ఒకటిగాప్రవహిస్తున్నఒక నది ఒడ్డున యేపుగాపెరిగిన గరిక బీడులోనుంచుని ఆ అమ్మాయినిఇలా అడిగాను.
అమ్మాయీదీపానికి ముసుగు అడ్డముగాఉంచి ఎక్కడకు వెళుతున్నావు?నా ఇల్లు చీకటిగావుంది. కొంచెం నీదీపాన్ని అరువిస్తావూ? అని.
అమ్మాయిఒక్క క్షణంపాటు తననల్లని కళ్ళెత్తినా వంక చూచి అస్తమయమైనతరువాత ఈ నదిలోనా దీప ప్రమిదను వదిలిపెట్టడానికివచ్చాను అన్నది.ఆ అమ్మాయి దీపం నదీతరంగాలలో తేలిపోతూఉండడం అలాగే ఒడ్డుననిల్చుని చూశాను. నిశ్శబ్దంగాచీకట్లు క్రమ్ముకునివస్తూ వుండగా మళ్ళీఆ అమ్మాయిని ఇలా అడిగాను.
అమ్మాయీ,నీవు నీ దీపాలన్నీవెలిగించావు. ఇప్పుడునీవు ఈ దీపం తీసుకునిఎక్కడికి వెళుతున్నావు?నా ఇల్లంతా చీకటిగుయ్యారంగా వుంది. కొంచెంనీ దీపాన్ని అరువిస్తావా అని.ఆ అమ్మాయి తన నల్లనికళ్ళెత్తి ఒక నిమిషంఅలాగే మౌనంగా నిల్చునిఇలా చెప్పసాగింది.నా దీపాన్ని ఆకాశానికి సమర్పించడానికివచ్చాను అన్నదిఆ అమ్మాయి. ఆ అమ్మాయి దీపంఅలాగే శూన్యంలో నిరర్థకంగావెలిగిపోతూ ఉండడాన్నిచూస్తూ నిల్చున్నాను.
వెన్నెలలేని అర్థరాత్రి మళ్ళీఆ అమ్మాయిని యిలా ప్రశ్నించాను.అమ్మాయీ! హృదయానికిదాపులో వున్న జ్యోతితోదేనికోసం వెదుకుతున్నావు?ఈ ఇల్లంతా చీకటిగుయ్యారంగా వుంది. కొంచెంనీ జ్యోతిని నాకు అరువిస్తావా?అని. ఆ అమ్మాయి ఒక క్షణంపాటుఆలోచించి నా ముఖంవైపుచూచి, దీపాలఉత్సవంలో పాల్గొనడానికినేను నా దీపాన్ని తెచ్చుకున్నానుఅన్నది. అనంతకోటిదీపాలలోఆ అమ్మాయి దీపం కూడా వెలిగిపోతూఉండడం చూచాను.

64
పొంగిపొరలే నా జీవితపాత్రికనుంచి నీవు ఆశించేనిత్య పానీయం ఏమిటిప్రభూ!
కవీ!నీ కల్పన నా కళ్ళలోప్రతిఫలించడంచూచి, నీ పాటలువినడానికి నా చెవులదగ్గర నిరీక్షించడం,అది నీకొక విలాసమా?
నీప్రపంచం నా మనస్సులోమాటల అల్లికఅల్లుతోంది. నీ అవసరంఆ మాటలకు స్వరాలువేస్తోంది. ప్రేమతోనిన్ను నీవు నాకు సమర్పించుకుంటావు...ఆపిదప నీ మధురిమనుయావత్తూ నాతోఆస్వాదిస్తావు.

65
నాహృదయాంతరాలలోకనిపించీ కనుపించనిసంధ్యాకాంతుల మధ్యదాగిన ఆమెను, ఉదయసమయకాంతిలో సైతంముసుగు తీయని ఆమెనునా కడపటి గీతంలోపొదిగి-నీకు చివరి కాన్కగాసమర్పించుకుంటానుదేవా!
మాటలుఆమెను మభ్యపెట్టచూచాయి. కాని విఫలమైనాయి.వేడికోలు తనదీర్ఘ బాహువులనుచాచినా ఆమెను స్పృశించలేకపోయింది.
నాహృదయ పేటికలోఆమెను దాచుకొని దేశదేశాలుతిరిగాను. ఆమె చుట్టూనా జీవితం పెరిగి విరిగింది.
నేనుఏం పనులు చేసినా,ఏ ఆలోచనలు చేసినా,ఏ కలలుకన్నా అన్నిటికీ,ఆమె అభినేత్రి.కాని ఆమె వాటిని అంటకుండాఅతీతంగా వుండేది.
అనేకులునా ఇంటి తలుపుతట్టి ఆమెకోసంఅడిగారు. కాని లాభంలేకనిరాశతో వెనుతిరిగివెళ్ళారు.
ఆమెనుముఖాముఖిగా ప్రత్యక్షంగాచూచినవారు ఈ లోకంలోఎవరూ లేరు. ఆమె ఇంతకాలంనీ గుర్తింపుకోసం ఎదురుచూస్తూఒంటరితనంతో వేచివున్నది.

66
విహాయాసానివినీవే, విహాయానంలోపక్షులు విశ్రమించే గూడుకూడా నీవే.
సౌందర్యమూర్తీ,ఆ గూటిలో నీ ప్రేమఆత్మలు అనేక శబ్దాలతో,రంగులతో, పరిమళాలతోకప్పివేస్తుంది.
కుడిచేతిలోబంగారు బుట్ట తీసుకునిముఖాన్ని పూలదండఅలంకరించుకుని, నిశ్శబ్దంగాపృథ్విని అలంకరించడానికిఉదయం నడచివస్తుంది.
గొర్రెలకాపరులు విడిచి వెళ్ళినపచ్చికబీళ్ళలోప్రశాంతంగా సాయంత్రంపరుచుకుంటుంది. పశ్చిమప్రశాంత అజ్లధినుంచిబంగారు కుండలో నీరుతీసుకొనివచ్చి, పచ్చికపైచల్లగా చల్లుతుంది.
కానిమానవాత్మ స్వేచ్ఛగావిహరించే అనంతవిహాయాన పధంలోపరిశుద్ధ అమలినస్వచ్ఛకాంతి రాజ్యంచేస్తుంది. అక్కడపగలులేదు. రాత్రిలేదు.రంగులూ...రూపాలు లేవు.మాటలేదు,పాటలేదు.

67
చాచినచేతులతో తొలిసూర్యకిరణం పృధ్వినిస్పర్శించి నా ముంగిటనిలుస్తుంది.
నాకన్నీరు, విశ్వాసలు, పాటలూనీకు చేరే సుదీర్ఘదినంప్రారంభమవుతుంది.
అత్యంతఆదరంతో నీవు ఆ మంచుమబ్బునునీ గుండెలకు అదుముకుంటావు.అనేక రంగులలో, అనేకరూపాలలో దాన్ని చిత్రిస్తావు.ఓ స్వేచ్ఛ మహోదాత్తమూర్తీ-అంతతేలికగా, మృదువుగా,కన్నీటితో కరిగిపోతూవుంటుంది. కాబట్టేనీవు ఆ మెత్తని మబ్బునిఅంతగా ప్రేమిస్తావు. అందుకనేఆ మేఘం నీ భయదస్వచ్చతను కాంతినితన కరుణా స్పదచ్చాయలతోకప్పివేస్తుంది.

68
అహరహాలు,నా నరనరాలలోప్రవహించేజీవన స్రవంతియే,ఈ లోకంలో తాళరాగలయబద్ధంగాప్రవహిస్తోంది.
అహరహాలు,నా నరనరాలలోప్రవహించేజీవన ధూళిలోఅణువణువులోచిందులాడే ఆనందంలో,కొమ్మ కొమ్మలో, రెమ్మరెమ్మలో ప్రవహిస్తున్నది.
జీవనమరణ మహాసాగరపుఆటుపోట్లు ఊయలలోఊదిన జీవనస్రవంతి ఇదే.
ఈ సజీవలోకస్పర్శవల్ల నా శరీరంలోప్రతి అవయవంనూతన చైతన్యంతోతొణికిసలాడింది.
యుగయుగాల జీవనస్పందన ఈ క్షణానకూడా నా రక్తంలో నృత్యంచేస్తోంది.

69
ఈ లయవిన్యాసంలో సంతోషించవూనీవు?
ఈ భయదఆనందపు సుడిగుండంలోగిర్రున తిరగవూ నీవు?
ప్రపంచంలోఅన్నీ పరుగెత్తి పోతున్నాయి.ఏవీ ఆగవు. వెనుదిరిగిచూడవు. ముందుకుసాగిపోతాయి. ఏ శక్తీ వాటినిఆపుచేయలేదు.
ఈ అవిరామసంగీతార్పిత గీతితోశ్రుతి కలుపుతూఋతువులు వస్తాయి,వెళతాయి. పాటలపరిమళాలతో, రంగురంగుల ముస్తాబుతోఋతువులు వచ్చివెళతాయి.

70
నన్నునేను నానా రూపాలుగా సృష్టించుకుని,నీ స్వచ్ఛ కాంతిపై- నీడలు ప్రసరించడంనీ మాయా ఖేల.
నీలోనేనీవొక అగడ్త కట్టుకునివేరుపడిన నీ వ్యక్తిత్వాన్నిఅనంతకోటి శృతులతోపలుకుతావు..నీవుఇలా నీ నుంచి నీవువేరుపడడం వల్లనేనేను దేహాన్నిధరించాను... నీవుపాడిన మహోజ్జ్వలగీతం గగనవీధిలోరంగురంగుల కన్నీరుగా, చిరునవ్వులుగా,ఆశలుగా, ఆవేదనలుగాప్రతిధ్వనించింది.
అలలులేచి మళ్ళీపడిపోతాయి...కలలుచెదిరి మళ్ళీపొదుగుతాయి. నీ స్వీయ పరాజయానికేనేను ప్రతిబింబాన్ని-
నీవుఎత్తిన యీ తెరపైఅహరహాలకుంచెతో అనేక చిత్రాలురచించావు. ఈ తెరవెనుక నీ విచిత్రరహస్య సింహాసనంఉన్నది. నీ, నా మహోత్సవకాంతి వియత్తలమంతటాపరుచుకుంది.
నీవూ,నేనూ కలసి పాడినమంగళగీతం వాతావరణమంతటాప్రతిధ్వనించింది.
నీనా దాగుడు మూతలతోయుగయుగాలు గడిచిపోతాయి.

[మార్చు] గీతాంజలి (71 - 80)

71
అతనేనా అంతరాంతరాలలోవున్న వ్యక్తి.
తనఅగాధ రహస్యస్పర్శతో నాలోని నన్నుమేల్కొలుపుతాడు.
ఈ కళ్ళలోనిమాయా మోహనత్వానికిఅతనే కారణం. నా హృదయతంత్రులు మీటిసుఖదు:ఖ గీతాలుపాడేది అతనే.
రంగురంగుల మాయావల్లరినిఅల్లేది- అతనే.అతని పాదాలు స్పృశించినప్పుడునన్ను నేను మరచిపోతాను.
రోజులువస్తాయి. వెళతాయి.యుగాలు గడిచిపోతాయి.అనేక నామాలతో నాహృదయాన్నిచూరగొన్న వ్యక్తిఅతనే.
72
సర్వసంగపరిత్యాగంలో కాదు నాకువిముక్తి లభించేది.అనంతకోటి అనురాగబంధాలతో నేనుస్వేచ్ఛను కౌగిలించుకుంటాను.
ఈ జీవనమృణ్మయ పాత్రలో,వివిధ వర్ణాల, పరిమళాల,మధుపానీయాన్నిఅనునిత్యం నాకోసం నీవునింపుతూ వుంటావు. నీదీప్తితో అనంతకోటిదీపాలు వెలుగొందుతాయి.నా ప్రపంచంలో, ఈ దీపమాలతోనీ ఆలయ ప్రాంగణాన్నిఅలంకరిస్తాను.
ఇంద్రియానుభూతినినిగ్రహించానునేను.... వాటి ద్వారాలుఎప్పుడూ తెరిచేవుంటాయి.
నేనుదేన్ని చూచినా,దేన్ని అలకించినా,దేన్ని స్పృశించినాఅంతటా నువ్వే వుంటావు.
నాభ్రాంతులన్నీపటాపంచలై ఆనందదీప్తి నాలో వెలుగొందుతుంది.నా వాంఛలన్నీనిర్భర ప్రేమ ఫలాలుగాఫలిస్తాయి.
73
సూర్యుడుఅస్తంగతుడైనాడు.
ప్రపంచమంతటానీడ వ్యాపించింది.
నీళ్ళుతేవడానికి నేనుఏటికి వెళ్ళాలి.
నీటిఅలలపై తేలేవిషాద మర్మర ధ్వనులతోసాయంకాలం పవనాలునన్ను ఆహ్వానిస్తున్నాయి.బైటికి రమ్మనినన్ను పిలుస్తున్నాయి.
వీధినిర్జనంగా వుంది.
ఒక్కపాంథుడైనా కనిపించడంలేదు.
గాలిఉత్సాహంగా వుంది.
నదిలోఅలలు ఉరుకులెత్తుతున్నాయి.తిరిగి నేను ఇంటికిచేరుకోగలనో, లేదోతెలీదు.
దారిలోనాకు ఎవరెదురవుతారో?దూరంగా నదిలో పడవలోనిఅజ్ఞాత వ్యక్తివేణునాదం వినిపిస్తోంది.

74
మర్త్యులమైనమాకు నీవిచ్చే వరాలుమా కోర్కెలన్నింటినీఫలప్రదం చేస్తాయి.
అయినా,నీ అనుగ్రహంఅనంతమైనది.
నదిప్రతి దినం పొలాలగుండా,పల్లెల గుండా ప్రవహిస్తుంది.అయినా, అనంతమైననదీజలాలునీ పాదాలు తాకడానికే ప్రవహిస్తాయి.
పూవుతన పరిమళంతోగాలిని మధురితంచేస్తుంది. అవి తననితాను నీకు అర్పణ చేసుకోవడమేదాని పరమావధి.
ఈ లోకంలోనీ పూజకేం కొరత లేదు.
కవివాక్కుల నుంచి అనేకులుఅనేక విధాలుగా అర్థం చెప్పుకుంటారు.కాని దాని పరమార్థం నిన్నేసూచిస్తుంది.
75
ప్రభూ!
అనుదినంనీ సన్నిధిలో ముఖాముఖిగాముకుళిత హస్తాలతోనిలుస్తాను.
శాంతగంభీర నిర్మల నీలాకాశంక్రింద, వినీలిత హృదయంతోనీ సన్నిధిలో నిల్చుంటాను.
నీవుసృష్టించిన ఈ బాధాభరితలోకంలో శ్రమ, ఆందోళన,సంఘర్షణల మధ్యపరుగులెత్తే అసంఖ్యాకప్రజలమధ్య,నీ సన్నిధిలో నిల్చుంటాను.
ఈ లోకంలోనా పని అంతా పూర్తి అయిన పిదప,ఒంటిగా, మౌనంగా నీముందు నిల్చుంటాను.
76
నీవునా దేవుడవనితెలుసు. అందుకనేనీకు దూరంగా వుంటాను.నీవు వాడివేననితెలియక దగ్గరకురాను.
నీవునా తండ్రివని తెలిసినీ పాదాలకు వందనంచేస్తాను. కాని స్నేహితునికరాన్ని గట్టిగా పట్టుకున్నట్టునీ కరాన్ని పట్టుకోలేను.
నన్నునీవు నీ దానిగా స్వీకరించేచోటనేను నిలిచి వుండను.నిన్ను నా హృదయానికిహత్తుకుని మిత్రుడవనిఅనుకోను.
నాఅన్నలలో నీవుఅన్నవు. కాని నా అన్నలనునేను లెక్కించను.వారికి భాగం పెట్టాకనా సంపాదనంతా నీతోనేపంచుకుంటాను.
సుఖదు:ఖాలతోమనుష్యుల ప్రక్కనేను వుండను.అందుకనే నీ ప్రక్కనవుంటాను.
జీవితాన్నిత్యజించడానికివెనుకాడతాను. అందుకనేజీవన మహాదధిలోఅడుగుపెట్టలేను.
77
తొలిగాసృష్టి ప్రారంభించినప్పుడు-
తారలతొలి వెలుగులుధగద్ధగాయమానంగావెదజల్లినవేళ.
దేవతలందరూగగనవీధిలో చేరిఎంత చక్కని సృష్టి!ఎంత మహానందం!అని ఏక స్వరంతో పాడారు.
కాని,ఇంతలో హఠాత్తుగాఎవరో కేకవేశారు. కాంతివాహినిలో ఏదోచీలిక కనిపిస్తోంది.ఒక నక్షత్రం అదృశ్యమైందిఅని.
కేకవిన్న వెంటనే దేవతలవీణ స్వర్ణ తంతువుఆగిపోయింది. అవును, ఆవెళ్ళిపోయిన తారకఅన్ని తారకలలోకి శిరోమాణిక్యంఅన్నారు దేవతలు.
నాటినుంచి నేటివరకుతప్పిపోయిన ఆ తారక కోసంఅన్వేషణ సాగుతూనేవున్నది. లోకంతన ఆనందాలలోఒకదాన్ని కోల్పోయిందన్నఆ కేక వినిపిస్తూనే వున్నది.
రాత్రివేళలలోకమంతా నిద్రించినతరువాత నిశ్శబ్దంలోతారలు చిరునవ్వునవ్వుతూ తమలోతాము ఇలా గుసగుసలాడుకుంటాయిఈ అన్వేషణ నిరర్థకం. అమలినపరిపూర్ణత ఏనాడో గడిచిపోయిందిఅని.
78
ఈ జీవితంలోనిన్నుకలుసుకునే భాగ్యానికినేను నోచుకొనకపోతే,నీ దర్శన భాగ్యాన్నినేను జారవిడుచుకున్నట్టుభావిస్తాను.
జాగ్రదావస్థలోను,స్వప్నావస్థలోను ఈవిషాదభారాన్ని మోసేఅవసరాన్ని నాకు కలిగించు.
జీవితమనేక్రిక్కిరిసిన సంతలో,నా రోజులు చెల్లిపోయి,రెండు చేతులూభోగభాగ్యాలనుపోగుచేసుకోనప్పుడు,నేను ఆర్థించిందిఏమీ లేదనే భావాన్నినాలో కలిగించు.
ఒక్కక్షణం కూడా నా యోచనాపథంనుంచి ఈ భావననుమరలించకు, జాగ్రదావస్థలోను,స్వప్నావస్థలోను,ఈ విషాద భారాన్ని మోసేఅవకాశాన్ని నాకు కలిగించు.
అలసిసొలసి రోడ్డుమీద నేనువిశ్రమించేటప్పుడుధూళిలో నా పాన్పుపరుచుకునేటప్పుడు,ఈ అనంత యాత్రఇంతటితో ముగియలేదనేభావాన్ని నాలో కలిగించు.
ఈ విషాదభావాన్ని సర్వావస్థలలోభరించే అవకాశంనాకు కలిగించు.
ఆనందోత్సాహాలతో,మేళతాళాలతో,నవ్వులతో నా గృహాంగణంప్రతిధ్వనించేటప్పుడు,నీ ఆహ్వానం కోసం చేసినఆడంబరం ఇది కాదనేభావాన్ని నాలో కలిగించు.జాగ్రదావస్థలో,స్వప్నావస్థలో ఈ వేదనాభారాన్ని మోసే శక్తి నాకుప్రసాదించు.
79
సూర్యుడా!
గగనవీధిలోగమ్యంలేక సంచరించేశరన్మేఘ శకలాన్ని నేను.
నీకిరణం నన్ను స్పర్శించి,నన్ను కనికరించి,నన్ను నీ కాంతిలోవిలీనం చేసుకోలేదు.
నన్నుఇలా నీకు దూరంగా వుంచడమేనీకు విలాసమయితే,ఈ నా శూన్యతనే స్వీకరించి,రకరకాల రంగులు చిత్రించిఆనందించు.
రాత్రివేళ,నీవు నీ ఖేలనువిరమించుకున్నప్పుడుమళ్ళీ రాత్రిలోనేను దాగిపోతాను.లేక స్వచ్చ ధవళఉదయ మందహాసంలోనో,చల్లని సంధతలోనోకరిగి కలిసిపోతాను.
80
ఏమీతోచని దినాలలో,ఏమీ సాధించకుండా గడిచిపోయిన కాలాన్ని గురించిచింతించసాగాను.కాని చెయ్యి జారిపోయినకాలం లేదు ప్రభూ!నా జీవితంలోని ప్రతిక్షణాన్ని నీవు తీసుకున్నావు.
ప్రపంచంలోనిప్రతి వస్తువులోఅంతర్నిహితంగాదాగివుండి, బీజాలనుమొక్కలుగా, మొగ్గలుగా,పుష్పాలుగా, ఫలాలుగామారుస్తున్నావు.
అలసిసొలసిఏమీతోచక పక్కమీద పడుకునివున్నాను. పనులన్నీముగిసిపోయాయని అనుకున్నాను.
తెల్లవారిలేచి చూసేసరికి,నా పూలతోట నిండా అద్భుతమైనపుష్పాలు పూచి ఉండటంచూచాను.

[మార్చు] గీతాంజలి (81 - 90)

81
నీచేతులలోనికాలం అనంతమైంది.ప్రభూ! క్షణాలులెక్కించడం ఎవరితరం?
రాత్రులూ,పగళ్ళూ గడిచిపోతాయి.యుగాలు పూలలాపూచి, పూలలా రాలిపోతాయి.కాని కాలానికి అతీతంగావుండడం నీకు తెలుసు.
ఒకచిన్న గడ్డి పూవునుఅలంకరించడానికి నీకుయుగాల కాలం పడుతుంది.
కానిమాకు ప్రతిక్షణం విలువైంది.ఆలస్యాలకు మేముసాహసించము.
అడిగినప్రతివానికి నా పూజాకుసుమాలను యిచ్చివేస్తాను. చివరకునీ సాన్నిధ్యంలో సమర్పించాలంటేఒక్క పుష్పం కూడా మిగలదు.సాయంత్రం కాగానే నీఆలయ ద్వారం మూసివేస్తారేమోనన్నభయంతో త్వరపడివస్తాను. కాని నేనువచ్చేసరికి యింకా చాలాసమయం మిగిలి వుంటుంది.
82
అమ్మా!నా విషాదాశ్రువులతో,నీకోసం ఒక ముత్యాలమాలగుచ్చుతాను.
నీపాదాలను అలంకరింపజేయడానికితారకలు కాంతి కంకణాలనుసంతరించాయి.
కాని,నేను కూర్చిన హారంనీ కంఠసీమనే అలంకరిస్తుంది.
కీర్తి,సిరిసంపదలు నీ నుంచేఉద్భవిస్తాయి.
వాటినిమాకు ప్రసాదించినా,తిరస్కరించినా అదినీ చేతుల్లోనేవుంది.
కానినా దు:ఖం మాత్రంపూర్తిగా నాదే. ఈ అశ్రుమాలనుసమర్పించినప్పుడునీ అనుగ్రహాన్నినాకు ప్రసాదిస్తావు.
83
ప్రపంచమంతటాపరివ్యాప్తమై, అనంతాకాశపథంలో అనంత రూపాలనుప్రసవించేది విరహవేదన.
తారతారలోమినుకు మినుకుమని మనవైపునిశ్శబ్ద దృక్కులుప్రసరించేది ఈ విరహవిషాద వేదనమే.
శ్రావణమాసవర్షరాత్రి, ఆకులగలగలలో పాటగావినిపించేది ఈ విరహవిషాద వేదనమే.
వాంఛగా,ప్రేమగా రూపొంది, ఇంటింటా,సుఖదు:ఖాలు కలిగించేదిఈ విరహ విషాద వేదనమే.నా కవి హృదయాన్నికరిగించి పాటలు పాడించేదిఈ విరహమే.
84
యోధులుతమ యజమానిమందిరం నుంచిబయటికి వచ్చినప్పుడునీరసంగా, నిస్సహాయంగాకనిపించారు. వారి శక్తినీ, సామర్థ్యాన్నీ,ఆయుధాలను ఎక్కడదాచారో మరి వారు తమయజమాని మందిరంనుంచి బయటఅడుగు పెట్టగానే వారిపైశరవర్షం కురిసింది.
యోధులుమళ్ళీ వారి యజమానిమందిరంలో అడుగిడినతరువాత వారి అస్త్రశస్త్రాలను యెక్కడదాచారో? వారి శక్తి ఏమైందో?
వారుఖడ్గాన్ని దించివేశారు.అస్త్రశస్త్రాలనువిసర్జించారు. వారి ముఖాలలోప్రశాంతత తాండవించింది.వారు తమ యజమానిమందిరంలో అడుగుపెట్టిన రోజునతమ జీవనఫలాన్ని వెనుక వదలివెళ్ళారు.
85
నీవునీ సేవకుని మృత్యువునునా వద్దకు పంపావు.
అతడుఅజ్ఞాత సముద్రంలోప్రయాణం చేసినీ సందేశాన్ని తీసుకొనినా యింటికి వచ్చాడు.
రాత్రిచీకటి. నా హృదయంలోయేదో భయం.అయినా నేను దీపం తీసుకునివాకిటివరకు వెళ్ళి,తలుపు తెరచిఅతన్ని లోనికి ఆహ్వానిస్తాను.నా వాకిట నిల్చివున్నదినీవు పంపిన దూతయేకదా!
ముకుళితహస్తాలతో, కన్నీటికాన్కలతో అతన్నిపూజిస్తాను.
నాహృదయ సర్వస్వాన్నిఅతని పాదాలవద్దవుంచుతాను.
అతడుతను వచ్చినపని ముగించుకుని తిరిగివెళతాడు- ఉదయంలోఒక నల్లని నీడనువిడిచి.
నానిర్జన గృహంలోనా పరిపక్వ అంతరాత్మ ఒకటేనీ కోసం కాన్కగా తెల్లవారిలేచి చూసేసరికి,నా పూలతోట నిండా అద్భుతమైనపుష్పాలు పూచి ఉండటంచూచాను.
86
ఆమెతప్పకుండా కనిపించి తీరుతుందనిగదిలో మూలలన్నీవెతుకుతాను, కాని ఎక్కడాఆమె జాడ కనుపించదు.
నాఇల్లే అసలు చిన్నది.ఏ వస్తువైనా నా యింట్లోపోతే మళ్ళీదొరకదు.
కాని,ప్రభూ! నీ భవనంఅనంతమైంది. ఆమెనువెదుకుతూ నేనునీ భవనం వద్దకువచ్చాను.
నీసాయంకాలపు ఆకాశపు చాందినీఛాయలో నిల్చొని,ఆతురతతో కండ్లెత్తినీ ముఖం వంక చూస్తాను.శాశ్వతాంచలంలో నిల్చానునేను.
ఇకఇక్కడ, నా నుంచి అదృశ్యమయ్యేదిఏదీ వుండదు. ఇక్కడఆశలేదు, ఆనందంలేదు. కన్నీటితెరలలో నుంచిచూచే ముఖసీమలేదు.
నాశూన్య జీవనపాత్రికను ఆ మహోదధిలోముంచి, పరిపూర్ణతప్రసాదించు.
ఈ విశ్వజనీనమధుస్పర్శను మరొకసారినన్ను అనుభవించనివ్వు.

87
ఓ శిధిలాలయదైవమా?
భగ్నవీణతంత్రులు ఇక నిన్నుకీర్తిస్తూ గానం చేయవు.
నీపూజా సమయాన్ని సూచిస్తూసంధ్యా ఘంటికలుమ్రోగవు.
నీచుట్టూ నిశ్చలనిశ్శబ్దం తప్ప మరేమీలేదు.
నీశూన్యాలయంలో అప్పుడప్పుడుదేశ దిమ్మరివంటివసంతకాలపు గాలిప్రవేశించి నిన్నుపలకరించి వెళుతుంది.నీకు పుష్పాల పూజ లేకున్నాపుష్పాలవద్ద నుంచిసందేశాలు తెస్తుంది.
నీవునిరాకరించిన వరం కోసం,నీ పాత కాలపు భక్తుడుయింకా నీ ఆలయ ఆవరణలోపిచ్చివానిలా పరిభ్రమిస్తాడు.
సాయంకాలంవేళ, వెలుగునీడలు,ధూళిలో తపస్సులోకలిసి కరిగిపోయేటప్పుడు,అతడు అలసి సొలసిక్షుధార్తహృదితోనీ శిధిలాలయాన్నిచేరుకుంటాడు.
పండుగలూ,పబ్బాలూ లేవయ్యానీకు.
పండుగరోజులు నీ గుళ్ళోదీపం వెలిగించేదిక్కైనా లేకుండావెళ్ళిపోతాయి.
నీవుఇలాగే వున్నావు. అనేకకొత్త విగ్రహాలుచెక్కి ప్రతిష్టిస్తున్నారు.కాని వాటి కాలం వచ్చినప్పుడుఅవి అజ్ఞాతంలో పడిపోతున్నాయి.
శిధిలాలయదైవమా? నిన్నుయెవరు లెక్కచేస్తారు?

88
'బిగ్గరగామాట్లాడకు' అజ్ఞాపించాడునా స్వామి. అందుకనే గుసగుసలుగారహస్యంగానే అతనితోమాట్లాడతాను.నా హృదయంచెప్పదలచిందిమెల్లని పాట ద్వారాఅతనికి అందజేస్తాను.రాజుగారి సంతకు అందరూపరుగులు తీస్తూ వెళతారు.అమ్మేవారూ, కొనేవారూ అంతాఅక్కడే వున్నారు. కానినాకు సంతకు వెళ్లడానికిసెలవు మంజూరుకాలేదు.
89
మృత్యుదేవతనీ తలుపు తట్టినప్పుడునీవు ఏమి సమర్పిస్తావు?
నాఅతిధి ముందునేనూ, నా పరిపూర్ణ జీవనపాత్రికను ఉంచుతాను.వట్టి చేతులతోఅతన్ని వెళ్ళనివ్వనునేను.
వసంత,శరద్రాత్రులు, నేనుకన్న తీయని కలలన్నీఅతనికి సమర్పిస్తాను.నా జీవన సంపాదనంతాఅతని మ్రోల ఉంచుతాను.
చరమదినమున మృత్యువతిధివైవచ్చి, నా తలుపుతట్టినా వెరగొందను.
90
మరణమా!నా జీవన చరమసాఫల్యమూర్తీ! ఏదీ,నా వద్దకు వచ్చినాకు నీ రహస్యం చెప్పు.నీ కోసమే రోజురోజునిరీక్షించాను. నీ కోసమే జీవనసుఖదు:ఖాలు భరించాను.
నాకలలు, నా ఆశలు, నాఆశయాలు, నా ప్రేమలు,నా సర్వస్వం రహస్యంగానీకు అభిముఖంగానేప్రవహించాయి.
ఒక్కసారినా వంక నీ చూపు ప్రసరించు.అంతే చాలు. నా బ్రతుకంతానీకు వశమైపోతుంది.
వరునిమెడలో అలంకరించడానికికూర్చిన పూలమాలసిద్ధంగా వుంది. వివాహంకాగానే వధువు తనగృహాన్ని విడిచి,తన ప్రభువునుఒంటరిగా ఏకాంత రాత్రిలోకలుసుకుంటుంది.

[మార్చు] గీతాంజలి (91 - 102)

91
ఈ లోకంనా దృష్టి నుంచి అదృశ్యమయ్యేరోజు ఒకటి వున్నదని,జీవితం కళ్ళపైకడపటి తెరదించి, నిశ్శబ్దంగాసెలవు తీసుకుని వెళుతుందనినాకు తెలుసు.
అయినాఆనాడు కూడా రాత్రివేళగగనంలో నక్షత్రాలునిరీక్షిస్తూ ప్రకాశిస్తాయి. సుఖదు:ఖాలనుఎగరవేస్తూ కాల సముద్రంలోగంటలు నిశ్వసిస్తాయి.
ఈ కడపటిక్షణాలను నేనుతలుచుకున్నప్పుడు,క్షణాలకు క్షణాలకుమధ్య అగడ్తలునశించి, మృత్యుదీపంసాయంతో, నీ లోకంలోనిఅనంత నిధులనుకాంచ గలుగుతాను.వేటికోసం వాంఛించానో,ఏవి నాకు లభించాయోవాటిని నశించని.నేను కోరి తృణీకరించిన వాటినేనాకు ప్రసాదించు.
92
నేనుసెలవు తీసుకోవలసినసమయం వచ్చింది.సోదరులారా! నాకు ఇక సెలవునివ్వండి.తలవంచి మీ అందరికీనమస్కరించి పయనమైవెళుతున్నాను.
ఇదుగోండి-నాఇంటి తాళపు చెవులనుతిరిగి ఇస్తున్నాను తీసుకోండి.నా ఇంటిపై హక్కులన్నీమీకు ఇచ్చి వేస్తున్నాను.నేను కడపటిసారిగామిమ్మల్ని అడిగేదినాలుగు చల్లనిమాటలతో నాకు సెలవుఇప్పించమని మాత్రమే.
చాలాదినాలు నేను మీతోకలిసి నివసించాను.నేను మీకు యిచ్చినదానికంటే ఎక్కువగామీ వద్దనుంచిస్వీకరించాను. ఇప్పుడు తెల్లవారింది.నా చీకటి కొంపలోదీపం ఆరింది. నన్నురమ్మని ఆదేశం వచ్చింది.ఇక నేను వెళ్ళడానికిసిద్ధంగా వున్నాను.
93
నేనుమిమ్మల్ని వీడి వెళ్ళేటప్పుడునా శుభం కోరండి మిత్రులారా!
ఆకాశంఅరుణోదయ రేఖలతోసిగ్గిలి ఎర్రబారింది.నా ముందు నా త్రోవఅందంగా పరుచుకుంది.
అక్కడికినేను ఏమి తీసుకుని వెడుతున్నాననినన్ను అడగకండి.శూన్యహస్తాలతోఆతృత హృదయంతోనేను బయలుదేరివెళుతున్నాను.
ఈనాడునా పెండ్లినాటి పూలదండధరిస్తాను. యాత్రికులుసహజంగా ధరించేకాషాయం కాదు నా వస్త్రం.
త్రోవలోఅనేక ప్రమాదాలున్నా,నా మనస్సులో భయావేశంలేదు.
నాయాత్ర ముగిసేసరికి,సంధ్యాతార ఉదయిస్తుంది.రాజుగారి మొగసాల సంధ్యగీతాలువినిపిస్తాయి.

94
ఈ జీవితంలోఅడుగిడిన తొలి క్షణంనాకు జ్ఞప్తిలేదు.
అడవిమొగ్గ అర్థరాత్రి వికసించినట్టువిశాల లోకంలో నన్నువికసింపజేసిన శక్తి ఏమిటోనాకు తెలీదు.
తెల్లవారిలేచి చూచేసరికిఒక్క క్షణంలో యీ లోకానికినేను అపరిచితుణ్ణికానున్న విషయం నాకుతెలిసింది. నామరూపరహితమైనఒక అనిర్వచనీయ శక్తినన్ను నా తల్లిఒడిలో వుంచినట్లుతెలిసింది. ఆ అనిర్వచనీయశక్తి,నా తల్లిగా రూపమొచ్చింది,నన్ను తన ఒడిలోలాలించింది.
ఇదేరీతి, మృత్యువులోసైతం ఇదే అనిర్వచనీయశక్తినాకు సాక్షాత్కరిస్తుంది.జీవితాన్ని ప్రేమిస్తున్నాను,కాబట్టే మృత్యువునుకూడా ప్రేమించ గలుగుతున్నాను.పిల్లకు పాలిచ్చేతల్లి కుడి స్థనంమార్చినప్పుడు శిశువురోదిస్తుంది. కాని ఎడమస్థనం పానం చేసివెంటనే ఓదార్పు పొందుతుంది.

95
నేనుమిమ్మల్ని వీడి వెళ్ళేటప్పుడుకడపటిసారిగా ఒక్కమాటచెప్పి వెడతాను.నేను ఇక్కడ యీ లోకంలోచూచింది అత్యద్భుతం!
కాంతిసాగరంపై పరుచుకున్న ఈ కమలంలోదాగిన రహస్యమధువును రుచిచూచాను.
చాలధన్యుణ్ణి,ఇదే నేను మీలో చివరిసారిగాచెప్పదలచినమాట. అనంత వేషాలయీ నాటక మందిరంలోనా పాత్ర నేను ధరించాను.రూపంలేని అతన్నికూడా అక్కడే నేను చూచాను.స్పర్శాతీతమైనఅతని స్పర్శతో నా శరీరం యావత్తూపులకించింది, సమాప్తిఇక్కడే సమీపిస్తే సమీపించనివ్వండి.ఇదే నా ఆఖరిమాట.

96
నీతోనేను ఆడుకున్నప్పుడునీ వెవరని నేనుప్రశ్నించలేదు.భయంకాని, లజ్జకాని లేకుండా కులాసాగాజీవితం గడిచింది.
ప్రతినిత్యం ఉదయాన్నేవచ్చి నిద్ర మేల్కొల్పినీవు నన్ను తీసుకునివెళ్ళేవాడివి. కొండలలో,కోనలలో నన్నుతిప్పేవాడివి.
ఆ రోజులలోనీవు నాకు పాడి వినిపించినపాటలకు అర్థమేమిటోతెలుసుకోడానికి నేనుయత్నించలేదు.నేను కూడా నీతో గొంతుకలిపి పాడాను. అంతే---నాహృదయం నీపాటలకు నృత్యంచేసింది.
ఇప్పుడుఆట పాటల రోజులుగడిచాక, నా ముందునిల్చిన ఈ విచిత్రదృశ్యం, ఇదేమిటి?అనంతకోటి నిశ్శబ్దతారకలతో లోకం నీ పాదాలచేధ్వనిస్తున్నది.

97
నాపరాజయాల పుష్పమాలికలతోనిన్ను అలంకరిస్తాను.పరాజయం పొందకుండావుండడం ఎన్నడూనాకు అలవాటు లేదు.
పరాజయంలోనా గర్వం విధ్వంస మవుతుందనినాకు తెలుసు. నా జీవితంబాధతో బంధాలుత్రెంచుకుంటుందనినాకు తెలుసు. నా శూన్యహృదయం వెక్కివెక్కి ఏడుస్తూ శూన్యగీతంఆలపిస్తుందని, గీతంవిన్న రాయి కూడా కరిగి కన్నీరైప్రవహిస్తుందనీనాకు తెలుసు.
పద్మసహస్ర దళాలుఎల్లప్పుడూ మూసుకునేఉండవనీ, పద్మ దళాలతోమధువు ఎల్లప్పుడూఅలాగే వుండదనీనాకు తెలుసు. నీలాకాశంనుంచి,ఒకే ఒక నేత్రం నా వైపుచూచి నిశ్శబ్దంగానన్ను పిలుస్తుంది.నా కోసం మిగిలేది ఏదీలేదు.నీ పాదాలవద్ద నేనుస్వీకరించేది కేవలంమృత్యువే.

98
నేనుచుక్కాని వదిలినప్పుడు,ఇక నీవే నౌక నడపవలసినసమయం వచ్చిందనినాకు తెలుసు.
ఎలాజరగవలసి వుంటేఅలా జరుగుతుంది.ఇక ఈ ఆయాసం వృధా.
ఇకఅనవసరంగా ఈ యాతనఎందుకు? నీ పరాజయాన్నిశాంతంగా భరించు.ఈశ్వరుడు నిన్ను ఎక్కడకూర్చుండబెడితే,అక్కడ నిశ్చలంగా కూర్చోడమేనీ భాగ్యంగా భావించు.
ప్రతిచిన్న గాలి విసురుకూనా దీపాలు ఆరిపోతున్నాయి.వీటిని వెలిగించుకునేయత్నంలో నేనుఇతర విషయాలన్నీమరచిపోతున్నాను.
కానీఇకముందు నేను జాగరూకతతోవుంటాను. నేలపైనచాప పరుచుకుని చీకటిలోవేచి వుంటాను.నీకు మనసైనప్పుడునిశ్శబ్దంగా వచ్చిఇక్కడ ఆశీనుడివి కా.

99
రూపరహితమైనఆణిముత్యాన్నిఅన్వేషిస్తూ అనంత కోటిరూపాల జలధిగాహంలో మునిగిపోతాను.
ఎన్నోతుఫానులకు చెదిరినఈ నా నావలో, ఇక రేవునుంచి రేవుకు ప్రయాణంచేయడం మానివేశాను.
అమరత్వంలోమరణించడమేఇప్పుడు నా ఆసక్తి.
అగాధసాగర గర్భంలోనికి, మౌనతంతువులు సంగీతంపాడే చోటికి, నా జీవనవీణను మోసుకొని పోతాను.
కడపటిరాగం పాడిన పిదప, నిశ్శబ్దపాద సన్నిధిలో ఈవీణను సమర్పిస్తాను.
100
నాజీవితంలో ఎల్లప్పుడూనిన్ను నా పాటలలోవెదికాను. లోకంలోగడప నుంచి గడపకుపాట పాడుతూ సంచరించాను.
నేనునేర్చిన పాఠాలన్నీనాకు నేర్పింది ఈ పాటలే.
ఈ లోకంలోనిరహస్య పదాలనుఈ పాటలే నాకు చూపాయి.నా హృదయదిగాంచలంలో అనేకతారకలు ఉదయించాయి.
సుఖదు:ఖాల విచిత్రసీమకు ఈ పాటలే నాకుబాట చూపాయి.
కడకునీ భవన ద్వారానికిచేర్చాయి.

101
నీవునాకు తెలుసుననినేను అందరితో చెప్పుకునిగర్వించాను.
నేనుచేసే ప్రతి పనిలోనీ ప్రతిబింబంవారికి కనిపిస్తుంది.
అప్పుడువారు 'ఎవరితను?' అనినన్ను ప్రశ్నిస్తారు.
వారికిఎలా సమాధానం చెప్పాలోనాకు బోధపడదు.
వారునన్ను నిందించి,వెక్కిరించి వెళ్ళిపోతారు.
నీకథలు గీతాలుగా పాడతాను.నేను దాచాలనుకున్నరహస్యం నా గుండెలనుఖేదించుకుని బైటికివస్తుంది. వారు నా దగ్గరకువచ్చి, 'నీ పాటలకుఅర్థమేమిటో చెప్పవూ?'
అనిప్రశ్నిస్తారు. వారికి ఎలాజవాబు చెప్పాలోనాకు తెలీదు. వారునన్ను చూచినవ్వి తృణీకరించివెళ్ళిపోతారు. నీవుమాత్రం అక్కడ చిరునవ్వునవ్వుతూ కూర్చుంటావు.

102
ఒకేఒక అభివందనంలోదేవా నా ఇంద్రియాలన్నీవిస్తరించి, నీ పాదాలవద్దఈ ప్రపంచాన్ని స్పృశించనివ్వు.
శ్రావణవర్షధార మేఘం వలెనా మనస్సు వినీతంగావంగి నీ ద్వారం వద్దనీకు అభివందనంచేయనివ్వు.
నాపాటలలోని వివిధస్వరాలన్నీ కలిసి ఒకే ఒక వాహినిగానిశ్శబ్ద సాగరంలోకి ప్రవహించినీకు అభివందనంచేయనివ్వు.
ఇంటిపైమనస్సు మరలి కొండలలోతమ గూళ్ళకు మరలివెళ్ళే పక్షుల బారులా,నా జీవితమంతా తనశాశ్వత గృహానికి యాత్రచేసిన ఒకే ఒక అభివందనమైనీ పాదాలు స్పృశించనివ్వు.
నేంస్పేసులు
వైవిధ్యాలు
    చర్యలు

      • Powered by MediaWiki
      • Wikimedia Foundation