Tuesday, June 5, 2012

ఇటీవల గ్లోబల్‌ ఇంటగ్రేటరీ సర్వీసెస్‌ అనే సంస్థ గత 50 ఏళ్లలో భారతదేశంలో రూ. 20 లక్షల కోట్లు లూటీ జరిగిందని బహిర్గతం చేసిందని తెలిపారు. ఈ 20 లక్షల కోట్ల కేవలం నల్లధనమేనని చెప్పారు. స్మగ్లింగ్‌, అవినీతి, అక్రమాలకు సంబంధం లేకుండానే కార్పొరేట్‌ సంస్థలు, కోటీశ్వరులు ఈ డబ్బును తీసుకెళ్లి స్విస్‌ బ్యాంకు, బెర్ముడా, లక్సంబర్గ్‌ లాంటి చోట్ల దాచారని తెలిపారు.

కోటీశ్వరులు, కార్పొరేట్‌ సంస్థల అధినేతలు, బడారాజకీయ వేత్తలు కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల గ్లోబల్‌ ఇంటగ్రేటరీ సర్వీసెస్‌ అనే సంస్థ గత 50 ఏళ్లలో భారతదేశంలో రూ. 20 లక్షల కోట్లు లూటీ జరిగిందని బహిర్గతం చేసిందని తెలిపారు. ఈ 20 లక్షల కోట్ల కేవలం నల్లధనమేనని చెప్పారు. స్మగ్లింగ్‌, అవినీతి, అక్రమాలకు సంబంధం లేకుండానే కార్పొరేట్‌ సంస్థలు, కోటీశ్వరులు ఈ డబ్బును తీసుకెళ్లి స్విస్‌ బ్యాంకు, బెర్ముడా, లక్సంబర్గ్‌ లాంటి చోట్ల దాచారని తెలిపారు. వీటి ఖాతాదారుల వివరా లు ప్రభుత్వం వద్ద ఉన్నాయని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వీటి ఖాతాదారుల పేర్లు చెప్పమంటే అది బ్యాంకు నిబంధనలకు విరుద్ధ మని చెబుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేద రైతుల పేర్లను మాత్రం బహిర్గతం చేస్తారని చెప్పారు. దేశం నుంచి తరలిపోయిన 20 లక్షల కోట్ల డాలర్లలో 50 శాతం డబ్బు ప్రపంచీకరణ తర్వాతే తరలి వెళ్లిందని అన్నారు. దాదాపు 2 వేల అకౌంట్లలో ఈ డబ్బు ఉందని తెలిపారు. ఈ ధనమే వస్తే దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అక్రమంగా డబ్బును బ్యాంకుల్లో దాచే ఖాతాదారులు ఇండియాలోనే ఎక్కువ అని ఐఎంఎఫ్‌ రిపోర్టు చెబుతుందని అన్నారు. దేశంలోని రైతులు అప్పులు దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. 1995 నుంచి 2010 వరకూ దేశంలో 2.56 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇందులో 2/3వ వంతు ఐదు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 30 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీలు ఇస్తారు కానీ వ్యవసాయ రంగానికి మాత్రం ఇవ్వరని విమర్శించారు. మెర్సిడెన్‌ బెంజిలాంటి కార్లు కొంటే 7 శాతం వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులు రైతులు ట్రాక్టర్లను కొంటే 12 శాతానికి ఇస్తున్నా యని అన్నారు. సాధారణ రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో బయట 24శాతం వడ్డీకి అప్పులు తెచ్చుకుని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయరంగంలో గత ఐదేళ్లలో పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థలైన టాటా, అంబాని, నీరారాడియా లాంటి వారు దేశాన్ని పాలిస్తున్నారని తెలిపారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది టాటా, అంబాని లాంటి వారు నిర్దేశిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అని తెలిపారు.

No comments:

Post a Comment